అన్వేషించండి

Palak Paneer: పాలక్ పనీర్ కాంబో చాలా ఫేమస్, కానీ ఆ కాంబినేషన్ తినకపోవడమే మంచిది

పాలకూర - పనీర్ కలిపి వండడం చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

ఉత్తరాదిలో పాలక్ పనీర్ కర్రీ చాలా ఫేమస్. రోటీకి జతగా దీన్ని ఇష్టంగా తింటారు. ఆ అలవాటు దక్షిణాది రాష్ట్రాలకు కూడా చేరింది. ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా మెనూలో పాలక్ పనీర్  కచ్చితంగా ఉంటుంది. విడివిడిగా చూస్తూ పాలకూర, పనీర్ రెండూ ఆరోగ్యకరమైనవే. కానీ ఆ రెండూ కలిపి తింటే మాత్రం ఆరోగ్యానికి హాని కలుగుతుంది అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఈ రెండింటినీ కలిసి తినప్పుడు అందులోని పోషకాలను శరీరం శోషించుకోకుండా ఆ రెండూ అడ్డుకుంటాయని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. 

ఎందుకు వద్దు?
ఆహారంలోని పోషకాలు శరీరం సరిగ్గా శోషించుకుంటేనే అవి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే కొన్ని రకాల పోషకాలు ఒకేసారి తినకూడదు. అవి ఒకదాని శోషణను మరొకటి అడ్డుకుంటాయి. అలాంటి రెండు ఇనుము, కాల్షియం. కాల్షియం నిండి ఆహారం తినప్పుడు, ఇనుముతో నిండిన ఆహారాన్ని కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల ఇనుమును శరీరం శోషించుకోకుండా కాల్షియం అడ్డుకుంటుంది. పాలకూరలో ఇనుము అధికంగా ఉంటుంది. ఇక పనీర్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ రెండూ కలిపి తినడం వల్ల శరీరం ఏ పోషకాన్ని శోషించుకోలేదు. 

పాలకూర తింటే
పాలకూరలో ఇనుము ఎక్కువని చెప్పుకున్నాం కదా, ఈ ఇనుము ఊపిరితిత్తులకు నుంచి ఇతర అవయవాలకు ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి అవసరమైన హిమోగ్లోబిన్‌ను తయారు చేయడానికి శరీరానికి సహాయపడుతుంది. ఇనుము లోపిస్తే తీవ్రమైన అలసటతో పాటూ ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.పాలకూరలో క్యాలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు అధికంగా ఉంటాయి. పొటాషియం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే దీన్ని తినడం వల్ల కంటి సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి. కంటి శుక్లాలు, మచ్చల క్షీణత వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ కె అధింగా ఉంటుంది. పాలకూర తినడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. ఇందులో విటమిన్ ఎ ఆరోగ్యకరమైన కణజాలాన్ని అందిస్తుంది.  రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే హిమోగ్లోబిన్ తయారు చేయడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. 

పనీర్ వల్ల...
పాల ఉత్పత్తి అయిన పనీర్‌లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది. పనీర్ తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ దూరమవుతుంది. అలాగే గుండె జబ్బులు తగ్గుతాయి. మధుమేహులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. రక్తంలోని షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. 

Also read: కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget