APPSC DyEO Results: ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, మెయిన్కు 3957 మంది ఎంపిక
DyEO Results: ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) ఖాళీల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మే 18న విడుదల చేయనుంది.

APPSC Deputy EO Prelims Results: ఏపీలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DyEO) ఉద్యోగాల భర్తీకి సంబంధించి మే 25న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) జూన్ 27న రాత్రి విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో తర్వాతి దశకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 3957 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాలతోపాటు రాతపరీక్ష తుది ఆన్సర్ కీని కూడా కమిషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Deputy Educational Officer (DyEO) Prelims Rsults
Final Key (General Studies and Mental Ability)

ఆంధ్రప్రదేశ్లో 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC గతేడాది డిసెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జనవరి 9 నుంచి 29 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 25న ప్రిలిమినరీ (స్క్రీనింగ్) రాతపరీక్ష నిర్వహించింది. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల మధ్య కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించారు. పరీక్షను ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించింది. ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని మే 28న కమిషన్ విడుదల చేసింది. మే 31 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించింది. తాజాగా ఫలితాలతోపాటు.. ఫైనల్ కీని కూడా కమిషన్ విడుదల చేసింది. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెయిన్ పరీక్ష నిర్వహించి ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.61,960 – రూ.1,51,370 జీతంగా చెల్లిస్తారు.
* డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఈవో) పోస్టులు
ఖాళీల సంఖ్య: 38.
జోన్లవారీగా ఖాళీలు: జోన్-1: 07 పోస్టులు, జోన్-2: 12 పోస్టులు, జోన్-3: 08 పోస్టులు, జోన్-14: 11 పోస్టులు.
మెయిన్ పరీక్ష..
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 450 మార్కులు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్-1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ-150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-2: ఎడ్యుకేషన్-1కు 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు, పేపర్-3: ఎడ్యుకేషన్-2కు 150 ప్రశ్నలు-150 మార్కులు-150 నిమిషాలు ఉంటాయి. పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి ఒకమార్కు కాగా.. తప్పు సమాధానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించినవారికి కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు.
కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం, కంప్యూటర్ సాఫ్ట్వేర్లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. కనీసం అర్హత మార్కులను ఓసీలకు 40గా, బీసీలకు 35గా, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులకు 30 మార్కులుగా నిర్ణయించారు.
ALSO READ:
➥ 17 వేలకుపైగా ఖాళీలతో 'సీజీఎల్ఈ - 2024' నోటిఫికేషన్ వచ్చేసింది, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
➥ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 ఉద్యోగాలు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
Before You Go
PBKS vs GT Highlights : వరుసగా ఐదో మ్యాచ్ లోనూ ఆఖరి ఓవర్ లోనే ఫలితం | IPL 2023 | ABP Desam
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















