అన్వేషించండి

Vijayawada Crime: బెజవాడ 'ఖాకీ'ల సాహసం... గుజరాత్ వెళ్లి చెడ్డీ గ్యాంగ్ కు వల ... ముగ్గురు నిందితులు అరెస్టు

వరుస దొంగతనాలతో సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ ను విజయవాడలో పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ సమీపంలో చెడ్డీ గ్యాంగ్ లోని ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు.

విజయవాడ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలతో చెడ్డీ గ్యాంగ్ నగరవాసులకు కంటి మీద కునుకులేకుండా చేసింది. చెడ్డీ గ్యాంగ్ వివరాలను సీపీ కాంతిరాణా టాటా వెల్లడించారు. గ్యాంగ్ సభ్యులు ముగ్గురిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. 15 రోజుల నుంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ముఠాను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి చోరీ సొత్తులో 20 వేల నగదు, ముప్పై రెండు గ్రాముల బంగారం, రెండున్నర కేజీలు వెండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి విజయవాడ నుంచి ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, గుజరాత్ కు వెళ్లి ఎంతో శ్రమించాయని తెలిపారు. పోరంకి వసంత నగర్ లో దొంగతనానికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల నుంచి వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విజయవాడ టూ టౌన్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటపల్లిలో జరిగిన చోరీ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. మరికొంతమంది పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. 

Vijayawada Crime: బెజవాడ 'ఖాకీ'ల సాహసం... గుజరాత్ వెళ్లి చెడ్డీ గ్యాంగ్ కు వల ... ముగ్గురు నిందితులు అరెస్టు

Also Read: చెడ్డీ గ్యాంగ్ మూలాలు తెలుసా.. వాళ్లు నరరూప రాక్షసులుగా ఎందుకు మారారు?

అసలెవరూ చెడ్డీ గ్యాంగ్?

చెడ్డీ గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్ లో వణుకు పుట్టిస్తున్న ప్రధాన దోపిడి ముఠా. ఇప్పటికే విజయవాడలో పోలీసులకు దొరక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్న చెడ్డీ గ్యాంగ్ మూలాలు గుజరాత్ లోని దవోద్ జిల్లా గూద్ బాలా తాలుకాలోని నహేడా అనే గిరిజన గ్రామం నుంచి ఉన్నాయి. వీరు దోపిడీలకు పాల్పడక ముందు అడవిలోని పోడు భూములలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. అక్కడ ఉన్న జీవులను వేటాడటం వీరి ప్రధానవృత్తి.  పేస్ పార్థి అనేది వీరి తెగ. అయితే వీరు దోపిడీలు చేసే సమయంలో చెడ్డీలు ధరించి వస్తారు. కాబట్టి వీరికి చెడ్డీ గ్యాంగ్ అని పేరు వచ్చింది. మొదట్లో వీరు ఎలాంటి దోపిడీలు చేయకుండా తమ వృత్తినే నమ్ముకొని జీవనం సాగించేవారు. కానీ ప్రకృతి విపత్తులు దాడి చేయడంతో వ్యవసాయం వీరికి కలిసి రాలేదు. వన్యమృగాలును వేటాడటం ప్రభుత్వం నిషేదించింది. దీంతో వీరికి ఏం చేయాలో దిక్కుతెలిని సమయంలో ఆ తెగ పెద్ద అయిన రాంజీ  ఒక ఐదుమందితో ముఠాను ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చినట్లు చెప్తారు. అయితే  అలా తమ తెగను కాపాడుకొనేందుకు ప్రారంభమైన ముఠా క్రమంగా పదులు సంఖ్యలోకి విస్తరించింది. 1987లో ప్రారంభమైన వీరి దొంగతనాలు 1999లో బాహ్య ప్రపంచానికి తెలిసి వచ్చింది. అప్పటి వరకు వీరి అకృత్యాల గురించి తెలిసినప్పటికీ ఎవ్వరు చేస్తున్నారన్నది మాత్రం బయటకు రాలేదు.

Also Read: ఇక చెడ్డీ గ్యాంగ్ ల ఆటకట్టు... రంగంలోకి ప్రత్యేక నిఘా బృందాలు... విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా

బెజవాడలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్

బెజవాడలో చెడ్డీ గ్యాంగ్ ఇటీవల చెలరేగిపోయింది. నగర శివారులో వరుస దోపిడీలతో పోలీసులకు సవాల్ విసిరారు. చెడ్డీలు ధరించి, మారణాయుధాలతో దొంగతనాలకు తెగబడుతున్నారు. ఇటీవల సీఎం క్యాంపు ఆఫీసుకు సమీపంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అపార్ట్ మెంట్ లలో చోరీ చేశారు. దొంగతనం సమయంలో ఎవరైనా ప్రతిఘటిస్తే వారిని హతమార్చడం, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడడం చేస్తున్నారు చెడ్డీ గ్యాంగ్. విన‌డానికి వ‌ణుకు పుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్ ఇటీవల హైదరాబాద్‌లో దడ పుట్టించారు. ఇప్పుడు ఏపీలో చెడ్డీ గ్యాంగ్ హడలెత్తిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలలో చెడ్డీ గ్యాంగ్ వరుసగా చోరీలకు పాల్పడ్డారు. పది రోజుల వ్యవధిలో చెడ్డీ గ్యాంగ్ ఐదు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. చిట్టి నగర్, గుంటుపల్లి, తాడేపల్లి, కుంచనపల్లి అపార్ట్ మెంట్లలలో దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read: తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Embed widget