Ragini 3 : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
Ragini 3 Tamannaah : సూపర్ హిట్ బోల్డ్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ 'రాగిణి 3' షూటింగ్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాగమయ్యారు. సెట్ నుంచి ఆమె షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది.

Tamannah Bhatia Joins In Ragini 3 Shooting Set : గతేడాది 'ఓదెల 2' వంటి హారర్ థ్రిల్లర్తో హైప్ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా బాలీవుడ్ బోల్డ్ హారర్ థ్రిల్లర్తో రాబోతున్నారు. సూపర్ హిట్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ రాగిణి 3 (Ragini 3)లో ఆమె భాగమయ్యారు.
ఫస్ట్ డే షూటింగ్
తమన్నా అఫీషియల్గా రాగిణి 3 షూటింగ్లో భాగమయ్యారు. షూటింగ్ సెట్ నుంచి 'Day 1' అని రాసి ఉన్న క్లాప్ బోర్డ్ను పట్టుకుని తన ఇన్ స్టాలో ఫోటో షేర్ చేయగా... అది వైరల్ అవుతోంది. ఆమెది లీడ్ రోల్ కావడంతో మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత సరికొత్త కథాంశంతో రాబోతోంది.
'రాగిణి 3'లో తమన్నాతో పాటు ఆయుష్ శర్మ, జునైద్ ఖాన్, నర్గీస్ ఫక్రీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. గతంలో వచ్చిన రెండు పార్టుల కంటే మూడో పార్ట్ను సరికొత్త సస్పెన్స్ కథాంశంతో ఫేమస్ డైరెక్టర్ శశాంక్ ఘోష్ తెరకెక్కిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, టిప్స్ ఫిల్మ్స్, జై హో మీడియా వెంచర్స్ బ్యానర్లపై ఏక్తా కపూర్, శోభా కపూర్, గిరీష్ కుమార్, అమర్ బుతాలా, కుమార్ తౌరానీ నిర్మిస్తున్నారు. త్వరలోనే మిగిలిన అప్డేట్స్ తెలియనున్నాయి.
Also Read : Akhil Akkineni : కాలర్ ఎగరేయను - ప్రశాంతంగా నా యుద్ధం నేను చేస్తా... అయ్యగారు మనసులు గెలిచేశారు
రాగిణి ఎంఎంఎస్... 2011లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్లో ఓ సెన్సేషన్. హారర్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు బోల్డ్ సీన్స్ కూడా ప్రేక్షకులను అలరించాయి. ఫస్ట్ పార్ట్లో రాజ్ కుమార్ రావు, కైనాజ్ మోటివాలా ప్రధాన పాత్రలు పోషించారు. పవన్ కృపలాని దర్శకత్వం వహించగా... ఏక్తా కపూర్ నిర్మించారు. రాగిణి, ఉదయ్ అనే జంటలో వీకెండ్లో సరదాగా గడిపేందుకు ముంబై శివారులో ఓ ఫామ్ హౌస్కు వెళ్తారు. అక్కడ వారికి తెలియకుండానే సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేసి ఉంటాయి. దీంతో పాటే కొన్ని అదృశ్య శక్తులు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాయి.
ఆ తర్వాత దీనికి సీక్వెల్గా... బాలీవుడ్ స్టార్ నటి ప్రధాన పాత్రలో సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో 'రాగిణి ఎంఎంఎస్ 2' వచ్చింది. బేబీ డాల్ అనే సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. భూషణ్ పటేల్ దర్శకత్వం వహించగా... సన్నీ లియోన్తో పాటు సాహిల్ ప్రేమ్, పర్విన్ దబాస్, సంధ్యా మృదుల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మించారు.
కపుల్ ఆ ఇంటిని వీడిన తర్వాత భయానక ఘటనల ఆధారంగా సినిమా తీయాలని ఓ డైరెక్టర్ నిర్ణయించుకుంటారు. షూటింగ్ టైంలో వారికి భయానక అనుభవాలు ఎదురవుతాయి. దాని నుంచి ఎలా బయటపడ్డారనేదే సెకండ్ పార్ట్ స్టోరీ. ఆ తర్వాత డిజిటల్గా వచ్చిన 'రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్' వెబ్ సిరీస్ కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు మూడో పార్ట్ రాబోతోంది.
Also Read : Fauzi Release Date: ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
ట్రెండింగ్ వార్తలు























