అన్వేషించండి

Crime News: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు - ఇద్దరి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం

Brutal Murder: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. వివాహేతర సంబంధంతో వచ్చిన వివాదాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి.

Brutal Murders In Telugu States Due To Extramarital Affair: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి మహిళతో అక్రమ సంబంధం కారణంగా ఏర్పడిన వివాదంతో దారుణహత్యకు గురయ్యాడు. అటు, తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో తనయుడి వివాహేతర సంబంధం అతని తండ్రి హత్యకు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా (Guntur District) పొన్నూరు మండల పరిధిలోని ములుకుదురు గ్రామంలో దారుణం జరిగింది. మండల పరిధిలోని మాచవరం గ్రామానికి చెందిన నక్కల దేవరాజ్ (34) విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ములుకుదురుకి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే, సదరు మహిళ అదే గ్రామానికి చెందిన మాధవ్ అనే వ్యక్తితోనూ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలోనే దేవరాజ్, మాధవ్ మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

ఇనుప రాడ్‌తో కొట్టి..

ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున మాధవ్ కొంతమంది యువకులతో కలిసి దేవరాజ్‌పై ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన దేవరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులోని ఓ మద్యం దుకాణం వద్ద పడేశారు. ఉదయం స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, తమకు న్యాయం చేయాలంటూ దేవరాజ్ కుటుంబ సభ్యులు బాపట్ల - గుంటూరు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రాకపోకలు స్తంభించాయి. తెనాలి డీఎస్పీ జనార్ధన్‌రావు వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. కాగా, మృతుడికి ఇప్పటికే వివాహం అయినట్లు తెలుస్తోంది.

తనయుడు వివాహేతర సంబంధంతో..

అటు, తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో (Mancherial District) ఘోరం జరిగింది. తనయుడి వివాహేతర బంధం అతని తండ్రి హత్యకు దారి తీసింది. ఈ ఘటన చెన్నూరు మండలంలోని ముత్తరావుపల్లిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన పైడిపెల్లి మల్లయ్య(50) అదే గ్రామానికి చెందిన జాడి భూమయ్య చేతిలో హత్యకు గురయ్యాడు. మృతుడి కుమారుడు రాజశేఖర్ భూమయ్య భార్యను 7 నెలల క్రితం మరో ప్రాంతానికి తీసుకెళ్లి సహజీవనం చేస్తున్నాడు. దీంతో భూమయ్య తన భార్య కనబడటం లేదని ఫిర్యాదు చేయగా... పోలీసులు కేసు నమోదు చేశారు.

వివిధ ప్రాంతాల్లో గాలించి వారిద్దరిని పట్టుకొని తీసుకొచ్చి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే, ఆమె తన భర్తతో ఉండేందుకు నిరాకరించి తిరిగి ప్రియుడితోనే వెళ్లిపోయింది. అప్పటి నుంచి మల్లయ్య కుటుంబంపై భూమయ్య కక్ష పెంచుకున్నాడు. శనివారం గ్రామ సమీపంలోని వాగు వైపు మల్లయ్య బహిర్భూమికి వెళ్లగా భూమయ్య తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. అటువైపు వెళ్లిన గ్రామస్థులకు మల్లయ్య మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తనపై కోపంతోనే తన తండ్రిని హత్య చేశాడని మృతుడి కుమారుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు.

Also Read: Crime News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - చెరువులో దూకి ఇద్దరు పిల్లలు సహా తండ్రి ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Live Murder in Hyderabad: నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
Pulivendula Firing: పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
BRS Leaders Arrest: కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి వివాదం.. ఏడుగురు బీఆర్ఎస్ నేతల అరెస్ట్, 14 రోజుల రిమాండ్
రూ.65 వేల నుంచి లక్ష ధరలో హోండా టూవీలర్స్‌.. షైన్‌, యాక్టివ్‌, డియో, లివో మోడళ్లు
రూ.లక్ష లోపే కొనగలిగే హోండా బైక్ లేదా స్కూటర్.. మీ కోసం 10 రకాల టూవీలర్లు
Embed widget