అన్వేషించండి

Constables Death: ఆన్‌లైన్ మోసం, అవమాన భయం - ఆ ఇద్దరు కానిస్టేబుళ్ల ఆత్మహత్య వెనుక అసలు కథ ఇదే!

Crime News: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్ల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆన్ లైన్ మోసంతో ఒకరు బలవన్మరణానికి పాల్పడగా.. మరొకరు అవమాన భారంతో ప్రాణాలు తీసుకున్నారు.

Two Constables Suicide In Joint Medak District: ఉమ్మడి మెదక్ జిల్లాలో (Medak District) ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడడం అటు వారి కుటుంబాలు, ఇటు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. ఆన్‌లైన్ మోసంలో రూ.25 లక్షలు నష్టపోయిన ఓ కానిస్టేబుల్ భార్య, ఇద్దరు పిల్లలకు విషం తాగించి అనంతరం తానూ తాగారు. అయినా, చావకపోవడంతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. భార్యా పిల్లలను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. మరో ఘటనలో వివాహేతర సంబంధం అన్న నిందారోపణతో ఓ కానిస్టేబుల్ స్టేషన్ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు.

ఆన్ లైన్ మోసంతో..

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బాలకృష్ణ అదే జిల్లాలోని టీజీఎస్‌పీ 17వ బెటాలియన్‌లో హెచ్‌సీగా పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సిద్ధిపేటలోని కలకుంట కాలనీలో నివాసం ఉంటున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికొచ్చిన ఆయన ఆందోళనగా కనిపించగా భార్య ఆరా తీశారు. అధిక లాభాల ఆశతో మహారాష్ట్రకు చెందిన గుర్తు తెలియని ఓ కంపెనీలో విడతలవారీగా రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టానని.. తర్వాత కంపెనీ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. అప్పులు తీర్చే మార్గం లేదని.. శనివారం రాత్రి టీలో ఎలుకల మందు కలిపి పిల్లలకు తాగించి అనంతరం తామూ తాగారు. 

ఉరి వేసుకుని..

ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు స్పృహలోకి వచ్చిన బాలకృష్ణ.. భార్యాపిల్లలు ప్రాణాలతో ఉండడాన్ని గమనించారు. మరో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటికి మెలకువ వచ్చిన భార్య.. సమీపంలోని బంధువులకు ఫోన్ చేయగా వారు వచ్చి అందరినీ సిద్ధిపేట సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలకృష్ణ మృతి చెందగా.. మానస, పిల్లలను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మానస, పిల్లలను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని.. ఆన్ లైన్ మోసంపై దర్యాప్తు చేస్తున్నామని వన్ టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపారు.

అవమాన భయంతో..

ఇక మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్‌లో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. క్వార్టర్స్ ఆవరణలోనే సాయికుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఆయన భార్య శైలజ ఫిర్యాదు మేరకు.. ఎస్సై మహ్మద్ గౌస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నర్సాపూర్‌లో నివసిస్తోన్న సాయికుమార్‌కు అదే పట్టణంలోని దివ్య అనే మహిళతో పరిచయం ఏర్పడడంతో ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే ఆమెతో పాటు భర్త శివకుమార్, అల్లుడు కిరణ్‌కుమార్.. సాయికుమార్‌ను వేధించసాగారు. దివ్యను సాయికుమార్ వేధిస్తున్నాడంటూ ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. విషయం తీవ్రంగా మారితే.. పరువు పోతుందని సాయికుమార్ ఆందోళన చెందారు. శనివారం రాత్రి విధులు నిర్వహించిన ఆయన ఆదివారం ఉదయం నడకకు వెళ్లి.. టీ తాగి స్టేషన్‌కు వచ్చారు.

అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి స్టేషన్ ఆవరణలోనే చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు గాలించగా.. స్టేషన్ వెనుక విగతజీవిగా కనిపించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: KTR: ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Hyderabad Latest News: సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!
సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!
Pradip Guruji: మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Embed widget