అన్వేషించండి

Anantapur District News: అనంతపురం జిల్లాలోని అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్లే

Anantapur News: అనంతపురం జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల లెక్క తేలింది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి.

Andhra Pradesh News: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల లెక్క తేలింది. ఇటు వైసీపీ, అటు కూటమి నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులను ఖరారు చేయడంతో ఇక్కడ పోటీ ఆసక్తిని కలిగిస్తోంది. ఈ జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార వైసీపీతోపాటు కూటమి కూడా బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. ఆర్థికంగా, సామాజికంగా ఇరు వైపుల నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి దిగడంతో అనేక నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగా సాగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నియోకజవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

పోటీ చేస్తున్న అభ్యర్థులు వీరే..

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గం(Madakasira Assembly constituency) నుంచి వైసీపీ అభ్యర్థిగా ఈర లక్కప్ప(Eera Lakkappa ) పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఎంఈ సునీల్‌ కుమార్‌ (M.E.Sunil Kumar)బరిలోకి దిగతున్నారు. శింగనమల నియోజకవర్గం(Singanamala Assembly constituency) నుంచి వైసీపీ నుంచి మన్నెపాకుల వీరాంజనేయులు బరిలోకి దిగుతుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బండారు శ్రావణి పోటీ చేస్తున్నారు. కల్యాణ దుర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తలారి రంగయ్య పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి అమిలినేని సురేంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వై విశ్వేశ్వరరరెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పోటీ చేస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పరిటాల సునీత పోటీ చేస్తున్నారు. 

అనంతపురం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా 

నియోజకవర్గం పేరు  వైసీపీ అభ్యర్థి పేరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరు 
మడకశిర (Madakasira Assembly constituency) ఈర లక్కప్ప(Eera Lakkappa) సునీల్‌ కుమార్‌(టీడీపీ)Sunil Kumar (TDP)
శింగనమల (singanamala assembly constituency ) మన్నెపాకుల వీరాంజనేయులు(Mannepakula Veeranjaneyulu) బండారు శ్రావణి(టీడీపీ) (Bandaru Sravani) (TDP)
కల్యాణ దుర్గం (Kalyandurg assembly constituency) తలారి రంగయ్య(Talari Rangaiah) అమిలినేని సురేంద్రబాబు (Amilineni Surendra Babu)(TDP)
ఉరవకొండ (Uravakonda assembly constituency) విశ్వేశ్వరరరెడ్డి(Visweswara Reddy) పయ్యావుల కేశవ్‌(Payyavula Keshav)(TDP)
రాప్తాడు (Raptadu assembly constituency) తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి(Topudurthi Prakash Reddy) పరిటాల సునీత (Paritala Sunitha) (TDP)

పెనుకొండ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి కేవీ ఉష శ్రీ చరణ్‌ పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన కురుబ సవిత పోటీ చేస్తున్నారు. తాడిపత్రి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. గుంతకల్లు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వై వెంకట రామిరెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం పోటీ చేస్తున్నారు. ఈయన వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి మంత్రిగా పని చేశారు. కొద్దిరోజులు కిందట టీడీపీలో చేరి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గ ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాయదుర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి కాలువ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. 

అనంతపురం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా 

నియోజకవర్గం పేరు  వైసీపీ అభ్యర్థి పేరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరు 
పెనుకొండ(Penukonda Assembly constituency) కేవీ ఉష శ్రీ చరణ్‌(K. V. Ushashri Charan) కురుబ సవిత(టీడీపీ) (Savitha Kuruba (TDP))
తాడిపత్రి(Tadpatri Assembly constituency) కేతిరెడ్డి పెద్దారెడ్డి(Kethireddy Pedda Reddy) జేసీ అస్మిత్‌ రెడ్డి(టీడీపీ)(J C Ashmit Reddy (TDP))
గుంతకల్లు(Guntakal Assembly constituency) వెంకట రామిరెడ్డి(Venkatarami Reddy) గుమ్మనూరు జయరాం(టీడీపీ)(Gummanur Jayaram (TDP))
రాయదుర్గం(Rayadurg assembly constituency) మెట్టు గోవిందరెడ్డి(Mettu Govinda Reddy) కాలువ శ్రీనివాసులు(టీడీపీ)(Kalava Srinivasulu (TDP))

హిందూపురం నుంచి కూటమి అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి బరిలోకి దిగుతున్నారు. ముచ్చటగా మూడోసారి విజయం దక్కించుకునేందుకు ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. వైసీపీ అభ్యర్థిగా టీఎన్‌ దీపికను బరిలోకి దించుతున్నారు. పుట్టపర్తి నుంచి దుద్దుకుంట్ల శ్రీధర్‌ రెడ్డి వైసీపీ నుంచి బరిలోకి దిగుతుండగా, టీడీపీ నుంచి పల్లె సింధూరరెడ్డి పోటీ చేస్తున్నారు. ధర్మవరం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి వై సత్యకుమార్‌ బరిలోకి దిగుతున్నారు. కదిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా మక్బూల్‌ అహ్మద్‌ పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి కందింకుట యశోదా పోటీ చేస్తున్నారు. అనంతపురం అర్బన్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ పోటీ చేస్తున్నారు. 

అనంతపురం జిల్లా అసెంబ్లీ అభ్యర్థుల జాబితా 

నియోజకవర్గం పేరు  వైసీపీ అభ్యర్థి పేరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరు 
హిందూపురం(Hindupur Assembly constituency) టీఎన్‌ దీపిక(T. N. Deepika) నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)
పుట్టపర్తి(Puttaparthi Assembly constituency) దుద్దుకుంట్ల శ్రీధర్‌ రెడ్డి(Duddukunta Sridhar Reddy) పల్లె సింధూరరెడ్డి(Palle Sindhura Reddy)
ధర్మవరం(Dharmavaram Assembly constituency) కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి(Kethireddy Venkatarami Reddy) వై సత్యకుమార్‌(Satya Kumar Y)
కదిరి(Kadiri Assembly constituency) మక్బూల్‌ అహ్మద్‌(B. S. Maqbool Ahmed) కందింకుట యశోదా(Kandikunta Yashoda)
అనంతపురం అర్బన్‌(Anantapur Urban Assembly constituency) అనంత వెంకట రామిరెడ్డి(Anantha Venkatarami Reddy)

దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ (Daggubati Venkateswara Rao)

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget