అన్వేషించండి

DOST Application: 'దోస్త్‌' దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, తొలివిడత రిజిస్ట్రేషన్ ఎప్పటివరకంటే?

DOST: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ మే 3న ప్రారంభమైంది. మే 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు.

DOST 2025 Online Registration: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఆన్‌లైన్‌ దోస్త్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 3న ప్రారంభమైంది. విద్యార్థుల నుంచి మే 21 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత మే 10 నుంచి 22 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. విద్యార్థులకు మే 29న సీట్లను కేటాయించనున్నారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన సీట్ల భర్తీకి రెండు, మూడో విడతల్లోనూ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.  రెండు, మూడో విడతల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్ 30 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. 

తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 3 నుంచి జూన్ 23 వరకు మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. ఇందులో మే 3 నుంచి 21 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు నిర్వహించి, మే 10 నుంచి 22 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. విద్యార్థులకు మే 29న సీట్లను కేటాయించనున్నారు. అదేవిధంగా మే 30 నుంచి జూన్ 8 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు నిర్వహించి, మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. రెండో విడత సీట్లను  జూన్ 13న కేటాయించనున్నారు. ఇక చివరి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూన్ 13 నుంచి 19 వరకు నిర్వహించి.. జూన్ 13 నుంచి 19 మధ్య వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. వీరికి జూన్ 23న సీట్లను కేటాయించనున్నారు. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 24 నుంచి 28 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 

దోస్త్ 2025 షెడ్యూలు..
మొత్తం మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేష‌న‌ల్, బీకాం హాన‌ర్స్, బీఎస్‌డ‌బ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇత‌ర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

మొదటి దశ ప్రవేశాలు ఇలా..

➥ మే 3 నుంచి 21 వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.

➥  రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన విద్యార్థులకు మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు.

➥  విద్యార్థులకు మే 29న మొదటి విడత డిగ్రీ సీట్లను కేటాయించనున్నారు.

రెండో దశ ప్రవేశాలు ఇలా..

➥  రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగనుంది.

➥  రెండో విడత వెబ్ ఆప్షన్లకు మే 30 నుంచి జూన్ 9 వరకు అవకాశం కల్పించనున్నారు.

➥  విద్యార్థులకు జూన్ 13న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.

మూడో విడత ప్రవేశాలు ఇలా..

➥ దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 13న ప్రారంభంకానుంది.

➥ విద్యార్థులు జూన్ 19 వరకు దరఖాస్తులు సమర్పించాలి.

➥  చివరి విడత వెబ్ ఆప్షన్లకు జూన్ 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు.

➥ విద్యార్థులకు జూన్ 23న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.

➥  జూన్ 30 నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి.

DOST Admission Schedule(2025-26)

DOST 2025 Registration

టాప్ హెడ్ లైన్స్

AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
NEET UG Re-exam Result 2026: నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
NEET UG Malpractice: మొబైల్ వాడుతూ హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
నీట్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్- హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
టర్బో పెట్రోల్‌, ADASతో కొత్త Maruti Brezza - ఇంకొన్ని రోజుల్లో భారీ అప్‌డేట్‌తో ఎంట్రీ!
కొత్త కారు కొనేవాళ్లు కాస్త ఓపిక పట్టండి - మారుతి బ్రెజ్జా సరికొత్తగా వస్తోంది
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Embed widget