అన్వేషించండి

Telangana : సూర్యాపేట పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు - సొంత అన్నే కీలక సూత్రధారి - ఆరుగురు నిందితులు అరెస్ట్

Telangana : సూర్యాపేట జిల్లాలో జరిగిన పరువు హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana : ఇటీవల సూర్యాపేట జిల్లా (Suryapet Dist)లో చోటు చేసుకున్న పరువు హత్య కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు జరుపుతోన్న దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కులాంతరం వివాహం చేసుకుందన్న కోపంతో అమ్మాయి తరపు బంధువులే ఈ హత్య చేసినట్టు దర్యాప్తులో తెలింది. హత్య చేసింది అమ్మాయి సోదరుడేనని పోలీసులు గుర్తించారు. కాగా ఈ కేసులో మొత్తం ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సమాచారం.

ఎప్పుడు, ఎలా మొదలైందంటే..

సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (Vadlakonda Krishna) అలియాస్ బంటి, భార్గవి అనే పిల్లలమర్రికి చెందిన యువతి ఆర్నేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమను అమ్మాయి తరపు వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. కృష్ణను చంపుతానని పలుమార్లు భార్గవి సోదరుడు నవీన్ బెదిరించినట్టు తెలుస్తోంది. అయితే నవీన్ తో ముందు నుంచే ఉన్న పరిచయంతో కృష్ణ తరచూ వాళ్లింటికి వస్తూండేవాడు. ఈ క్రమంలోనే భార్గవి, కృష్ణ మధ్య ప్రేమ ఏర్పడింది. ఈ సమయంలోనే కుటుంబసభ్యులు వేరే సంబంధం తీసుకురావడంతో.. అది ఇష్టం లేని భార్గవి, కృష్ణతో కలిసి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.

బంధువులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం సూర్యాపేటలో నివాసముంటోంజియ ఈ జంట తమ కళ్ల ముందే ఉండడాన్ని భార్గవి కుటుంబసభ్యులు తట్టుకోలేకపోయారు. అంతులేని పగతో భార్గవి సోదరుడు నవీన్ పక్కా ప్లాన్ వేసి మరీ కృష్ణను హతమార్చాడు. అందుకు కుటుంబసభ్యుల్లో నలుగురితోపాటు మరో ఇద్దరి సహాయమూ తీసుకున్నాడు. అలా జనవరి 26వ తేదీన రాత్రి 9గంటల సమయంలో జనగాం క్రాస్ రోడ్డు సమీపంలో నిందితుల్లో ఒకరైన బైరు మహేష్ వ్యవసాయ భూమి వద్ద హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని తెల్లవారుజామున పిల్లలమర్రి గ్రామం వద్ద మూసీ కాలువ (Musi Canal) కట్టపై కృష్ణ డెడ్ బాడీని వదిలేసి, నిందితులందరూ పరారయ్యారు. ఘటన అనంతరం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమందించారు. ఫైనల్ గా ఈ హత్యకు ప్రధాన కారణం ప్రేమ వివాహమే అని తేలింది. ఈ క్రమంలోనే హత్య చేసిన నిందితుల వివరాలు కూడా బయటికొచ్చాయి.

రెండు నెలల ముందు నుంచే ప్లాన్

తమ సోదరిని వేరే కులం వ్యక్తి వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతే భార్గవి సోదరుడు నవీన్, కృష్ణను హతమార్చేందుకు రెండు నెలల నుంచే ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ హత్య చేసేందుకు తాళ్లగడ్డకు చెందిన బైరు మహేష్ తో పాటు నల్గొండకు చెందిన మరో యువకుడి సాయం తీసుకున్నాడు. ఈ పథకాన్ని మొదట జనవరి 19న అమలు చేయాలని భావించినప్పటికీ, అప్పుడు కుదరకపోవడంతో జనవరి 26, ఆదివారం నాడు హత్య చేశారు.

Also Read : Supreme Court: తన భర్త వల్ల పుట్టలేదని కుమారుడి తండ్రి పేరు రికార్డుల్లో మార్చాలని ఓ తల్లి పిటిషన్ - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh in Delhi: ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
Telangana Assembly:  ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
Andhra Pradesh Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Revanth Reddy Challenge: చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan South Indian Temples Tour | పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించటం లేదంటే.! | ABP DesamErrum Manzil Palace | నిర్లక్ష్యానికి బలైపోతున్న చారిత్రక కట్టడం | ABP DesamArya Vysya Corporation Chairman Doondi Rakesh Interview | ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్ ఇంటర్వ్యూ | ABP DesamTirupati Deputy Mayor Election MLC Kidnap | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో హై టెన్షన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh in Delhi: ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
Telangana Assembly:  ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
Andhra Pradesh Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Revanth Reddy Challenge: చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
Jr NTR: అభిమానులకు ఎన్టీఆర్ రిక్వెస్ట్... త్వరలో నేనే కలుస్తా, నన్ను కలవడానికి పాదయాత్రలు వద్దు!
అభిమానులకు ఎన్టీఆర్ రిక్వెస్ట్... త్వరలో నేనే కలుస్తా, నన్ను కలవడానికి పాదయాత్రలు వద్దు!
Revanth Reddy in Assembly: లోటుపాట్లు లేకుండా సమగ్ర సర్వే - కులగణన నివేదిక ఖచ్చితమైనదన్న రేవంత్ !
లోటుపాట్లు లేకుండా సమగ్ర సర్వే - కులగణన నివేదిక ఖచ్చితమైనదన్న రేవంత్ !
PM Modi Speech In Lok Sabha: సమయాన్ని వృథా చేశారు- కాంగ్రెస్ పాలనపై లోక్‌సభలో మోదీ విసుర్లు
సమయాన్ని వృథా చేశారు- కాంగ్రెస్ పాలనపై లోక్‌సభలో మోదీ విసుర్లు
SSMB29: మహేష్ బాబు కోసం హైదరాబాద్‌లో కాశీని క్రియేట్ చేస్తున్న రాజమౌళి
మహేష్ బాబు కోసం హైదరాబాద్‌లో కాశీని క్రియేట్ చేస్తున్న రాజమౌళి
Embed widget