అన్వేషించండి

RPF Constable Suicide: రేణిగుంటలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య... సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకోవడంతో... పోలీసుల దర్యాప్తు

రేణిగుంటలో ఆర్పీఎఫ్ బ్యారెక్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

చిత్తూరు జిల్లా రేణిగుంటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్పీఎఫ్ బ్యారెక్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ హెచ్ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనందరావు ఆదివారం తెల్లవారు జామున తన దగ్గర ఉన్న పిస్టల్‌తో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆనందరావు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడిది శ్రీకాకుళం జిల్లా చింతలపోలూరు అని పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనపై రేణిగుంట సీఐ అంజూ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళానికి చెందిన హెచ్‌ ఆనందరావు ఇటీవల సెలవులపై ఇంటికి వెళ్లి వచ్చారు. ఆగష్టు 3న ఆయన తిరిగి విధుల్లో చేరారు. అయితే ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో రైల్వే బ్యారెక్ ఆర్మర్‌ గదిలో కూర్చీలో కూర్చుని... తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలోనే ఆయన మరణించాడు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఆయన విధుల్లో ఉండాల్సి ఉంది. ఉదయం 4 గంటలకు ఏఎస్సై రాజు తుపాకీ డిపాజిట్‌ చేసేందుకు రాగా కానిస్టేబుల్ ఆత్మహత్య విషయం వెలుగు చూసిందన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు రేణిగుంట సీఐ అంజూ యాదవ్ తెలిపారు. ఘటనా స్థలంలో ఎటువంటి సుసైడ్‌ నోట్‌ లభించలేదని పేర్కొన్నారు.

 ఆత్మహత్యల్లో మహిళలకంటే పురుషులే అధికం

మనిషి తన జీవితాన్ని అంతం చేసుకోవాలని ప్రవర్తను వైద్య భాషలో పారాసూసైడ్‌ అని పిలుస్తారు. వ్యవహరికంగా సూసైడల్‌ టెండెన్సీ అంటారు. మనిషి తన జీవితాన్ని తనకు తాను అంతం చేసుకుంటే దానిని ఆత్మహత్య లేదా సూసైడ్‌ అంటారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, ఆ ప్రయత్నాలు ఈ రెండూ కూడా మానసిక వ్యాధులు అని వైద్యులు పిలుస్తారు.

ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు సాధారణ అయ్యాయి. రోజురోజుకు ఆత్మ హత్యలు చేసుకునే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న లెక్కల్లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కల్గించే అంశం. ప్రపంచంలో ప్రతీ 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతుంటే, భారతదేశంలో ప్రతీ రెండు నిమిషాలకు ఒకరు బలన్మరణానికి పాల్పడుతున్నారు. ఆ లెక్కల్లో యువత ఎక్కువ ఉన్నారు. మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. 2019 నివేదికల ప్రకారం మన దేశంలో రోజూ సగటున 381 మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది. అనుబంధాలు, ఆప్యాయతలు, సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. చిన్న చిన్న కుటుంబ సమస్యలను కొందరు పెద్దవిగా భావించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రేమ, పెళ్లి వంటి అంశాలే కాక, మత్తుమందులకు బానిసలు అవ్వడంతో యువత తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
Constable Dies in Road Accident: డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
Palnadu Crime News: లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
పల్నాడులో లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Rajinikanth : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
Embed widget