అన్వేషించండి

Punnami Nagu: చిరంజీవి ‘పున్నమి నాగు’ సినిమా వెనక ఇంత కథ నడిచిందా? ఆసక్తికర విషయాలు చెప్పిన నిర్మాత

చిరంజీవి నటించిన ‘పున్నమి నాగు’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తీయడానికి వెనక ఓ కథ ఉందట. ఇటీవల ఆ విషయాన్ని ఏవిఎం ప్రొడక్షన్ ప్రస్తుత నిర్మాత అరుణ గుహన్ వెల్లడించారు.

Punnami Nagu: తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. అయితే వాటిల్లో చాలా సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ అలా గుర్తిండిపోతాయి. ప్రతీ హీరో కెరీర్ లోనూ అలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి. అలా మెగాస్టార్ చిరంజీవి నటించి మెప్పించిన చాలా సినిమాల్లో ‘పున్నమి నాగు’ సినిమా కూడా చెప్పొచ్చు. ఈ సినిమాలో చిరంజీవి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. చిరంజీవికు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఏవిఎం’ ప్రొడక్షన్స్ లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను ఏవిఎం బ్యానర్ లోనే తీయడానికి ఓ పెద్ద కారణమే ఉంది. ఇటీవల ఆ విషయాన్ని ఏవిఎం బ్యానర్ నాలుగవ తరం నిర్మాత అరుణ గుహన్ వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలసి ‘పున్నమి నాగు’ సినిమా వెనక ఇంత కథ నడిచిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట మెగా ఫ్యాన్స్. 

పెద్ద నిర్మాణ సంస్థ ‘ఏవిఎం ప్రొడక్షన్స్’..

భారత దేశంలో చలన చిత్ర రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది ఏవిఎం ప్రొడక్షన్స్. ఈ బ్యానర్ నుంచి కొన్ని వందల సినిమాలు విడుదలయ్యాయి. ఈ ప్రొడక్షన్స్ ద్వారా వందలాది మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, కళాకారులు పరిచయమయ్యారు.  చాలా మంది దిగ్గజ హీరోలతో ఈ సంస్థ సినిమాలు తీసింది. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ లో నాల్గవ తరం నిర్మాతలు కొనసాగుతున్నారు. అయితే ఇటీవల పున్నమినాగు సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను అరుణ గుహన్ చెప్పారు. 

ఆ కారణంతో చిరంజీవిని ఒప్పించి..

ఎన్నో వందల సినిమాలు తెరకెక్కించిన ‘ఏవిఎం’ సంస్థ 1976 తర్వాత సినిమాలను నిర్మించడం తగ్గించింది. అదే సమయంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఏ.వి.మెయ్యప్పన్ ఆరోగ్యం కూడా క్షీణించింది. తర్వాత ఆయన 1979 లో కన్నుమూశారు. అయితే అప్పుడే చిరంజీవితో సినిమాను నిర్మించాల్సి ఉంది. ఆ తర్వాత చాలా కాలం పాటు సంస్థ నుంచి ఏ సినిమాలు రాలేదు. అయితే మెయ్యప్పన్ చనిపోవడానికి ముందే తన కుమారులతో సంస్థను యథావిధిగా కొనసాగించాలని మాట తీసుకోవడంతో ఆయన సంవత్సరీకం సందర్భంగా ఓ సినిమా చేయాలని అనుకున్నారు. అందుకు చిరంజీవిను కలసి అడిగారు. అప్పటికే చిరంజీవి ఫుల్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నారు. అప్పుడే ఆయనకు పెళ్లి కూడా అయ్యింది. అయితే చిరంజీవి తమ సంస్థలో సినిమా చేయాలనేది తన తండ్రి కోరిక అని చెప్పడంతో చిరంజీవి వెంటనే ఓకే చేసేశారట. 

‘పున్నమి నాగు’ అని పేరు పెట్టింది చిరంజీవే..

ఏవిఎం సంస్థ వారు అడగగానే సినిమాకు ఓకే చేశారు చిరంజీవి. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఈ మూవీ కోసం రాత్రి పూట కూడా షూటింగ్ కు వచ్చేవారు చిరంజీవి. ఆ విధంగా సినిమాను పూర్తి చేశారట. ఇంతకీ ఈ సినిమాకు ‘పున్నమి నాగు’ అని పేరు పెట్టింది కూడా చిరంజీవేనట. ఈ మూవీ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అప్పట్లోనే తెలుగులో ఏవీఎమ్  ప్రొడక్షన్స్ కు భారీ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘పున్నమి నాగు’ నిలిచింది. ఈ విషయాలన్ని చాలా సంవత్సరాల తర్వాత ఆ సంస్థ ప్రస్తుత నిర్మాతల్లో ఒకరైన అరుణ గుహన్ స్వయంగా చెప్పుకొచ్చారు.

Read Also: ‘బాహుబలి’, ‘RRR’ రికార్డులను బద్దలుకొడుతుంది, ‘ప్రాజెక్ట్ K’పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Embed widget