అన్వేషించండి

Telangana : సూర్యాపేట పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు - సొంత అన్నే కీలక సూత్రధారి - ఆరుగురు నిందితులు అరెస్ట్

Telangana : సూర్యాపేట జిల్లాలో జరిగిన పరువు హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana : ఇటీవల సూర్యాపేట జిల్లా (Suryapet Dist)లో చోటు చేసుకున్న పరువు హత్య కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు జరుపుతోన్న దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కులాంతరం వివాహం చేసుకుందన్న కోపంతో అమ్మాయి తరపు బంధువులే ఈ హత్య చేసినట్టు దర్యాప్తులో తెలింది. హత్య చేసింది అమ్మాయి సోదరుడేనని పోలీసులు గుర్తించారు. కాగా ఈ కేసులో మొత్తం ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం.

ఎప్పుడు, ఎలా మొదలైందంటే..

సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (Vadlakonda Krishna) అలియాస్ బంటి, భార్గవి అనే పిల్లలమర్రికి చెందిన యువతి ఆర్నేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమను అమ్మాయి తరపు వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కృష్ణను చంపుతానని పలుమార్లు భార్గవి సోదరుడు నవీన్ బెదిరించినట్టు తెలుస్తోంది. అయితే నవీన్ తో ముందు నుంచే ఉన్న పరిచయంతో కృష్ణ తరచూ వాళ్లింటికి వస్తూండేవాడు. ఈ క్రమంలోనే భార్గవి, కృష్ణ మధ్య ప్రేమ ఏర్పడింది. ఈ సమయంలోనే కుటుంబసభ్యులు వేరే సంబంధం తీసుకురావడంతో.. అది ఇష్టం లేని భార్గవి, కృష్ణతో కలిసి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.

బంధువులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం సూర్యాపేటలో నివాసముంటోంజియ ఈ జంట తమ కళ్ల ముందే ఉండడాన్ని భార్గవి కుటుంబసభ్యులు తట్టుకోలేకపోయారు. అంతులేని పగతో భార్గవి సోదరుడు నవీన్ పక్కా ప్లాన్ వేసి మరీ కృష్ణను హతమార్చాడు. అందుకు కుటుంబసభ్యుల్లో నలుగురితోపాటు మరో ఇద్దరి సహాయమూ తీసుకున్నాడు. అలా జనవరి 26వ తేదీన రాత్రి 9గంటల సమయంలో జనగాం క్రాస్ రోడ్డు సమీపంలో నిందితుల్లో ఒకరైన బైరు మహేష్ వ్యవసాయ భూమి వద్ద హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని తెల్లవారుజామున పిల్లలమర్రి గ్రామం వద్ద మూసీ కాలువ (Musi Canal) కట్టపై కృష్ణ డెడ్ బాడీని వదిలేసి, నిందితులందరూ పరారయ్యారు. ఘటన అనంతరం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమందించారు. ఫైనల్ గా ఈ హత్యకు ప్రధాన కారణం ప్రేమ వివాహమే అని తేలింది. ఈ క్రమంలోనే హత్య చేసిన నిందితుల వివరాలు కూడా బయటికొచ్చాయి.

రెండు నెలల ముందు నుంచే ప్లాన్

తమ సోదరిని వేరే కులం వ్యక్తి వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతే భార్గవి సోదరుడు నవీన్, కృష్ణను హతమార్చేందుకు రెండు నెలల నుంచే ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ హత్య చేసేందుకు తాళ్లగడ్డకు చెందిన బైరు మహేష్ తో పాటు నల్గొండకు చెందిన మరో యువకుడి సాయం తీసుకున్నాడు. ఈ పథకాన్ని మొదట జనవరి 19న అమలు చేయాలని భావించినప్పటికీ, అప్పుడు కుదరకపోవడంతో జనవరి 26, ఆదివారం నాడు హత్య చేశారు.

Also Read : Supreme Court: తన భర్త వల్ల పుట్టలేదని కుమారుడి తండ్రి పేరు రికార్డుల్లో మార్చాలని ఓ తల్లి పిటిషన్ - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
Ayesha Meera Last Rites: అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
Embed widget