అన్వేషించండి

Constables Death: ఆన్‌లైన్ మోసం, అవమాన భయం - ఆ ఇద్దరు కానిస్టేబుళ్ల ఆత్మహత్య వెనుక అసలు కథ ఇదే!

Crime News: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్ల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆన్ లైన్ మోసంతో ఒకరు బలవన్మరణానికి పాల్పడగా.. మరొకరు అవమాన భారంతో ప్రాణాలు తీసుకున్నారు.

Two Constables Suicide In Joint Medak District: ఉమ్మడి మెదక్ జిల్లాలో (Medak District) ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడడం అటు వారి కుటుంబాలు, ఇటు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. ఆన్‌లైన్ మోసంలో రూ.25 లక్షలు నష్టపోయిన ఓ కానిస్టేబుల్ భార్య, ఇద్దరు పిల్లలకు విషం తాగించి అనంతరం తానూ తాగారు. అయినా, చావకపోవడంతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. భార్యా పిల్లలను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. మరో ఘటనలో వివాహేతర సంబంధం అన్న నిందారోపణతో ఓ కానిస్టేబుల్ స్టేషన్ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు.

ఆన్ లైన్ మోసంతో..

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బాలకృష్ణ అదే జిల్లాలోని టీజీఎస్‌పీ 17వ బెటాలియన్‌లో హెచ్‌సీగా పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సిద్ధిపేటలోని కలకుంట కాలనీలో నివాసం ఉంటున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికొచ్చిన ఆయన ఆందోళనగా కనిపించగా భార్య ఆరా తీశారు. అధిక లాభాల ఆశతో మహారాష్ట్రకు చెందిన గుర్తు తెలియని ఓ కంపెనీలో విడతలవారీగా రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టానని.. తర్వాత కంపెనీ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. అప్పులు తీర్చే మార్గం లేదని.. శనివారం రాత్రి టీలో ఎలుకల మందు కలిపి పిల్లలకు తాగించి అనంతరం తామూ తాగారు. 

ఉరి వేసుకుని..

ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు స్పృహలోకి వచ్చిన బాలకృష్ణ.. భార్యాపిల్లలు ప్రాణాలతో ఉండడాన్ని గమనించారు. మరో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటికి మెలకువ వచ్చిన భార్య.. సమీపంలోని బంధువులకు ఫోన్ చేయగా వారు వచ్చి అందరినీ సిద్ధిపేట సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలకృష్ణ మృతి చెందగా.. మానస, పిల్లలను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మానస, పిల్లలను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని.. ఆన్ లైన్ మోసంపై దర్యాప్తు చేస్తున్నామని వన్ టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపారు.

అవమాన భయంతో..

ఇక మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్‌లో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. క్వార్టర్స్ ఆవరణలోనే సాయికుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఆయన భార్య శైలజ ఫిర్యాదు మేరకు.. ఎస్సై మహ్మద్ గౌస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నర్సాపూర్‌లో నివసిస్తోన్న సాయికుమార్‌కు అదే పట్టణంలోని దివ్య అనే మహిళతో పరిచయం ఏర్పడడంతో ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే ఆమెతో పాటు భర్త శివకుమార్, అల్లుడు కిరణ్‌కుమార్.. సాయికుమార్‌ను వేధించసాగారు. దివ్యను సాయికుమార్ వేధిస్తున్నాడంటూ ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. విషయం తీవ్రంగా మారితే.. పరువు పోతుందని సాయికుమార్ ఆందోళన చెందారు. శనివారం రాత్రి విధులు నిర్వహించిన ఆయన ఆదివారం ఉదయం నడకకు వెళ్లి.. టీ తాగి స్టేషన్‌కు వచ్చారు.

అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి స్టేషన్ ఆవరణలోనే చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు గాలించగా.. స్టేషన్ వెనుక విగతజీవిగా కనిపించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: KTR: ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Indian Tourists Boat Capsize: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు టూరిస్టులు సహా 15 మంది మృతి!
Telangana Mass Killing: కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?
కొడుకు రింగ్ మింగేసినా చికిత్స చేయించని రాజ్‌కుమార్! డెత్‌స్పాట్‌లో ఉన్న 7 రాళ్ల కథేంటీ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget