అన్వేషించండి

Grapefruit: లగ్జరీ ద్రాక్ష.. ఒక్క పండు తినాలంటే రూ.35,000 ఖర్చుపెట్టాలి

ద్రాక్ష పండు ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయి. కానీ ఈ ప్రత్యేకరకం మాత్రం అందరూ కొనలేరు.

నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష, ఎరుపు ద్రాక్ష... ఇలాంటి ద్రాక్ష రకాలు తెలుసు. కానీ వీటిల్లో కూడా అత్యంత ఖరీదైన ద్రాక్ష రకం ఉంది. అది మనదేశంలో పండదు. కేవలం జపాన్ లో మాత్రమే పండుతుంది. పేరు రూబీ రోమన్. ప్రస్తుతం ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన ద్రాక్ష. 2020 సంవత్సరంలో ఈ రూబీరోమన్ ద్రాక్ష గుత్తిని వేలం వేశారు. ఆ గుత్తిలో కేవలం 30 పండ్లు మాత్రమే ఉన్నాయి. అది 12,000 డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే కేవలం ఒక్క పండు 400 డాలర్లకు అమ్ముడుపోయింది. అదే మనరూపాయల్లో చెప్పుకోవాలంటే ఒక పండు రూ.35,000. అదే గుత్తి మొత్తం సొంతంచేసుకోవాలంటే మన కరెన్సీలో  తొమ్మిది లక్షల రూపాయల దాకా చెల్లించుకోవాలి. 

ఎందుకంత గొప్ప?
రూబీ రోమన్ అన్ని చోట్ల పండదు. జపాన్లోని ఇషికావా అనే ప్రాంతంలో మాత్రమే రూబీ రోమన్ ఎదగగలిగే వాతావరణం ఉంటుంది. ప్రకృతిలో చాలా అరుదైన పండ్లలో ఇవీ ఒకటి. ఏడాదికి కేవలం 24,000 ద్రాక్ష గుత్తులు మాత్రమే కాస్తాయి. వీటి పంట చేతికొచ్చేందుకు దాదాపు పద్నాలుగేళ్లు పడుతుంది. సాధారణ ద్రాక్షతో పోలిస్తే ఇవి పరిమాణంలో పెద్దవి. వీటిని ప్యాక్ చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్యాక్ చేసే ముందు వాటి నాణ్యత, రంగు పూర్తిగా పరీక్షిస్తారు. ప్రతి పండు కనీసం 20 గ్రాముల బరువు, 18 శాతం కంటే ఎక్కువ చక్కెరను కలిగి ఉంటేనే దాన్ని మార్కెట్లోకి పంపిస్తారు. ఇక వీటిల్లో కూడా ప్రీమియం రకానికి చెందిన పండ్లు కనీసం 30 గ్రాముల బరువు ఉండాలన్న నియమం ఉంది.  చాలా పరీక్షలు పాసయ్యాకే ఆ పండ్లను మార్కెట్లోకి పంపిస్తారు. 

పుట్టి పదమూడేళ్లు...
రూబీ రోమన్ ద్రాక్షను తొలిసారి పండించింది 2008లో. ఈ కొత్తరకం ద్రాక్షకు ఏ పేరుపెట్టాలని ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేశారు. చివరికి రూబీ రోమన్ అనే పేరును ఎంచారు. ఇప్పుడివి ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆహార పదార్థాల జాబితాలో చేరాయి. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Also read: గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరుగుతారని తినకుండా పడేస్తున్నారా? ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారు?

Also read: ఆకుకూరల గురించి అపోహలు వీడమంటున్న ఆయుర్వేదం

Also read:  పుట్టగొడుగులు శాకాహారమా? మాంసాహారమా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?

Also read: నెలసరి నొప్పి భరించలేకపోతున్నారా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget