అన్వేషించండి

Mammootty's Bramayugam: ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టిస్తోన్న మమ్ముటి 'భ్రమయుగం' - ఆ సీన్స్ చాలా టెర్రిఫిక్!

Mammootty's Bramayugam: మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన 'భ్రమయుగం' చిత్రానికి ఆడియన్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ హారర్ థ్రిల్లర్ అద్భుతంగా ఉందని రివ్యూలు పేర్కొన్నాయి.

Mammootty's Bramayugam: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'భ్రమయుగం'. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి 'ది ఏజ్ ఆఫ్ మ్యాడ్ నెస్' అనేది ట్యాగ్ లైన్. ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా నిన్న ఫిబ్రవరి 15న థియేటర్లలోకి వచ్చింది. ఇది పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో చిత్రీకరించబడిన హారర్ థ్రిల్లర్. దీనికి తొలి రోజే ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సినిమా చూసిన జనాలు సోషల్ మీడియాలో తమ రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు. 

'భ్రమయుగం' మూవీ ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టిస్తోందని ట్విట్టర్ రివ్యూలు చూస్తుంటే అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో తాము చూసిన అత్యంత భయంకరమైన చిత్రం ఇదేనని, మమ్ముట్టి నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఊహించలేదని అంటున్నారు. థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు భయంతో చాలాసార్లు అరిచామని కొందరి ట్వీట్లు కనిపిస్తుంటే, మినీ హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైందని మరికొందరు అంటున్నారు. ఈ మూవీ చాలా టెర్రిఫిక్ గా ఉంది. సాంకేతికంగా ఇది అద్భుతం. అట్మాస్ సౌండ్, సంగీతం, సినిమాటోగ్రఫీ మొదలైనవన్నీ అమేజింగ్ గా ఉన్నాయని ఓ నెటిజన్ ట్వీట్ చేసారు. కొన్ని సీన్లు కేకలు పెట్టించేలా ఉన్నాయని అంటున్నారు.

'భ్రమయుగం' సినిమా మైండ్ బ్లోయింగ్ గా ఉంది. పవర్ కరప్షన్, ఇది మానవ దురాశపై తీసిన ఒక అద్భుతమైన జానపద హార్రర్ మూవీ. మమ్ముట్టి మరోసారి తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో బీస్ట్ ని చూపించారు. రాహుల్ సదాశివన్ భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు.. హాలీవుడ్ ఫిలిం మేకర్స్ జోర్డాన్ పీలేకు సమాధానం అని ఓ నెటిజన్ పోస్ట్ చేసారు. మమ్ముట్టి ఈ స్థాయికి చేరుకున్నాక, ఇక నటుడిగా నిరూపించకోడానికి ఏమీ లేదని నేను భావిస్తున్నప్పుడు.. అతను రోర్‌షాచ్, భ్రమయుగం వంటి ప్రయోగాత్మక సినిమాలతో ఆశ్చర్యపరిచారు అని ఓ అభిమాని పేర్కొన్నారు. 

Also Read: ఏంటీ.. 'మట్కా' హోల్డ్ లో పడిందా?, మెగా హీరో మూవీకి బడ్జెట్ ఇష్యూనా?

"ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మమ్ముట్టికి ఎవరూ పోటీ లేరని అనుకుంటున్నాను. నేను ఆయనకు అభిమానిని కాదు.. కానీ భ్రమయుగం చూసిన తర్వాత అతని పట్ల నా రెస్పెక్ట్ పెరిగింది. అతను మన చిత్ర పరిశ్రమకు చెందినవాడు అవడం మనందరం గర్వించదగ్గ విషయం'' అని మమ్ముట్టిని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ''దర్శకుడు రాహుల్ సదాశివన్ మలయాళంలోనే భారీ బడ్జెట్ బ్లాక్ అండ్ వైట్ హర్రర్ మూవీని ప్రయత్నించడం అభినందనీయం. 'భ్రమయుగం' ద్వారా మమ్ముట్టిలోని డెవిల్ కోణాన్ని బయటపెట్టడం నిజంగా ప్రశంసనీయం" అని మరొకరు అభిప్రాయపడ్డారు. 

'భ్రమయుగం' కథేంటంటే?

కేరళలో మాయలు, మంత్రాలు, తంత్రాలు వాస్తవిక ప్రపంచంలో ఉన్న రోజుల్లో.. పానన్‌ కులానికి చెందిన తేవన్‌ అనే జానపద గాయకుడు భగవంతుడిని కీర్తిస్తూ పాటలు పాడుతుంటాడు. ఆ రోజుల్లో బానిసల క్రయ విక్రయాలు సర్వసాధారణం. అలా తేవన్‌ కూడా బానిసగా అమ్ముడుపోయే క్రమంలో, ఆ బానిసత్వం నుండి తప్పించుకొని అనుకోకుండా ఒక ప్రదేశంలోకి వెళ్తాడు. అక్కడ విధిని మార్చే ఒక పురాతన రహస్య మార్గంలో పయనించడం మొదలుపెడతాడు. మరి ఆ మార్గం అతడిని ఎటువైపు తీసుకెళ్లింది? దాని నుంచి బయటపడ్డాడా లేదా? అన్నదే ఈ కథ. 

విభిన్నమైన హారర్‌ థ్రిల్లర్‌ గా రూపొందిన 'భ్రమయుగం' చిత్రంలో మమ్ముట్టితో పాటుగా అర్జున్ అశోకన్, సిద్దార్థ్‌, భరతన్, అమల్దా లిజ్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం సమకూర్చారు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్ గా, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు. షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్ & వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మాతలుగా వ్యవహరించారు. 

Also Read: పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళ్తున్న బుచ్చిబాబు, RC16 టైటిల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

APPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP DesamSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ | ABPSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ను పరిశీలించిన మంత్రి ఉత్తమ్Chicken Biryani and roast Free | గుంటూరు ఉచిత చికెన్ మేళాకు భారీగా భోజన ప్రియులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Hyderabad Metro Rail :హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
 ICC Champions Trophy Aus Vs Eng Result Update: ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
TSRTC Special Buses:4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget