అన్వేషించండి

Mahabubnagar Crime News: తనను ప్రేమించలేదని కత్తితో దాడి చేసి యువతి దారుణహత్య.. జడ్చర్లలో దారుణం

జడ్చర్లలో తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది ప్రైవేట్ స్కూల్ టీచర్‌పై కత్తితో దారుణంగా దాడి చేయగా, ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రేమ నిరాకరించినందుకు యువతిపై కత్తితో దాడి, హత్య.
  • ప్రేమోన్మాది దాడిలో ఉపాధ్యాయురాలు చికిత్సలో మృతి.
  • స్థానికులు పట్టుకుని చితకబాదారు, పోలీసులకు అప్పగింత.
  • బాలికపై అత్యాచారం: కానిస్టేబుల్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష.

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందనే కక్షతో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. జడ్చర్లలోని ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న యువతిని నిందితుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం నాడు ఆమె బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక్కసారిగా అడ్డుకట్ట వేసిన ప్రేమోన్మాది తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పలుమార్లు పొడిచాడు.  

కత్తి దాడిలో యువతికి  పలుచోట్ల తీవ్ర గాయాలు కాగా, తీవ్ర రక్తస్రావం అయింది. యువతిపై కత్తి దాడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ హత్య జడ్చర్లలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మరోవైపు, యువతిపై కత్తితో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించిన ఆ ప్రేమోన్మాదిని స్థానికులు పట్టుకున్నారు. నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: Vikarabad Crime News: తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!

కానిస్టేబుల్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో ప్రత్యేక కోర్టు!
హైదరాబాద్: రక్షణ కల్పించాల్సిన ఒక పోలీసు కానిస్టేబుల్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. బోయిన్‌పల్లి సీఐ తిరుపతిరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ మధ్య మండలంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన వరదరాజ్‌ సుదేశ్‌ (39) అనే వ్యక్తి, 2020 లో తాడ్‌బండ్‌ ప్రాంతానికి చెందిన ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో, బోయిన్‌పల్లి పోలీసులు సదరు కానిస్టేబుల్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సైఫాబాద్‌లోని హాకా భవన్‌లో ఉన్న పోక్సో ప్రత్యేక కోర్టు శుక్రవారం నాడు తుది తీర్పు వెలువరించింది. కానిస్టేబుల్ సుదేశ్ చేసిన నేరం పక్కా ఆధారాలతో రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి 31 సంవత్సరాల కఠిన జైలు శిక్షను ఖరారు చేశారు. జైలు శిక్షతో పాటు నిందితుడికి రూ. 12 వేల జరిమానా కూడా విధించారు. అంతేకాకుండా, బాధితురాలైన బాలికకు రూ. 1 లక్ష పరిహారంగా చెల్లించాలంటూ న్యాయస్థానం నిందితుడిని ఆదేశించింది.

Also Read: Nepali Gang Arrest In Robbery Case: జవహర్‌నగర్‌ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నేపాల్ బార్డర్‌లో దంపతులు అరెస్ట్

Frequently Asked Questions

జడ్చర్లలో యువతి హత్యకు కారణం ఏమిటి?

ప్రేమను నిరాకరించిందనే కక్షతో ఒక ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. యువతిని నిందితుడు గతంలో ప్రేమ పేరుతో వేధించినట్లు తెలుస్తోంది.

యువతిపై దాడి తరువాత ఏం జరిగింది?

స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడిని స్థానికులు పట్టుకుని చితకబాదారు, తరువాత పోలీసులకు అప్పగించారు.

పోక్సో కేసులో కానిస్టేబుల్​కు ఎంత శిక్ష పడింది?

ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కానిస్టేబుల్​కు 31 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించారు. రూ. 12 వేల జరిమానాతో పాటు, బాధితురాలికి రూ. 1 లక్ష పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Hyderabad Jewellery Shop Fined 10 Lakh: లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget