అన్వేషించండి

Crime News: నగరంలో మరో విషాదం.. కూల్ డ్రింక్‌లో విషం కలిపి కుమార్తెకు ఇచ్చి, తాను తాగిన తల్లి! చిన్నారి మృతి

Medchal Crime News | మేడ్చల్ జిల్లాలో మరో తల్లి కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. విషం తాగిన చిన్నారి చనిపోగా, తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

మేడ్చల్ జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నతల్లే తన కంటి పాప ప్రాణాలు తీసింది. విషం పెట్టి చిన్నారిని మరో తల్లి చిదిమేసిందని స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మొన్న గాజులరామారంలో ఓ తల్లి ఇద్దరు కొడుకులను కొడవలితో నరికి దారుణంగా హత్య చేసి, ఆత్మహత్య చేసుకోడం మరువకముందే నగరంలో జరిగిన మరో ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్ లో నాలుగు సంవత్సరాల కూతురికి విషం ఇచ్చింది. తల్లి కూడా విషం తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. కూతురు మృతి చెందగా , ఆసుపత్రిలో తల్లి చికిత్స పొందుతోంది. కూకట్‌పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్ లో తల్లి చికిత్స పొందుతుందని పోలీసులు తెలిపారు. అనారోగ్య సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాచుపల్లి పోలీసులు తెలిపారు.

అసలేం జరిగిందంటే..

కూకట్‌పల్లి ప్రగతి నగర్ లోని హరిత ఆర్కేడ్, ఆదిత్య గార్డెన్స్ లో సాంబశివరావు ఫ్లాట్ నెం. 102లో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య నంబూరి కృష్ణ పావని అనే మహిళ (33) ఏప్రిల్ 18న సాయంత్రం 04:30 గంటలకు కూల్ డ్రింకులో పి ఎలుకల మందు కలిపింది. నాలుగున్నరేళ్లు కుమార్తె జెష్వికకు కూల్ డ్రింక్ ఇచ్చి, తాను కూడా తాగింది. 

మరుసటి రోజు (19.04.2025) ఉదయం 04:30 గంటలకు తాము విషం తీసుకున్నామని తన భర్తకు కృష్ణ పావని తెలిపింది. అప్రమత్తమైన సాంబశివరావు ఇంటికి చేరుకుని తన భార్య, కుమార్తెను ఉదయం 08.45 గంటలకు చికిత్స నిమిత్తం కేపీహెచ్‌బీలోని ప్రసాద్ ఆసుపత్రికి తరలించాడు. ఆమె ప్రసాద్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతోంది. 

చిన్నారి జెష్విక పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సలహా మేరకు సాయంత్రం 06.30 గంటల ప్రాంతంలో కేపీహెచ్‌బీలోని రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆసుపత్రికి  తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి జెష్విక చనిపోయింది. హాస్పిటల్ యాజమాన్యం కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు జెష్విక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పావని భర్త పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అనారోగ్య కారణాలతో కూతురికి విషం ఇచ్చి, పావని ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మేడ్చల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లంపేట్ ఎగ్జిట్ 4A వద్ద తెల్లవారుజామున ఓ కారు అతివేగంగా దూసుకొచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోకాపేట్ వాసి భాను ప్రకాష్, అతని స్నేహితుడు అక్కడికక్కడే మృతి చెందారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
Telangana Mass Killing:షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
షాబాద్‌, దైవాలగూడలో అర్థరాత్రి ఏం జరిగింది? పోలీసులు చెప్పింది వింటే వణుకుపుడుతుంది!
Telangana Mass Killing: పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
పోలీసుల నిర్లక్షంతోనే షాబాద్‌ మర్డర్స్‌! దైవాలగూడ ప్రజల ఆందోళన!
Telangana Mass Killing News: రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం
రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
ఆరు హత్యలు జరిగిన గ్రామాలకు వెళ్లేందుకు నేతల ప్రయత్నం- అడ్డుకున్న పోలీసులు 
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Ramayana Trailer : విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
విజువల్ వండర్ రామాయణ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - రూమర్స్‌కు చెక్
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Embed widget