అన్వేషించండి

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం

Telangana Assembly sessions | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ సమావేశాలలో అసెంబ్లీ 8 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది.

Telangana Minister Sridhar Babu | హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం నాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొదట శాసనసభ, తరువాత శాసన మండలి సెషన్ ముగిసింది. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. వారం రోజులపాటు జరిగిన శాసనసభ సమావేశాలు ముగిశాయి. మొత్తం 37 గంటల 44 నిమిషాల పాటు శాసనసభ జరిగింది. మొత్తం సభ్యులలో 71 మంది సభ్యులు సభలో మాట్లాడారు. శాసనమండలి 28.3 గంటలు జరగగా, మండలిలో సభ్యులు 38 ప్రశ్నలు వేయగా వాటికి సంబంధిత సభ్యులు సమాధానం ఇచ్చారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో 8 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది అని పేర్కొన్నారు.

అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులివే..

పంచాయితీ రాజ్ చట్ట సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, భూ భారతి 2024, తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లు, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యూకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ పేమెంట్స్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ సవరణ బిల్లుకు ఈ సమావేశాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

‘గురుకులాల్లో మౌలిక సదుపాయాలు, తెలంగాణ ప్రభుత్వ అప్పులు, రాష్ట్ర టూరిజం పాలసీ, రైతు భరోసా లాంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాం. మహిళా యూనివర్సిటీ (Telangana Wome University)కి గత ప్రభుత్వం చట్టబద్ధత కల్పించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వీరనారి చాకలి ఐయిలమ్మ పేరిట మహిళ యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించింది. తెలంగాణ తల్లి విగ్రహం (Telagnana Talli Statue)పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. సభ నిర్వహణపైన మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ సభ్యులకు లేదు. తెల్లవారుజామున 3 గంటల వరకు మేం సభను నడిపాం. మా చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. మేం ఎక్కడా పారిపోలేదు. శిక్షణా తరగతులకు రాకుండా బీఆర్ఎస్ పారిపోయింది. శిక్షణా తరగతులకు గైర్హాజరుతో స్పీకర్, మండలి ఛైర్మన్ పైన బీఆర్ఎస్ సభ్యులకు ఉన్న గౌరవం ఏంటో తేలిపోయింది.

ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికల సమయంలో చెప్పాం. ఇప్పుడు అసెంబ్లీలో తెలంగాణ భూభారతి చట్టాన్ని ప్రవేశ పెట్టి, ఆమోదింపచేశాం. రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు, కొత్త కార్పొరేషన్ల బిల్లును తీసుకొచ్చాం. ప్రతిపక్ష పార్టీ సభ్యుల సలహాలు సూచనలతో ముందుకు వెళ్లాం. ప్రజాస్వామిక పద్దతిలో యేడాది నుంచి ఒక్క సస్పెన్షన్ లేకుండా సభను నిర్వహించాం. 

అధికార పార్టీ కాంగ్రెస్ సభ్యులు మొత్తం 6.23 గంటలు మాట్లాడారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు 5.6 గంటలు మాట్లాడగా, బీజేపీ సభ్యులు 3.20 గంటలు, ఎంఐఎం సభ్యులు 3.39 గంటలు మాట్లాడగా, సీపీఐ సభ్యుడు కూనంనేని 1.56 గంటలు సభలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వరని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు. దీనిపై సభలో అన్ని పక్షాల అభిప్రాయం తీసుకున్నాం. ప్రతిపక్షం కోరిక మేరకు గురుకులాల్లో సదుపాయాల పైన చర్చించాం. 

Also Read: Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి

హైడ్రా పై ప్రభుత్వ ఆలోచన విధానాన్ని, ప్రతిపక్షాల అనుమానాలకు సభలో సమాధానం ఇచ్చింది. మూసి ప్రక్షాళన లో పేదలకు అన్యాయం జరగనివ్వమని  స్పష్టం చేశాం. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమావేశాలు నిర్వహించాం. స్పీకర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు సభను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను ఖండిస్తున్నాం. అధికార పార్టీ కాంగ్రెస్ సభ్యులు 6 గంటలు మాట్లాడితే, బీఆర్ఎస్ నేతలు 5 గంటలు మాట్లాడారు. కానీ స్పీకర్ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడం, కాగితాలు విసరడం వల్లనే వల్లనే మార్షల్స్ ను సభలో మోహరించాం. 

 గత ప్రభుత్వం పెట్టిన నిబంధనలే అసెంబ్లీలో ఉన్నాయి. బీఆర్ఎస్ సభ్యులు వాళ్లు పెట్టిన నిబంధనలను వాళ్లే పాటించలేదు. సభను కొంత మంది సభ్యులు అడ్డుకున్నా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాలా ఓపిక గా వ్యవహారించి, చర్యలు తీసుకోకుండా అవకాశం ఇచ్చారు. ఎంత పెద్ద వారైనా మానవీయ కోణం మరిచిపోవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీ ముఖ్యమే. వారి అభివృద్ధికి నిర్ణయాలు తీసుకున్నాం. కానీ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన మహిళ కుటుంబాన్ని సినిమా వాళ్లు పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేయడం వాస్తవం అన్నారు...

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
Embed widget