అన్వేషించండి

RPF Constable Suicide: రేణిగుంటలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య... సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకోవడంతో... పోలీసుల దర్యాప్తు

రేణిగుంటలో ఆర్పీఎఫ్ బ్యారెక్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

చిత్తూరు జిల్లా రేణిగుంటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్పీఎఫ్ బ్యారెక్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ హెచ్ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనందరావు ఆదివారం తెల్లవారు జామున తన దగ్గర ఉన్న పిస్టల్‌తో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆనందరావు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడిది శ్రీకాకుళం జిల్లా చింతలపోలూరు అని పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనపై రేణిగుంట సీఐ అంజూ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళానికి చెందిన హెచ్‌ ఆనందరావు ఇటీవల సెలవులపై ఇంటికి వెళ్లి వచ్చారు. ఆగష్టు 3న ఆయన తిరిగి విధుల్లో చేరారు. అయితే ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో రైల్వే బ్యారెక్ ఆర్మర్‌ గదిలో కూర్చీలో కూర్చుని... తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలోనే ఆయన మరణించాడు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఆయన విధుల్లో ఉండాల్సి ఉంది. ఉదయం 4 గంటలకు ఏఎస్సై రాజు తుపాకీ డిపాజిట్‌ చేసేందుకు రాగా కానిస్టేబుల్ ఆత్మహత్య విషయం వెలుగు చూసిందన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు రేణిగుంట సీఐ అంజూ యాదవ్ తెలిపారు. ఘటనా స్థలంలో ఎటువంటి సుసైడ్‌ నోట్‌ లభించలేదని పేర్కొన్నారు.

 ఆత్మహత్యల్లో మహిళలకంటే పురుషులే అధికం

మనిషి తన జీవితాన్ని అంతం చేసుకోవాలని ప్రవర్తను వైద్య భాషలో పారాసూసైడ్‌ అని పిలుస్తారు. వ్యవహరికంగా సూసైడల్‌ టెండెన్సీ అంటారు. మనిషి తన జీవితాన్ని తనకు తాను అంతం చేసుకుంటే దానిని ఆత్మహత్య లేదా సూసైడ్‌ అంటారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన, ఆ ప్రయత్నాలు ఈ రెండూ కూడా మానసిక వ్యాధులు అని వైద్యులు పిలుస్తారు.

ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు సాధారణ అయ్యాయి. రోజురోజుకు ఆత్మ హత్యలు చేసుకునే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న లెక్కల్లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కల్గించే అంశం. ప్రపంచంలో ప్రతీ 40 సెకన్లకు ఒకరు ఆత్మహత్యకు పాల్పడుతుంటే, భారతదేశంలో ప్రతీ రెండు నిమిషాలకు ఒకరు బలన్మరణానికి పాల్పడుతున్నారు. ఆ లెక్కల్లో యువత ఎక్కువ ఉన్నారు. మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. 2019 నివేదికల ప్రకారం మన దేశంలో రోజూ సగటున 381 మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది. అనుబంధాలు, ఆప్యాయతలు, సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. చిన్న చిన్న కుటుంబ సమస్యలను కొందరు పెద్దవిగా భావించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రేమ, పెళ్లి వంటి అంశాలే కాక, మత్తుమందులకు బానిసలు అవ్వడంతో యువత తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget