అన్వేషించండి

Annamayya District: రైలు పట్టాలపై కూర్చొని గంజాయి సేవించారు - మత్తులో ఉండగా రైలు ఢీకొని ఇద్దరు విద్యార్థుల మృతి

Andhra News: రైలు పట్టాలపై గంజాయి తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. మత్తులో రైలు గమనించక ఈ ప్రమాదం జరిగింది.

Students Killed Due To Train Collision: రైలు పట్టాలపై గంజాయి సేవించిన ఇద్దరు విద్యార్థులు మత్తులో ఉండగా రైలు ఢీకొని మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లాలో (Annamayya District) చోటు చేసుకుంది. కదిరి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలేరుకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి కిరణ్ కుమార్ (18), అదే పట్టణానికి చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి యాసిన్ (17) మంగళవారం రాత్రి చిత్తూరు మార్గంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి గంజాయి తీసుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో నాగర్‌కోయిల్ నుంచి ముంబయి వెళ్లే రైలు వీరిపై నుంచి దూసుకెళ్లింది. గంజాయి మత్తులో రైలు వస్తోన్న విషయాన్ని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. లోకోపైలట్ అందించిన సమాచారంతో రైల్వే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. యాసిన్ అప్పటికే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్న కిరణ్‌కుమార్‌ను తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరూ గంజాయికి అలవాటు పడ్డారని.. వారి వద్ద గంజాయి పొట్లాలు దొరికాయని రైల్వే పోలీసులు వెల్లడించారు.

ప్రియుడి మోజులో పడి..

మరోవైపు, ప్రియుడి మోజులో పడి ఓ మహిళ భర్తకే విషం పెట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఏవీ నగరంలో వివాహిత ప్రియుడితో కలిసి భర్తనే హతమార్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో పని చేసే వివాహితకు.. అక్కడే పని చేసే ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం కాస్త భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే, తమ అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా భర్తకు ఈ నెల 19వ తేదీన విషం పెట్టి హతమార్చి.. సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో అసలు నిజం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భార్యే.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు తేల్చారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: Nara Lokesh and MohanDas Pai : బెంగళూరు నుంచి ఏపీకి రావాలని లోకేష్ పిలుపు - ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాలన్న పారిశ్రామికవేత్త

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
Constable Dies in Road Accident: డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
Palnadu Crime News: లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
పల్నాడులో లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India-Pakistan Border Surveillance: భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
భారత్‌ సైనిక వ్యూహాత్మక స్థావరాలను చైనా కన్నుతో చూస్తోన్న పాక్‌!ఐఎస్‌ఐ కుట్రలు బహిర్గతం!
Nara Lokesh meets the President: పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిలో నిలిచిపోతాయి - అమరావతి రైతులకు రాష్ట్రపతి ప్రశంసలు
Varanasi Leaks : 'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పదా...
'వారణాసి' బోట్ యాక్షన్ సీన్ లీక్? - ఆ ప్రచారంలో నిజమెంత!... లీకుల బెడద తప్పదా...
Singer Mangli vs Subbarao: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Pocharam Srinivas Reddy: నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Nashik Corporate Jihad: మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
Embed widget