అన్వేషించండి

CBSE Syllabus: సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్ - 10, 12 తరగతులకు తగ్గనున్న సిలబస్ భారం

CBSE: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల సిలబస్‌ను 15 శాతం వరకు తగ్గిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. అదేవిధంగా పరీక్షల మూల్యాంకన విధానంలో పలు మార్పులు చేపట్టింది.

CBSE Syllabus Reduced: విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) బోర్డు శుభవార్త తెలిపింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను 10-15 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులపై విద్యాభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల విద్యార్థులకు సబ్జెక్టుల్లో ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు భోపాల్ ప్రాంతీయ అధికారిక వికాస్ కుమార్ అగర్వాల్ సీబీఎస్‌ఈ ప్రిన్సిపల్స్ సమావేశంలో వెల్లడించారు. విద్యార్థులు కోర్ మెటీరియల్‌పై దృష్టి కేంద్రీకరించడం ద్వారా విద్యాభ్యాసాన్ని మెరుగుపరచడమే సిలబస్ తగ్గింపు లక్ష్యం అని అగర్వాల్ వివరించారు. దీని వల్ల విద్యార్థులు తమ సబ్జెక్టులపై మరింత లోతుగా పట్టు సాధిస్తారని ఆయన అన్నారు.

సిలబస్ సర్దుబాటు అనేది విద్యార్థుల నిరంతర అభ్యాసానికి మద్దతునిస్తుందని, విద్యా సంవత్సరంలో విద్యార్థులు తమ అవగాహనను ప్రదర్శించడానికి మరిన్ని అవకాశాలను అందిస్తుందని అగర్వాల్ చెప్పారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో విద్యార్థులకు ప్రాజెక్ట్‌లు, అసైన్‌మెంట్‌లు, పీరియాడిక్ పరీక్షలు ఉండనున్నాయి. దీనిద్వారా విద్యార్థుల పురోగతి, సామర్థ్యాలను అంచనావేయవచ్చు. 

ALSO READ: స్థానిక భాషల్లో వైద్య విద్య - ప్రధాని మోదీ కీలక ప్రకటన

మూల్యాంకనంలోనూ మార్పులు..
వచ్చే ఏడాది నుంచి సీబీఎస్‌ఈ పరీక్షల మూల్యాకనంలోనూ మార్పులు జరుగనున్నాయని అగర్వాల్ తెలిపారు. సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల విద్యార్థులకు సంబంధించిన తుది గ్రేడ్‌లో ఇంటర్నల్ అసెస్‌మెంట్‌‌కు 40 శాతం మార్కులు, రాతపరీక్షకు 60 శాతం మార్కులు ఇవ్వనున్నారు ఆయన అన్నారు. 

ఫిబ్రవరిలో పరీక్షలు..
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి థియరీ పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి నిర్వహించనున్నారు. అయితే అంతకు ముందే జనవరి 1 నుంచి విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక వింటర్-బౌండెడ్ స్కూల్స్‌లో నవంబరు 5 నుంచే ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. డిసెంబరు 5 వరకు కొనసాగనున్నాయి. థియరీ పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి టైమ్-టేబుల్ డిసెంబరులో వెలువడే అవకాశం ఉంది. సీబీఎస్‌ఈ బోర్డు ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన నియమ నిబంధనలతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs)ను సంబంధిత పాఠశాలలకు పంపింది.   

ALSO READ: గేట్ - 2025 పరీక్షల షెడ్యూలు విడుదల, పేపర్లవారీగా తేదీలివే

ఓపెన్-బుక్ పరీక్షలు..
CBSE ఆన్సర్ షీట్ల కోసం డిజిటల్ అసెస్‌మెంట్ సిస్టమ్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.. ఇది కొన్ని సబ్జెక్టుల కోసం ఇటీవలికాలంలో ప్రవేశపెట్టిన విధానం. దీనిద్వారా మూల్యాంకన ప్రక్రియ సామర్థ్యం, పారదర్శకతను మరింత మెరుగుపడుతుంది. అదేవిధంగా విద్యార్థులను క్రిటికల్ థింకింగ్, అప్లికేషన్-బేస్డ్ లెర్నింగ్ వైపు ప్రోత్సహించడం కోసం, విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టుల్లో ఓపెన్-బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ ఫార్మాట్ అమలు చేయబడే సబ్జెక్టులలో ఇంగ్లిష్ లిటరేచర్, సోషల్ సైన్స్ సబ్జెక్టులు ఉన్నాయి. విద్యార్థులు సాధారణంగా పాఠాలను కంఠస్థం చేయడంపై ఆధారపడుతుంటారు. అయితే ఓపెన్ బుక్ విధానంలో పరీక్షల వల్ల విద్యార్థులు పుస్తకాలను రిఫర్ చేయడానికి, జ్ఞానాన్ని విశ్లేషించడానికి, అర్థం చేసుకోవడానికి, వర్తింపజేయడానికి అవకాశం ఉంటుంది.

ALSO READ: పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు-రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసా?

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Gold Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
RBI: పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi receives US Vice President JD Vance Family | అమెరికా ఉపాధ్యక్షుడికి సాదర స్వాగతం పలికిన ప్రధాని మోదీ | ABP DesamRohit Sharma Virat Kohli PoTM IPL 2025 Reason Why | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్ | ABP DesamRohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Gold Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
RBI: పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
AI Effect On Middle Class: హలో మధ్యతరగతి మాష్టారు ఇది మీ కోసమే! త్వరలో మీరు రోడ్డున పడబోతున్నారు! మీకు అర్థమవుతుందా!
హలో మధ్యతరగతి మాష్టారు ఇది మీ కోసమే! త్వరలో మీరు రోడ్డున పడబోతున్నారు! మీకు అర్థమవుతుందా!
Free online DSC Coaching: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ వివరాలు ఇవే!
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ వివరాలు ఇవే!
Tax Saving Tips: రూ.18 లక్షల జీతంపైనా
రూ.18 లక్షల జీతంపైనా "జీరో టాక్స్‌" - చట్టాన్ని మీ చుట్టం చేసుకోవచ్చు!
Fake 500 Notes: 500 నోట్లలో భారీగా నకిలీలు - ఫేక్ ప్రింటర్లు ఈ ఒక్క మిస్టేక్ చేశారట - ఇలా గుర్తించండి !
500 నోట్లలో భారీగా నకిలీలు - ఫేక్ ప్రింటర్లు ఈ ఒక్క మిస్టేక్ చేశారట - ఇలా గుర్తించండి !
Embed widget