అన్వేషించండి

JEE Main Result 2026: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల! 100 పర్సంటైంల్‌ సాధించిన 12 మందిలో ముగ్గురు తెలుగు విద్యార్థులే!

JEE Main Result 2026: NTA విడుదల చేసిన తుది సమాధాన కీ ఆధారంగా ఫలితం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం సాయంత్రం ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది ఫలితాల్లో మన తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచి టాప్ లేపారు. 

ముగ్గురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్

ఈ ఏడాది జేఈఈ మెయిన్ పేపర్‌-1 ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ స్కోరు సాధించగా అందులో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహిత్‌, మోహిత్ అనే విద్యార్థులు, తెలంగాణ నుంచి వివాన్‌ మహిశ్వరి వందకు వంద పర్సంటైల్‌ సాధించారు. 

ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షకు 13,55,293 మంది రిజిస్టర్ చేసుకోగా 13,04,653 మంది పరీక్ష రాశారు. ఈ పరీక్షను జనవరి 21,22, 23, 24, 28, తేదీల్లో నిర్వహించారు. 

స్కోర్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మీ స్కోర్ కార్డు పొందడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. 

  • 1. ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక రిజల్ట్స్‌ లింక్‌ ఓపెన్ చేయాలి. 
  • 2. అక్కడ అప్లికేషన్ నెంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేయాలి. 
  • 3. క్యాప్చా కోడ్‌ సరిగా టైప్ చేసి సబ్‌మీట్ చేయాలి. 
  • 4. మీ స్కోర్ కార్డ్‌ స్క్రీన‌ మీద కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం మంచిది. 

స్కోర్‌కార్డ్‌లో ఏముంటుంది?

  1. • మొత్తం మీద పర్సంటైల్ స్కోరు
  2. • సబ్జెక్ట్ వారీగా పర్సంటైల్ (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం)
  3. • ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)
  4. • క్వాలిఫైంగ్‌ స్టాటస్‌ (JEE అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారా లేదా అని)

మంచి మార్కులు వచ్చిన విద్యార్థులు ఏం చేయాలి?

  • అర్హత సాధించిన విద్యార్థులు JEE అడ్వాన్స్‌డ్ 2026కి దరఖాస్తు చేసుకోగలరు.
  • సెషన్ 2కి హాజరయ్యే విద్యార్థులకు ఇది మొదటి అవకాశం. రెండు సెషన్ల నుంచి మెరుగైన స్కోర్‌ను తుది మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు.
  • విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే సమాచారాన్ని పొందాలని, పుకార్లను నివారించాలని సూచించారు.

మంచి పర్సంటైల్ రాని వారు ఏం చేయాలి? 

ఫలితాల విడుదలకు ముందే ఎన్టీఏ అధికారులు సోమవారం ఉదయం ఫైనల్‌ ఆన్సర్‌ కీ విడుదల చేశారు. ఈ ఫైనల్‌ కీలో ఒక కీలక మార్పు జరిగింది. మొత్తం 9 ప్రశ్నలను డ్రాప్‌ చేశారు. అంటే ఈ ప్రశ్నలకు మార్కుల కేటాయింపులో ఎన్టీఏ నిబంధనల ప్రకారం మార్పులు ఉంటాయి. ఒక వేళ మొదటి విడతలో వచ్చిన స్కోరుతో మీరు సంతృప్తి చెందకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. జేఈఈ మెయన్ రెండో విడత పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. మొదటి విడత, రెండో విడత ఈ రెండింటిలో మీకు ఏ పరీక్షలో ఎక్కువ స్కోరు వస్తే దానినే ర్యాంకు కేటాయింపునకు పరిగణలోకి తీసుకుంటారు. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయి.           

Frequently Asked Questions

జేఈఈ మెయిన్ ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యాయి?

జేఈఈ మెయిన్ ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా సోమవారం సాయంత్రం విడుదలయ్యాయి.

ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షకు ఎంతమంది హాజరయ్యారు?

ఈ ఏడాది జేఈఈ మెయిన్ పరీక్షకు 13,55,293 మంది రిజిస్టర్ చేసుకోగా, 13,04,653 మంది పరీక్ష రాశారు.

జేఈఈ మెయిన్ ఫలితాల స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

స్కోర్ కార్డ్ లో ఏమేమి ఉంటాయి?

స్కోర్ కార్డ్ లో మొత్తం పర్సంటైల్ స్కోరు, సబ్జెక్ట్ వారీగా పర్సంటైల్, ఆల్ ఇండియా ర్యాంక్ (AIR), మరియు JEE అడ్వాన్స్డ్ కు అర్హత సాధించారా లేదా అనే క్వాలిఫైయింగ్ స్టేటస్ ఉంటాయి.

మంచి పర్సంటైల్ రాకపోతే ఏమి చేయాలి?

మంచి పర్సంటైల్ రాకపోతే, జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండింటిలో మెరుగైన స్కోర్ ర్యాంకు కేటాయింపునకు పరిగణనలోకి తీసుకోబడుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Chandrababu Amaravati Review: అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Advertisement

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
Chandrababu Amaravati Review: అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
అమరావతి ఇన్ ఫ్రా పనులు వేగంగా జరగాల్సిందే - అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
IPL 2026లో కొందరు స్టార్ ప్లేయర్లు ఎందుకు ఆడటం లేదు, ఫ్యాన్స్ మాత్రం వెయిటింగ్
IPL 2026లో కొందరు స్టార్ ప్లేయర్లు ఎందుకు ఆడటం లేదు, ఫ్యాన్స్ వెయిటింగ్
Tiger In Polavaram: వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
వీడియోలు తీస్తుంటే వెనక్కి తగ్గిన పెద్దపులి: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో హై అలర్ట్!
Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Embed widget