అన్వేషించండి

Guntur Kaaram Pre Release Event: అభిమానులే నా అమ్మానాన్న, త్రివిక్రమ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ - మహేష్ బాబు భావోద్వేగం

Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగింది.

Mahesh Babu Speaches At Guntur Kaaram Pre Release Event: మహేశ్‌ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గుంటూరులో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొని సందడి చేసింది. భారీగా అభిమానులు తరలి వచ్చారు.

అభిమానులే అమ్మానాన్న- మహేష్ బాబు

ఇక ఈ వేడుకలో పాల్గొన్న మహేష్ బాబు అభిమానులే తనకు అన్నీ అన్నారు. ప్రస్తుతం తనకు తల్లిదండ్రులు లేరని, అమ్మైనా, నాన్నైనా అభిమానులేనని చెప్పారు. “గుంటూరులో వేడుక జరగడం సంతోషంగా ఉంది. ఇక్కడ వేడుక జరపాలనే ఐడియా దర్శకుడు త్రివిక్రమ్ దే. ఆయనకు మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎక్కడ ఫంక్షన్ చేయాలి అనుకుంటే మీ ఊళ్లో చేస్తే బాగుంటుందన్నారు. ఇప్పుడు మన ఊళ్లోనే వేడుక జరుగుతుంది. త్రివిక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ. నా ఫ్యామిలీ మెంబర్ లాగా. నేను ఆయన గురించి బయట ఎక్కువగా మాట్లాడను. మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువగా ఏం మాట్లాడుతాం?’’ అని అన్నారు. 

‘‘గత రెండు సంవత్సరాలుగా ఆయన నాకు ఇచ్చిన సపోర్టు అమూల్యమైనది. ఆయన సినిమాల్లో నేను చేసినప్పుడల్లా నా ఫర్ఫార్మెన్స్ లో ఓ మ్యాజిక్ జరుగుతుంది. ఎందుకో నాకూ తెలియదు. ‘అతడు’, ‘ఖలేజా’, తర్వాత ఇప్పుడు ‘గుంటూరు కారం’లోనూ జరిగింది. ఇందులో కూడా కొత్త మహేష్ బాబును చూడబోతున్నారు. దానికి ఆయనే కారణం. సంక్రాంతి నాకు కలిసి వచ్చిన వచ్చిన పండుగ. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది’’ అని అన్నారు.

‘‘మా ప్రొడ్యూసర్ చిన్నబాబు ఫేవరెట్ హీరో నేను. ఆయన మానిటర్ చూసి ఆనందపడే వారు. ప్రొడ్యూసర్ ముఖంలో ఆనందం చూసినప్పుడు కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. శ్రీలీల, మీనాక్షి చౌదరి కూడా చక్కగా చేశారు. శ్రీలీలతో డ్యాన్స్ వేయడం, వామ్మో! అనిపించింది. వారితో పని చేయడం సంతోషంగా అనిపించింది. ఈ సినిమాకు తమన్ ఇచ్చిన మ్యూజిక్ మరో లెవెల్. కుర్చీ మడతపెట్టి సాంగ్ కు థియేటర్లు బద్దలైపోతాయి. పాతికేళ్ల నా సినీ కెరీర్ లో మీరు చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏమీ చేయలేను. సంక్రాంతి మాకు కలిసి వచ్చిన పండగ. ఈ పండగకు సినిమా విడుదల అయ్యిందంటే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అవుతుంది. మా నాన్న లేరు. అమ్మ లేరు. ఇప్పటి నుంచి మీరే నాకు అమ్మ, నాన్న.. అన్నీ. మీ ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు.

మహేష్ బాబు అప్పుడ, ఇప్పుడ ఒకేలా ఉన్నారు - త్రివిక్రమ్

“గుంటూరు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. రమణగాడు మీవాడు. మన అందరి వాడు. అందుకే మీ అందరి మధ్యన ఈ వేడుక చేయాలని ఇక్కడికి వచ్చాం. షూటింగ్ లో చాలా అలసిపోయినా, గుంటూరు ప్రజలను కలవడానికి వచ్చాడు. తెలుగు సినిమా పరిశ్రమలో విడదీయలేని ఒక అంతర్భాగం. గొప్ప నటుడు, మహా మనిషితో నేను నేరుగా పని చేయలేదు. కానీ, కృష్ణగారు చేసిన సినిమాకు నేను పోసాని మురళి గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేశాను. ఆ తర్వాత, ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు తీసినప్పుడు ఆయనతో మాట్లాడాను. ఆయనతో గడిపిన ప్రతి క్షణం నాకు అపూర్వమైనది. అంత గొప్ప మనిషికి పుట్టిన మహేష్ ఇంకా ఎంత అదృష్టవంతుడో అనిపిస్తుంది. వాళ్ల నాన్నగారు చేయలేని వెంచర్.. చేయలేని సినిమాలను ఆయన చేయడానికి రెడీగా ఉంటారు అనిపిస్తుంది. ఒక సినిమాకు 100 శాతం పని చేయాలంటే 200 శాతం పని చేస్తాడు ఆయన. నేను ‘అతడు’, ‘ఖలేజా’  సినిమాలు చేసేటప్పుడు ఎలా ఉన్నారో? ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయన రీసెంట్ గా సినిమాల్లోకి వచ్చినట్లుగానే అనిపిస్తుంది. ఆయనను మీరంతా ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జనవరి 12న థియేటర్లలో కలుద్దాం. సంక్రాంతిని గొప్పగా జరుపుకుందాం” అన్నారు.   

మహేష్ బాబును చూస్తే ఆ సినిమాలు గుర్తొచ్చాయి- దిల్ రాజు

‘గుంటూరు కారం’లో మహేష్ బాబు క్యారెక్టరైజేషన్‌ ‘పోకిరి’, ‘దూకుడు’ సినిమాలు మాదిరగానే ఉందని నిర్మాత దిల్‌ రాజు అన్నారు. ఆయన ఈసారి థియేటర్లలో దుమ్మురేపబోతోందన్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించగా, తమన్‌ సంగీతం అందించారు.  

Read Also: రౌడీ బాయ్, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ - ఇదీ అసలు విషయం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
AP Group 2 Exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్- ఆందోళనకారులు తగ్గుతారా?
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Mahakumbh: ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
India vs Pakistan Champions Trophy 2025: పాక్‌తో మ్యాచ్.. పిచ్‌పై రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. దుబాయ్‌లో భార‌త్‌కే మొగ్గు..!
పాక్‌తో మ్యాచ్.. పిచ్‌పై రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. దుబాయ్‌లో భార‌త్‌కే మొగ్గు..!
Koneru Konappa: కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
కాంగ్రెస్ కు షాక్ - ఇలా చేరి అలా గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే - బీఆర్ఎస్‌లోకేనా ?
Embed widget