అన్వేషించండి

Vegetables: కూరగాయలను పచ్చిగా తినేస్తున్నారా? జాగ్రత్త, ఈ సమస్యలు వేదిస్తాయ్!

మీకు పచ్చి కూరగాయలు తినే అలవాటు ఉందా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇలా చేయకపోతే అనారోగ్యం బారిన పడతారు.

దొండకాయ, బెండకాయ, క్యారెట్ ఇలా పచ్చి కూరగాయాలను చాలా మంది తింటూనే ఉంటారు. పచ్చి కూరగాయాలను తినడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిని సలాడ్ రూపంలో లేదా జ్యూస్ చేసుకుని తాగడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. అనేక వ్యాధులను కూడా దూరం చెయ్యడంలో సహాయపడుతుంది. పచ్చి కూరగాయల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. వాటిని వండుకుని తినే క్రమంలో అందులోని పోషకాలు కొన్ని నశించిపోతాయి. వీటిలో ఉండే మినరల్స్, విటమిన్స్ రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయని నిపుణులు కూడా చెప్తారు.

వాస్తవానికి పచ్చి కూరగాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యాన్ని ఇచ్చినట్టే అమితంగా తీసుకునే హాని కూడా చేస్తాయి అనే విషయం ఇందులోని వర్తిస్తుంది. పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా హాని కలుగుతుందని ఆయుర్వేదం చెప్తోంది. పచ్చి ఆహారాన్ని అధికంగా తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్స్, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వండిన ఆహరం కంటే పచ్చి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం శరీరానికి కష్టంగా మారుతుంది. దీని వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. కొన్ని ముడి ఆహార పదార్థాల్లో యాంటీ న్యూటియంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వాస్తవానికి ఇవి పోషక శోషణని పూర్తిగా అడ్డుకుంటాయి. అందుకే వాటిని ఉడికించిన తర్వాత తీసుకోవమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే తినొద్దు  

వికారం, మైకం, అలసట, పొట్ట ఉబ్బరం. అతిసారం వంటి లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే పచ్చి కూరగాయాలు తినడం ఆపేయండి. ఈ సంకేతాలు కనిపిస్తే అవి మీ శరీరానికి సరిగా లేవని అర్థం చేసుకోవాలి. వాటిని మితంగా మాత్రమే తీసుకోమని హెచ్చరిస్తున్నట్టు అర్థం. పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే అవి పరాన్నజీవులకి ఆవాసంగా మారతాయి. ఇవి కేవలం కడగటం ద్వారా పోవు. అందుకే వాటిని ఉడకబెట్టిన తర్వాత తీసుకుంటే మేలు.

ఇలా తినాలి

ఆకుపచ్చ కూరగాయలు తేలికగా ఉడికిపోతాయి. వాటితో కొద్దిగా సుగంధ ద్రవ్యాలు వేసి ఉడికించుకోవాలి. కాయధాన్యాలు, సూప్ లు, తృణధాన్యాలు లేదా ఇతర కూరగాయాలతో ఆకు పచ్చ కూరగాయలని కలిపి ఉడికించుకోవాలి. కూరగాయలను అల్యూమినియం, రాగి పాత్రలో వండకూడదు.

ఈ పచ్చి కూరగాయలు తినొద్దు

బచ్చలికూర, కాలీఫ్లవర్ వంటివి పచ్చివి తినకపోవడమే మంచిది. వీటిలో ఆక్సలెట్స్ ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్ళని ఏర్పడేలా చేస్తాయి. పెద్ద మొత్తంలో వీటిని తినడం వల్ల ఐరన్, కాల్షియం శోషణని తగ్గిస్తుంది. పచ్చి కాలేలో థైరాయిడ్ గ్రంధి పనితీరును ప్రభావితం చేసే గోయిట్రోజెన్‌లు ఉంటాయి.

వీటిని దూరంగా ఉంచాలి

క్యాబేజీ, బ్రకోలి వంటి పచ్చి కూరగాయలు థైరాయిడ్ పని తీరుకు ఆటంకం కలిగిస్తాయి. కాలిఫ్లవర్‌ను పచ్చిగా తీసుకోవడం వల్ల కొంతమందిలో కడుపు ఉబ్బరం సమస్య తలెత్తుతుంది. 

ఏ కూరగాయలు జ్యూస్ చేసుకోవచ్చు

క్యారెట్, దోసకాయలు, సెలెరీ, గోధుమ గడ్డి, అల్లం, కొత్తిమీర వంటి వాటిని జ్యూస్ చేసుకుని తాగొచ్చు. పొట్ట ఉబ్బరం, తేన్పులు రావడం వంటి సమస్య నుంచి బయట పడేందుకు ఈ జ్యూస్ లో కొద్దిగా ఉప్పును జోడించడం మాత్రం మరచిపోవద్దు. అదే విధంగా అతిగా మాత్రం వాటిని తీసుకోకూడదు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also read: అలెగ్జాండర్ ది గ్రేట్ నుంచి క్వీన్ ఎలిజబెత్ వరకు ప్రపంచం మెచ్చిన పాలకులు ఇష్టంగా తాగే పానీయాలు ఇవే

Also read: అతనికి పదిహేను మంది భార్యలు, వందమందికి పైగా పిల్లలు, వీడియో చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget