అన్వేషించండి

డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు!

తెలంగాణలో డిగ్రీ విద్య స్వరూపం పూర్తిగా మారనుంది. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ స్పష్టం చేశారు.

తెలంగాణలో డిగ్రీ విద్య స్వరూపం పూర్తిగా మారనుంది. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొపెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేట్ లోని సెస్‌లో “అత్యుత్తమ పాఠ్యప్రణాళిక అభివృద్ధి” కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన రెండురోజుల సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దక్షిణ భారత బ్రిటీష్‌ కౌన్సిల్‌, యూకేలోని బంగోర్‌, అబిరిస్టిత్‌ విశ్వవిద్యాలయాలు, హైదరాబాద్‌లోని ఆర్థిక, సామాజిక అధ్యయన కేంద్రం 'సెస్' తో కలిసి తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ  రెండు రోజుల పాటు వర్క్‌ షాప్‌ నిర్వహిస్తోంది. 

ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తొలి రోజు ప్రారంభోపన్యాసం చేశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలో వాణిజ్యశాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం విభాగాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్య ప్రణాళిక అమల్లోకి రానుందని ఆయన ప్రకటించారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు రూపొందించేందుకు విద్యా మండలి కృషి చేస్తోందన్నారు. ఈ ప్రక్రియలో విదేశీ విశ్వవిద్యాలయాల తోడ్పాటు ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. సరికొత్త విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహకారం చేస్తుందన్నారు.

బట్టి విధానంతో ఉపయోగం ఉండదు: నవీన్‌ మిట్టల్‌
బట్టి విధానంతో పరీక్షలు రాయడం వల్ల ఉపయోగం ఉండదని కాలేజీ విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. చదువు తర్వాత విద్యార్థులు తేలికగా ఉపాధిపొందేలా విద్యా విధానం ఉండాలని పేర్కొన్నారు. డిగ్రీలు వాస్తవ విజ్ఞానానికి కొలమానం కావడంలేదని, ప్రస్తుత పరీక్ష విధానం విద్యార్థుల్లో దాగిఉన్న అసలైన ప్రతిభను వెలికి తీయడం లేదన్నారు. విద్యార్థుల్లో అనలిటికల్‌, క్రిటికల్‌ ఆలోచన విధానం కొరవడిందని, దీనివల్ల ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ కొరవడుతోందని చెప్పారు. మారుతున్న కాలానికి పోటీ పడలేకపోతున్నారని తెలిపారు. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని పదునుపెడితే విభిన్న కోణంలో ఆలోచన విధానం మెరుగుపడుతుందని చెప్పారు. ఆ దిశగా బోధన విధానాన్ని మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా: వాకాటి కరుణ
యూఎస్‌, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా రాష్ట్ర ఉన్నత విద్యలో మార్పులు మంచి పరిణామమని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పేర్కొన్నారు. నైపుణ్యవంతమైన విద్యను యూజీ స్థాయి నుంచి అందిచగలమన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇలాంటి వర్క్‌షాప్‌లతో సామాజిక విశ్లేషాత్మక విద్యకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆలోచనాత్మక విద్యాబోధన దిశగా సాగుతున్న ప్రయత్నానికి అన్ని విధాల సహకరిస్తామని ఆమె పేర్కొన్నారు. 

Also Read:

ఒకటో తరగతి ప్రవేశాలపై కీలక నిర్ణయం! రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖలు!
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది. నూతన విద్యావిధానం ప్రకారం విద్యార్థులకు పునాది దశలో అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో మొదటి మూడేళ్ల పాటు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, రెండేళ్లపాటు ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena Meeting: నెలాఖరున విశాఖలో జనసేన కార్యకర్తల మీటింగ్ - కీలక ప్రకటన చేయనున్న పవన్ కల్యాణ్
నెలాఖరున విశాఖలో జనసేన కార్యకర్తల మీటింగ్ - కీలక ప్రకటన చేయనున్న పవన్ కల్యాణ్
Kaleshwaram report KCR: కేసీఆర్, హరీష్ సంచలన నిర్ణయం - జస్టిస్ ఘోష్ రిపోర్టు చెల్లదని హైకోర్టులో పిటిషన్లు
కేసీఆర్, హరీష్ సంచలన నిర్ణయం - జస్టిస్ ఘోష్ రిపోర్టు చెల్లదని హైకోర్టులో పిటిషన్లు
Nizamabad Pigeon arrested: బోధన్‌లో పావురాన్ని అరెస్టు చేసిన పోలీసులు -  ఎంత పని చేసిందంటే ?
బోధన్‌లో పావురాన్ని అరెస్టు చేసిన పోలీసులు - ఎంత పని చేసిందంటే ?
Suhas: సుహాస్ కెరీర్‌లో క్రూషియల్... 'మందాడి' ఎందుకంత స్పెషల్ అంటే!?
సుహాస్ కెరీర్‌లో క్రూషియల్... 'మందాడి' ఎందుకంత స్పెషల్ అంటే!?
Advertisement

వీడియోలు

Karate Kalyani on GHMC Mayor | బంజారాహిల్స్ భూవివాదంపై స్పందించిన GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి
Donald Trump Dealing With India | మోదీతో దోస్తీ అంటూనే భారత్ పై టారిఫ్ ల భారం దేనికి ట్రంప్.? | ABP Desam
Asia Cup 2025 Team India | ఆసియా కప్ కు టీమిండియా ఎంపిక..ఆ ప్లేయర్లను తొక్కేశారా.? | ABP Desam
Ramya Krishna in Allu Arjun and Atlee Movie | అల్లు అర్జున్ సినిమాలో రమ్య కృష్ణ ? | ABP Desam
Indi Alliance Candidate B Sudershan Reddy | ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Meeting: నెలాఖరున విశాఖలో జనసేన కార్యకర్తల మీటింగ్ - కీలక ప్రకటన చేయనున్న పవన్ కల్యాణ్
నెలాఖరున విశాఖలో జనసేన కార్యకర్తల మీటింగ్ - కీలక ప్రకటన చేయనున్న పవన్ కల్యాణ్
Kaleshwaram report KCR: కేసీఆర్, హరీష్ సంచలన నిర్ణయం - జస్టిస్ ఘోష్ రిపోర్టు చెల్లదని హైకోర్టులో పిటిషన్లు
కేసీఆర్, హరీష్ సంచలన నిర్ణయం - జస్టిస్ ఘోష్ రిపోర్టు చెల్లదని హైకోర్టులో పిటిషన్లు
Nizamabad Pigeon arrested: బోధన్‌లో పావురాన్ని అరెస్టు చేసిన పోలీసులు -  ఎంత పని చేసిందంటే ?
బోధన్‌లో పావురాన్ని అరెస్టు చేసిన పోలీసులు - ఎంత పని చేసిందంటే ?
Suhas: సుహాస్ కెరీర్‌లో క్రూషియల్... 'మందాడి' ఎందుకంత స్పెషల్ అంటే!?
సుహాస్ కెరీర్‌లో క్రూషియల్... 'మందాడి' ఎందుకంత స్పెషల్ అంటే!?
Abusing in Anger : కోపంలో ఎవరినైనా తిడితే.. చట్ట ప్రకారం ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా?
కోపంలో ఎవరినైనా తిడితే.. చట్ట ప్రకారం ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా?
Poonam Bajwa: ఎవర్రా మీరంతా? మరీ ఇలా ఉన్నారేంట్రా...? ఆ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరైన పూనమ్‌
ఎవర్రా మీరంతా? మరీ ఇలా ఉన్నారేంట్రా...? ఆ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరైన పూనమ్‌
War 2 Official Collection: 'వార్ 2' కలెక్షన్లు అనౌన్స్ చేసిన ప్రొడక్షన్ హౌస్... 300 కోట్ల క్లబ్బులో ఎన్టీఆర్ సినిమా... కానీ??
'వార్ 2' కలెక్షన్లు అనౌన్స్ చేసిన ప్రొడక్షన్ హౌస్... 300 కోట్ల క్లబ్బులో ఎన్టీఆర్ సినిమా... కానీ??
Seerat Kapoor: వైట్ సూట్‌లో బాస్‌ లేడీలా సీరత్ కపూర్... గ్లామర్ గాళ్ లేటెస్ట్ ఫోటోస్ చూశారా?
వైట్ సూట్‌లో బాస్‌ లేడీలా సీరత్ కపూర్... గ్లామర్ గాళ్ లేటెస్ట్ ఫోటోస్ చూశారా?
Embed widget