అన్వేషించండి

Higher education department: కాంట్రాక్టు ఉద్యోగుల పీహెచ్‌డీ డిగ్రీలపై దర్యాప్తు చేయండి, ఉన్నత విద్యాశాఖ

తెలంగాణలో క్రమబద్ధీకరణ కోసం కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు సమర్పించిన పీహెచ్‌డీ డిగ్రీలపై దర్యాప్తు చేసి ధ్రువీకరించాలని ఉన్నత విద్యాశాఖ సెంట్రల్ క్రైం స్టేషన్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది.

తెలంగాణలో క్రమబద్ధీకరణ కోసం కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు సమర్పించిన పీహెచ్‌డీ డిగ్రీలు అసలా...నకిలీవా అన్న కోణంలో దర్యాప్తు చేసి ధ్రువీకరించాలని ఉన్నత విద్యాశాఖ సెంట్రల్ క్రైం స్టేషన్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. సుమారు రెండు నెలల క్రితం వివరాలన్నిటినీ పోలీసులకు అందజేసి విచారణ చేయాలని కోరినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

ఉద్యోగులు మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్.. బిహార్‌లోని దర్భంగ... ఝార్ఖండ్‌లోని రామఘర్.. ఇలా పదికిపైగా రాష్ట్రాల్లోని 40కి పైగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల నుంచి పీహెచ్‌డీలు, పీజీలు చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించారు. వీటిపై ఫిర్యాదులు రావడంతో సమగ్రంగా దర్యాప్తుచేసి నివేదిక అందజేయాలని అక్టోబరులోనే కోరినా ఎన్నికల ప్రక్రియ కారణంగా అడుగు ముందుకు పడలేదని సమాచారం.

డిగ్రీ కాలేజీల్లోని సుమారు 800 మందికిపైగా కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం గత ఏడాది ఏప్రిల్‌లో సంబంధిత కాలేజీల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వాటికి ఈ ఏడాది జులైలో ఆర్థికశాఖ అనుమతితోపాటు మంత్రివర్గ ఆమోదం కూడా లభించింది. కాంట్రాక్టు లేదా పార్ట్‌టైం లెక్చరర్లను క్రమబద్ధీకరించాలంటే పీజీతో పాటు పీహెచ్‌డీ ఉండాలి. లేదా నెట్, సెట్ అర్హత సాధించాలి. దీంతో ఎక్కువమంది పీహెచ్‌డీలు పూర్తిచేసినట్లు ధ్రువపత్రాలు సమర్పించారు. ముందుగా కొందరిని క్రమబద్ధీకరించిన తర్వాత మరిన్ని ప్రతిపాదనలు వచ్చాయి.

పీహెచ్‌డీలన్నీ ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు వర్సిటీలవే కావడం, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, సిక్కిం, పాండిచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, హరియాణా, ఒడిశా తదితర రాష్ట్రాల్లోని 40 విశ్వవిద్యాలయాల నుంచి పీహెచ్‌డీలు పొందిన వారే 140 మందికి పైగా ఉండటంతో అధికారులు కంగుతిన్నారు. అనుమానం వచ్చి తనిఖీ చేయించారు. సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులే వాటిని నిగ్గుతేల్చాల్సిందిగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని సెంట్రల్ క్రైం స్టేషన్ అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది.

ALSO READ:

తెలంగాణ యువతకు నైపుణ్య శిక్షణ, సంసిద్ధత వ్యక్తం చేసిన 'టాటా' టెక్నాలజీస్
తెలంగాణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి 'టాటా' టెక్నాలజీస్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో సుమారు రూ.2 వేల కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు డిసెంబరు 30న సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎంతో చర్చించారు. రాష్ట్ర యువతకు ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం టాటా టెక్నాలజీస్ సంస్థ ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో నైపుణ్యశిక్షణ కార్యక్రమాలు అమలు చేసేందుకు టాటా టెక్నాలజీస్‌ అంగీకరించింది. దాదాపు లక్ష మంది విద్యార్థులు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా శిక్షణ అందించనుంది. టాటా సంస్థతో కలిసి ప్రభుత్వం పనిచేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెడతాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MBU: ప్రయాణికుల భద్రతకు క్యూఆర్ కోడ్ రక్ష - ఎంబీయూ విద్యార్థి సహకారంతో పోలీసుల వినూత్న ప్రయోగం
ప్రయాణికుల భద్రతకు క్యూఆర్ కోడ్ రక్ష - ఎంబీయూ విద్యార్థి సహకారంతో పోలీసుల వినూత్న ప్రయోగం
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
World Head Injury Awareness Day: బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా? 
బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా? 
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Horror Movies : ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ ఇవే
ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ ఇవే
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Ustaad Bhagat Singh Collections: బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
Aryaman Birla : రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు ఆర్‌సిబి జట్టుకు ఛైర్మన్ ఎలా అయ్యారు? ఐపీఎల్‌లో ఆసక్తికరమైన స్టోరీ!
రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు ఆర్‌సిబి జట్టుకు ఛైర్మన్ ఎలా అయ్యారు? ఐపీఎల్‌లో ఆసక్తికరమైన స్టోరీ!
Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Embed widget