అన్వేషించండి

డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు!

తెలంగాణలో డిగ్రీ విద్య స్వరూపం పూర్తిగా మారనుంది. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ స్పష్టం చేశారు.

తెలంగాణలో డిగ్రీ విద్య స్వరూపం పూర్తిగా మారనుంది. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలకు అనుగుణంగా డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో మార్పులు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొపెసర్ లింబాద్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ బేగంపేట్ లోని సెస్‌లో “అత్యుత్తమ పాఠ్యప్రణాళిక అభివృద్ధి” కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన రెండురోజుల సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దక్షిణ భారత బ్రిటీష్‌ కౌన్సిల్‌, యూకేలోని బంగోర్‌, అబిరిస్టిత్‌ విశ్వవిద్యాలయాలు, హైదరాబాద్‌లోని ఆర్థిక, సామాజిక అధ్యయన కేంద్రం 'సెస్' తో కలిసి తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈ  రెండు రోజుల పాటు వర్క్‌ షాప్‌ నిర్వహిస్తోంది. 

ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తొలి రోజు ప్రారంభోపన్యాసం చేశారు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలో వాణిజ్యశాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం విభాగాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్య ప్రణాళిక అమల్లోకి రానుందని ఆయన ప్రకటించారు. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అవసరాలకు రూపొందించేందుకు విద్యా మండలి కృషి చేస్తోందన్నారు. ఈ ప్రక్రియలో విదేశీ విశ్వవిద్యాలయాల తోడ్పాటు ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. సరికొత్త విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహకారం చేస్తుందన్నారు.

బట్టి విధానంతో ఉపయోగం ఉండదు: నవీన్‌ మిట్టల్‌
బట్టి విధానంతో పరీక్షలు రాయడం వల్ల ఉపయోగం ఉండదని కాలేజీ విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. చదువు తర్వాత విద్యార్థులు తేలికగా ఉపాధిపొందేలా విద్యా విధానం ఉండాలని పేర్కొన్నారు. డిగ్రీలు వాస్తవ విజ్ఞానానికి కొలమానం కావడంలేదని, ప్రస్తుత పరీక్ష విధానం విద్యార్థుల్లో దాగిఉన్న అసలైన ప్రతిభను వెలికి తీయడం లేదన్నారు. విద్యార్థుల్లో అనలిటికల్‌, క్రిటికల్‌ ఆలోచన విధానం కొరవడిందని, దీనివల్ల ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ కొరవడుతోందని చెప్పారు. మారుతున్న కాలానికి పోటీ పడలేకపోతున్నారని తెలిపారు. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని పదునుపెడితే విభిన్న కోణంలో ఆలోచన విధానం మెరుగుపడుతుందని చెప్పారు. ఆ దిశగా బోధన విధానాన్ని మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా: వాకాటి కరుణ
యూఎస్‌, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా రాష్ట్ర ఉన్నత విద్యలో మార్పులు మంచి పరిణామమని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పేర్కొన్నారు. నైపుణ్యవంతమైన విద్యను యూజీ స్థాయి నుంచి అందిచగలమన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇలాంటి వర్క్‌షాప్‌లతో సామాజిక విశ్లేషాత్మక విద్యకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆలోచనాత్మక విద్యాబోధన దిశగా సాగుతున్న ప్రయత్నానికి అన్ని విధాల సహకరిస్తామని ఆమె పేర్కొన్నారు. 

Also Read:

ఒకటో తరగతి ప్రవేశాలపై కీలక నిర్ణయం! రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం లేఖలు!
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాన్ని అనుసరించి ఒకటో తరగతిలో ఆరేళ్లు నిండిన (6+) పిల్లలకే ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది. చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సిఫార్సు చేసింది. నూతన విద్యావిధానం ప్రకారం విద్యార్థులకు పునాది దశలో అయిదేళ్లపాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అందులో మొదటి మూడేళ్ల పాటు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, రెండేళ్లపాటు ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
Nita Ambani: కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2025 గ్రహీత నీతా అంబానీ- గిరిజన విద్యార్థులకు స్ఫూర్తిదాయక పిలుపు
కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2025 గ్రహీత నీతా అంబానీ- గిరిజన విద్యార్థులకు స్ఫూర్తిదాయక పిలుపు
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్

వీడియోలు

India Bullet Train : హైదరాబాద్‌ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
Gautam Gambhir about KKR IPL 2026 | గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Ambati Rayudu Reveals Dhoni’s Secret | సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ | ABP Desam
Greatest T20 Player by AB de Villiers | బుమ్రానే ఆల్‌టైమ్ నంబర్ 1 | ABP Desam
Sanju Samson leaving RR IPL2026 | సీఎస్కే లోకి సంజు శాంసన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Rohith : పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
పొలిటికల్ ఎంట్రీపై హీరో నారా రోహిత్ ఫస్ట్ రియాక్షన్ - ఏం చెప్పారంటే?
Weather in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం! ఉరుములు పిడుగులతో దద్దరిల్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ!
Spider man Brand New Day Trailer : సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?
సరికొత్తగా స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు - ట్రైలర్ రిలీజ్... వరల్డ్ వైడ్‌గా వచ్చేది ఎప్పుడంటే?
Singer Mangli : వల్గర్ సాంగ్ కాంట్రవర్సీ - సారీ చెప్పిన మంగ్లీ
వల్గర్ సాంగ్ కాంట్రవర్సీ - సారీ చెప్పిన మంగ్లీ
Iran War Updates: ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
ఇరాన్‌కు భారత్ వైద్య సాయం - పెద్ద ఎత్తున మెడిసిన్స్ విరాళం
Food Astrology: మీ రాశి ప్రకారం మీకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? చెక్ చేసుకోండి మీరే అవునంటారు!
మీ రాశి ప్రకారం మీకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? చెక్ చేసుకోండి మీరే అవునంటారు!
Ugadi 2026: ఉగాది రోజున ఈ 5 పనులు చేస్తే ఏడాది పొడవునా సంతోషమే! తప్పక తెలుసుకుని ఆచరించండి!
ఉగాది రోజున ఈ 5 పనులు చేస్తే ఏడాది పొడవునా సంతోషమే! తప్పక తెలుసుకుని ఆచరించండి!
Sara Ali Khan Kedarnath : కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
కేదార్‌నాథ్ టెంపుల్ ఎంట్రీ - హీరోయిన్ సారా అలీ ఖాన్ అఫిడవిట్ ఇవ్వాల్సిందే!
Embed widget