అన్వేషించండి

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి

Allu Arjun Pushpa 2 Movie | సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఓ మహిళ మృతి, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లడంపై అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు.

Sandhya Theatre Stampede Incident at Allu Arjun Pushpa 2 premier show | హైదరాబాద్: ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన సమావేశాలకు కూడా వేలాది, లక్షలాది ప్రజలు తరలి వచ్చారని కానీ వారిని సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడూ ఇలా తోసివేయలేదన్నారు. కానీ ఇందుకు కారణమైన నటుడు మాత్రం తనకు విషయం తెలిసినా బాధితులకు సహాయం చేసే ప్రయత్నం చేయలేదు, వారి ప్రాణం పోయినందుకు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు అన్నారు.

తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ..  ‘తన సినిమా ప్రీమియర్ షో చూసేందుకు ఓ స్టార్ హీరో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ కు వచ్చారు. ఆ సమయంలో భారీగా జనం పోగయ్యారు. ఈ క్రమంలో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయారు. మరో ఇద్దరు స్పృహ కోల్పోయి పడిపోతే నటుడు మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. ఇది సరైన పద్ధతా, ఇది సమాజానికి ఏ సందేశం ఇస్తుంది. ప్రభుత్వం దీనిపై ఏ సమాధానం చెబుతుందని’ ప్రశ్నించారు. 

సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం.. రేవంత్ రెడ్డి
థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు కోర్టులో ఉంది. డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో ఉందని సంధ్య థియేటర్ యాజమాన్యం రెండో తేదీన చిక్కడపల్లి పోలీసులకు లేఖ రాసింది. సంధ్య థియేటర్ చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఉన్నాయని, ఒకవేళ సినిమా హీరో, హీరోయిన్లు వస్తే భారీగా జనాలు వస్తారు. కనుక సినిమా నటీనటులు లేకుండా చూసుకోవాలని మూడో తేదీన చిక్కడపల్లి సీఐ 
రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 

ఆరోజు జరిగిన తప్పిదాలు ఇవే

మొదట చేసిన తప్పు ఏంటంటే.. థియేటర్ వాళ్లు అడిగిన దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రోడ్ షో గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం మరో తప్పిదం. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 8 నుంచి 10 థియేటర్లు ఉన్నాయి. అలాంటి చోట సినిమా స్టార్లు వస్తే సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినా రోడ్ షో చేశారు. కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి నటుడు ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ వచ్చారు. ఒక్కసారిగా వేలాది మంది అక్కడికి దూసుకొచ్చారు. యాభై, అరవై మంది సెక్యూరిటీ సిబ్బంది అభిమానులకు తోసుకుంటూ నటుడ్ని థియేటర్లోకి తీసుకెళ్లారు. టికెట్లు ఉన్నవారితో పాటు టికెట్ తీసుకోని వాళ్లు కూడా హీరోను చూసేందుకు థియేటర్లోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో ఆ కుటుంబం విడిపోయింది. రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఊపిరాడక స్పృహ కోల్పోయారు. తన ప్రాణాలు పోతున్నా కుమారుడ్ని కాపాడుకునేందుకు ఆ తల్లి యత్నించారు. ప్రాణాలు పోయినా కుమారుడి చేతిని ఆమె వదలలేదు. తరువాత వీరిని బయటకు తీసుకొచ్చి సీపీఆర్ చేసి హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. కానీ మహిళ అప్పటికే మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ బ్రెయిడ్ డెడ్ అయి కోమాలోకి వెళ్లాడు.

విషయం తెలిసినా రూఫ్ టాప్ నుంచి నటుడు అభివాదం

ఆరోజు జరిగిన ఘటనను మాటల్లో వర్ణించలేం. ఘటన జరిగినట్లు తెలిసినా నటుడు థియేటర్ నుంచి వెళ్లిపోలేదు. శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని ఏసీపీ చెప్పినా  హీరో పట్టించుకోలేదు. చివరకు డీసీపీ వచ్చి ఇప్పుడు మీరు థియేటర్ నుంచి వెళ్లిపోకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని నటుడ్ని హెచ్చరించారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా రూఫ్ టాప్ నుంచి ఫ్యాన్స్‌కు చేతులు ఊపుతూ వెల్లిపోయారు. ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తోంది. ఓ తల్లి చనిపోయింది, ఆమె కొడుకు హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య ఉంటే వెళ్లి కనీసం పరామర్శించలేదు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూశారు. దీనిపై అక్బరుద్దీన్ చెప్పింది నిజమే’ అని రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనపై సంచలన విషయాలు వెల్లడించారు.

Also Read: ED Case On KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget