అన్వేషించండి

Chandrababu: 'అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛన్' - సీఎం జగన్ ను ఇంటికి పంపాలని ప్రజలకు చంద్రబాబు పిలుపు

Andhrapradesh News: కేంద్ర సహకారం, సమర్థ నాయకత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజలు గెలవాలని.. సైకో పాలనకు అంత పలకాలని పిలుపునిచ్చారు.

Chandrababu Slams Cm Jagan In Dharmavaram Meeting: తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే రూ.4 వేల పింఛన్ అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో (Dharmavaram) కూటమి అభ్యర్థి సత్యకుమార్ కు మద్దతుగా నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (Amit Shah) కలిసి ఆయన ఆదివారం పాల్గొన్నారు. అలాగే, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామని.. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఇస్తామని చెప్పారు. సీఎం జగన్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని.. నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి తలెత్తిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. సమర్థ నాయకత్వం ఉండి కేంద్రం సహకారం తీసుకుంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు.

'ధర్మాన్ని గెలిపించండి'

రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అంతా సిద్ధం కావాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. 'దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. జగన్ 3 రాజధానుల పేరుతో అసలు రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారు. అమరావతిని నాశనం చేసిన ఆయన్ను ఇంటికి పంపాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా తీర్చిదిద్దే బాధ్యత ఎన్డీయేది. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. మన ఆశలను సైకో జగన్ నాశనం చేశారు. రాజధాని ఏదో చెప్పలేని స్థితికి తీసుకొచ్చారు. అమరావతి నిర్మాణానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి. పోలవరం పూర్తి చేసి హంద్రీనీవాతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందిస్తాం. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి. ఐదేళ్ల పాలనా కాలంకో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.' అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

అమిత్ షా కీలక ప్రకటన

అటు, ఇదే సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. 'ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అవినీతితో వాటిని దుర్వినియోగం చేశారు. దీంతో పోలవరం బాగా ఆలస్యమైంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబును గెలిపించాలి. కేంద్రంలో నరేంద్ర మోదీని కొనసాగించాలి. రాబోయే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఏపీ అభివృద్ధిని చంద్రబాబు, ప్రధాని మోదీ చూసుకుంటారు. రాష్ట్రంలో గూండా గిరి, అవినీతి, అరాచకాలను అరికట్టేందుకు కూటమిలో కలిశాం. భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియాను నివారించడానికి పొత్తు పెట్టుకున్నాం. అమరావతిని తిరిగి రాజధాని చేసేందుకే టీడీపీ, జనసేనతో కలిశాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు గెలిపించాలి.' అని అమిత్ షా పిలుపునిచ్చారు.

Also Read: Dharmavaram: జూ.ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు - అమిత్ షా, చంద్రబాబు సభలో ప్లకార్డులు, ఫ్లెక్సీలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND Vs NZ Result Update: వరుణ్ పాంచ్ పటాకా.. కివీస్ ను కుమ్మేసిన టీమిండియా.. చివరి మ్యాచ్ లో గ్రాండ్ విక్ట‌రీ.. ఆసీస్ తో సెమీస్ పోరు
వరుణ్ పాంచ్ పటాకా.. కివీస్ ను కుమ్మేసిన టీమిండియా.. చివరి మ్యాచ్ లో గ్రాండ్ విక్ట‌రీ.. ఆసీస్ తో సెమీస్ పోరు
Revanth Reddy Visits SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చెక్కులిచ్చారు - ఆయన దేవుడంటూ యాంకర్ రోషన్ ఎమోషనల్, అసలేం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చెక్కులిచ్చారు - ఆయన దేవుడంటూ యాంకర్ రోషన్ ఎమోషనల్, అసలేం జరిగిందంటే?
Andhra Pradesh: పులివెందుల యువరైతు ఆనందం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
పులివెందుల యువరైతు ఆనందం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs NZ Match Highlights | Champions Trophy 2025 లో కివీస్ ను కొట్టేసిన భారత్ | ABP DesamTrump vs Zelensky | రష్యాను రెచ్చగొట్టారు..ఉక్రెయిన్ చేయి వదిలేశారు..పాపంరా రేయ్ | ABP DesamKoganti Sathyam Sensational Comments | రాహుల్ హత్య కేసులో పెద్దిరెడ్డి.? | ABP DesamIndian Stock Market Crash | భారత్ లో కుప్పకూలిపోతున్న స్టాక్ మార్కెట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND Vs NZ Result Update: వరుణ్ పాంచ్ పటాకా.. కివీస్ ను కుమ్మేసిన టీమిండియా.. చివరి మ్యాచ్ లో గ్రాండ్ విక్ట‌రీ.. ఆసీస్ తో సెమీస్ పోరు
వరుణ్ పాంచ్ పటాకా.. కివీస్ ను కుమ్మేసిన టీమిండియా.. చివరి మ్యాచ్ లో గ్రాండ్ విక్ట‌రీ.. ఆసీస్ తో సెమీస్ పోరు
Revanth Reddy Visits SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, ఈ పాపం కేసీఆర్ చేసినదే!
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చెక్కులిచ్చారు - ఆయన దేవుడంటూ యాంకర్ రోషన్ ఎమోషనల్, అసలేం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చెక్కులిచ్చారు - ఆయన దేవుడంటూ యాంకర్ రోషన్ ఎమోషనల్, అసలేం జరిగిందంటే?
Andhra Pradesh: పులివెందుల యువరైతు ఆనందం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
పులివెందుల యువరైతు ఆనందం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
Oscars 2025: ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Thandel OTT Release Date: ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Rammohan Naidu: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
Anantapur Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం- నెలల చిన్నారి సహా నలుగురు మృతి, మరికొందరి పరిస్థితి విషమం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం- నెలల చిన్నారి సహా నలుగురు మృతి, మరికొందరి పరిస్థితి విషమం
Embed widget