అన్వేషించండి

Telugu Desam News : నాలుగు చోట్ల అభ్యర్థులను మార్చే యోచనలో టీడీపీ - రఘురామ పోటీ ఖాయమే !

AP Elections 2024 : నామినేషన్లు ప్రారంభం కావడంతో సెట్ కాని అభ్యర్థులను మార్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. రఘురామకు ఉంిడ సీటునే ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

TDP Candidates :  తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఖరారు చేసిన అభ్యర్థులకు సమాచారం ఇచ్చినట్లుగాచెబుతున్నారు.  నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే.  ఆయన నర్సాపురం ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా.. ఎంపీ స్థానం బీజేపీకి వెళ్లింది. బీజేపీలో ఆయనకు టిక్కెట్ లభించలేదు. దీంతో ఆయన టీడీపీలో చేరారు. ఉండి  సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ.. రఘురామ కోసం ఆయనకు నచ్చజెప్పి పోటీ నుంచి తప్పించింది. ఆయనకు  పార్టీ పదవి ఇచ్చి  బుజ్జగిస్తోంది. 

బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల టిక్కెట్                    

మరోవైపు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చింది. మొదట పైలా ప్రసాదరావుకు టికెట్ కేటాయించింది. కానీ.. సర్వేలో ఆయన వెనకబడ్డారని తెలియడంతో.. ఆ టికెట్ ను మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించింది. బండారు సత్యనారాయణ మూర్తిని ప్రచారం చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి మాజీ ఎమ్మెల్యే. అక్కడ్నుంచే పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆ సీటు జనసేనకు కేటాయించారు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. అనూహ్యంగా ఇప్పుడు మాడుగుల సీటు లభించింది. 

దళిత విభాగ రాష్ట్ర అధ్యక్షుడైన ఎంఎస్ రాజుకు మడకశిర                                 

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర లోనూ అభ్యర్థిని మార్చాలని  చంద్రబాబు నిర్ణయించుకున్నారు.   మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం.. ప్రస్తుత అభ్యర్థి అయిన అనిల్ కుమార్ ను మార్చాలని డిమాండ్ చేస్తుంది. దాంతో ఆ టికెట్ ను దళిత విభాగ రాష్ట్ర అధ్యక్షుడైన ఎంఎస్ రాజును బరిలోకి నిలపాలనుకుంటున్నారు. ఎంఎస్ రాజుకు బాపట్ల ఎంపీ టిక్కెట్ ఇవ్వాలనుకున్నారు. కానీ చివరి క్షణంలో ఆ టిక్కెట్ ను మాజీ పోలీస్ అధికారి అయిన కృష్ణ ప్రసాద్ కు ఇవ్వాల్సి  వచ్చింది. ఇప్పుడు ఎంఎస్ రాజు సొంత జిల్లా అయిన అనంతపురం నుంచే సీటు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.      

తంబళ్లపల్లె అభ్యర్థిని మార్చే అవకాశం                                           

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డిని కూడా టీడీపీ మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రచారంలో వెనుకబడటంతో పాటు.. ప్రత్యర్థితో వ్యాపార లావాదేవీలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణాలతోనే జయచంద్రారెడ్డికి ప్రత్యామ్నాయంగా మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేశ్ భార్య సరళారెడ్డి లేదా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, కొండా నరేంద్ర పేర్లు పరిశీలిస్తున్నారు. ఈ మార్పులపై టీడీపీ ఏ క్షణమైనా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ

వీడియోలు

Trump on Greenland | గ్రీన్‌ లాండ్ కోసం ట్రంప్ ఎందుకు పట్టుబుతున్నాడు | ABP Desam
Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trai Accident: రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
రైలు వస్తున్నా ట్రక్‌తో ట్రాక్‌పై వెళ్లిపోయిన డ్రైవర్ - ఏం జరిగిందో చూస్తే గుండె ఝల్లుమంటుంది!
KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Bangladesh Cricket: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో - ఇక టీ20 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు చాన్స్ !
Adilabad Latest News:ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ జాతరలో ‘నాగోబా దర్బార్’- పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
FIR at home: బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
బాధితుల వద్దకే పోలీసులు - స్పాట్‌లోనే ఎఫ్ఐఆర్ - దుండిగల్ పోలీసుల కొత్త ప్రయత్నం వైరల్
SIT notice to KTR: ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
Embed widget