అన్వేషించండి

Vijaya Sankalpam: తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం, రేపటి నుంచి విజయసంకల్పం పేరిట రథ యాత్రలు

Bjp Pracharam: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న బీజేపీ, విజయసంకల్ప యాత్రల పేరిట రేపటి నుంచి రథయాత్రలు, నేడు ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

BJP Yathra: ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో  తెలంగాణలో బీజేపీ(BJP) సైతం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటి నుంచి జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తమకు తొలి నుంచీ కలిసొచ్చే హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేసేందుకు బీజేపీ రథయాత్రలకు శ్రీకారం చుట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడంతో... ఈసారి లోక్ సభ ఎన్నికలపై ప్రత్యేకంగా కమలం పార్టీ దృష్టి సారించింది. కొత్త సీట్ల సంగతి ఎలా ఉన్నా...గతంలో గెలిచిన చోట్ల సీట్లు చేజారిపోకుండా హిందూకార్డును ప్రయోగిస్తోంది..

రేపటి నుంచి రథయాత్రలు   
ఎన్నికలు వచ్చాయంటే హిందూఓట్లకు ఎరవేయడంలో బీజేపీ(BJP) ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ఆపార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అద్వానీ(Advani) దేశవ్యాప్తంగా రథయాత్ర చేపట్టి..తొలిసారి ఆ పార్టీని దిల్లీ గద్దెనెక్కించారు. ఇప్పుడు తెలంగాణ(Telangana)లోనూ కమలం పార్టీ అదే ఫార్ములా ప్రయోగిస్తోంది. ఈనెల 20 నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ రథయాత్రలకు శ్రీకారం చుట్టింది. నేడు చార్మినార్(Charminar) భాగ్యలక్ష్మీ ఆలయం(Bhagya Lakshimi Temple)లో ప్రచార వాహనాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పూజలు చేసి ప్రారంభించనున్నారు. 5 క్లస్టర్లుగా 16 ఎంపీ సెగ్మెంట్‌లలో జరిగే ఈ రథయాత్రలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు పాల్గొననున్నారు.

ఎంపీ సీట్లపై కన్ను
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంపై కన్నేసిన బీజేపీ...దేశవ్యాప్తంగా ఎంపీసీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పైగా ఎన్డీఏ 400 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈక్రమంలో ఎట్టిపరిస్థితుల్లోనూ  తెలంగాణలో పది ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ కేంద్ర అధినాయకత్వం రాష్ట్ర నేతలను ఆదేశించింది.  అందులో భాగంగానే  విజయ సంకల్ప రథయాత్రలకు ఆ పార్టీ శ్రీకారం చుడుతోంది. ఈ నెల 20 నుంచి నాలుగు చోట్ల నుంచి ఈ రథయాత్రల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ యాత్రలు మార్చి 1న ముగించేలా ఏర్పాట్లు చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద జరిగి ప్రచార రథాల పూజా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు ఎంపీలు బండి సంజయ్(Bandi Sanjay), లక్ష్మణ్(Laxman), ఈటెల రాజేందర్(Etela Rajendra) సహా పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. 

క్లస్టర్ల విభజన
హైదరాబాద్ మినహాయించి 16 ఎంపీ స్థానాలను ఐదు క్లష్టర్లుగా రాష్ట్రాన్ని విభజించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలు ఉండనున్నాయి. ఈ ఐదు క్లష్టర్లకు తెలంగాణలోని చారిత్రక ప్రదేశాల పేర్లు పెట్టారు. 
భాగ్యలక్ష్మీ క్లస్టర్: ఈ కస్టర్ పరిధిలో మూడు ఎంపీ సెగ్మెంట్లు రానున్నారు. రేపు భువనగిరిలో ప్రారంభం కానున్న రథయాత్ర 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ  హైదరాబాద్ లోయాత్ర ముగియనుంది. 
కొమురం భీం క్లస్టర్‌:  ఈక్లస్టర్ పరిధిలోనూ రేపే యాత్ర ప్రారంభంకానుంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని ముథోల్‌లోమొదలుకానుంది. ఈ కార్యక్రమానికి  అస్సోం సీఎం హిమంతబిశ్వ శర్మ హాజరుకానున్నారు. ఈ యాత్ర సైతం 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ముగుస్తుంది 
రాజరాజేశ్వరి క్లస్టర్‌: వికారాబాద్‌ జిల్లా తాండూరులో రేపు ఈ రథయాత్రను  గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ప్రారంభించనున్నారు. 4 ఎంపీ సెగ్మెంట్‌ల పరిధిలో ని 28 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ కరీంనగర్‌లో యాత్ర ముగియనుంది.
కృష్ణమ్మ క్లస్టర్‌ : నారాయణపేట జిల్లా మక్తల్‌లో రేపు ప్రారంభం కానున్న రథయాత్ర 3 ఎంపీ సెగ్మెంట్‌ల పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగి నల్లగొండలో ముగుస్తుంది
కాకతీయ–భద్రకాళి యాత్ర : ఇది ఈ నెల 25వ తేదీన భద్రాచలంలో ప్రారంభమై 3 ఎంపీ సెగ్మెంట్‌ల పరిధిలోని  21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ ములుగులో ముగుస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

EVM Checking: భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఈవీఎం చెకింగ్.. బాంబే హైకోర్టు అనుమతి
Assembly Elections 2026: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలైన పోలింగ్! ఓటు వేసేందుకు ఓటర్ల బారులు!
కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలైన పోలింగ్! ఓటు వేసేందుకు ఓటర్ల బారులు!
CM Revanth Reddy: పినరయి విజయన్‌‌ను గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్న మోదీ.. కేరళలో మార్పు తప్పదు- రేవంత్ రెడ్డి
పినరయి విజయన్‌‌ను గాడ్ ఫాదర్‌లా కాపాడుతున్న మోదీ.. కేరళలో మార్పు తప్పదు- రేవంత్ రెడ్డి
Opinion Poll 2026: పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!

వీడియోలు

Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
IPL 2026 KKR VS LSG Highlights | లక్నో సూపర్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS RR Result Update: వైభ‌వ్ వీరబాదుడు, జురేల్ విధ్వంసం, వ‌రుస‌గా 4వ విజ‌యంతో టాప్‌ప్లేస్‌లో రాయ‌ల్స్ ! ఆర్సీబీకి తొలి ఓట‌మి
వైభ‌వ్ వీరబాదుడు, జురేల్ విధ్వంసం, వ‌రుస‌గా 4వ విజ‌యంతో టాప్‌ప్లేస్‌లో రాయ‌ల్స్ ! ఆర్సీబీకి తొలి ఓట‌మి
Islamabad Talks:
"డీల్ కుదరకపోతే దాడులే" ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరిక! ఇస్లామాబాద్‌ చర్చలపై ఉత్కంఠ!
Digital Payments: యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
Boat capsizes in Yamuna River: యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
Hyderabad HIV Injection Tragedy: ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
Chiranjeevi : తీవ్ర ఆందోళనకు గురయ్యా... నిర్మాణ సంస్థకు సపోర్ట్‌ - జన నాయగన్ లీక్‌పై మెగాస్టార్ రియాక్షన్
తీవ్ర ఆందోళనకు గురయ్యా... నిర్మాణ సంస్థకు సపోర్ట్‌ - జన నాయగన్ లీక్‌పై మెగాస్టార్ రియాక్షన్
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Jana Nayagan Leaked : ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget