అన్వేషించండి

Annamayya District: రైలు పట్టాలపై కూర్చొని గంజాయి సేవించారు - మత్తులో ఉండగా రైలు ఢీకొని ఇద్దరు విద్యార్థుల మృతి

Andhra News: రైలు పట్టాలపై గంజాయి తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. మత్తులో రైలు గమనించక ఈ ప్రమాదం జరిగింది.

Students Killed Due To Train Collision: రైలు పట్టాలపై గంజాయి సేవించిన ఇద్దరు విద్యార్థులు మత్తులో ఉండగా రైలు ఢీకొని మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లాలో (Annamayya District) చోటు చేసుకుంది. కదిరి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలేరుకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి కిరణ్ కుమార్ (18), అదే పట్టణానికి చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి యాసిన్ (17) మంగళవారం రాత్రి చిత్తూరు మార్గంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి గంజాయి తీసుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో నాగర్‌కోయిల్ నుంచి ముంబయి వెళ్లే రైలు వీరిపై నుంచి దూసుకెళ్లింది. గంజాయి మత్తులో రైలు వస్తోన్న విషయాన్ని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. లోకోపైలట్ అందించిన సమాచారంతో రైల్వే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. యాసిన్ అప్పటికే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్న కిరణ్‌కుమార్‌ను తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరూ గంజాయికి అలవాటు పడ్డారని.. వారి వద్ద గంజాయి పొట్లాలు దొరికాయని రైల్వే పోలీసులు వెల్లడించారు.

ప్రియుడి మోజులో పడి..

మరోవైపు, ప్రియుడి మోజులో పడి ఓ మహిళ భర్తకే విషం పెట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఏవీ నగరంలో వివాహిత ప్రియుడితో కలిసి భర్తనే హతమార్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో పని చేసే వివాహితకు.. అక్కడే పని చేసే ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం కాస్త భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే, తమ అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా భర్తకు ఈ నెల 19వ తేదీన విషం పెట్టి హతమార్చి.. సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో అసలు నిజం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భార్యే.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు తేల్చారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: Nara Lokesh and MohanDas Pai : బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్

వీడియోలు

Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam
Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
Sanitation worker Honesty: నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
Viral News: మోడిఫైడ్ సైలెన్సర్లతో స్టంట్లు.. 1 లక్ష జరిమానా విధించి, కారును సీజ్ చేసిన బెంగళూరు పోలీసులు
మోడిఫైడ్ సైలెన్సర్లతో స్టంట్లు.. 1 లక్ష జరిమానా విధించి, కారును సీజ్ చేసిన బెంగళూరు పోలీసులు
Embed widget