Viral Video: రాయ్పూర్ పెట్రోల్ బంక్లో అగ్నిప్రమాదం: సిగరెట్ కోసం ఘోరం, క్షణాల్లో మంటలు.. ఏం జరిగిందంటే?
Raipur News: రాయ్పూర్లోని ఉర్లా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పెట్రోల్ పంప్ వద్ద ఘోరం జరిగింది. ఆకతాయి పనికి బంకులో మంటలు చెలరేగాయి.

Raipur News: ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లాలోని బిర్గావ్ ప్రాంతంలోని ఉర్లా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పెట్రోల్ పంప్ వద్ద మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఇద్దరు యువకులు తమ బైక్కు ఇంధనం నింపుకోవడానికి పెట్రోల్ పంప్కు వచ్చారు. వారిలో ఒకరు పంపు వద్ద నిలబడి సిగరెట్ తాగడానికి ప్రయత్నించారు. పంపు వద్ద నిలబడి ధూమపానం చేయడం ప్రమాదకరమని భావించి మరొక వ్యక్తి అతన్ని పక్కకు వెళ్లిపోమని చెప్పాడు.
సిగరెట్ వెలిగించవద్దని చెప్పినందుకు కోపంతో ఆ యువకుడు చేసిన పనికి క్షణాల్లో బంకులో మంటలు అంటుకున్నాయి. కోపంతో ఆ యువకుడు తన స్నేహితుడి బైక్ ట్యాంకులో లైటర్ పడేశారు. దీనితో మంటలు వ్యాపించాయి. బైక్, పెట్రోల్ పంప్ మెషిన్ మంటల్లో కాలిపోయాయి. బైక్ పై ఉన్న మరో ప్రయాణికుడు ఏదో విధంగా తప్పించుకోగలిగాడు. పెట్రల్ పంపు పడేసిన సిబ్బంది అక్కడి నుంచి పరుగెత్తాడు. అలా పడేసే క్రమంలో పంపు నుంచి వచ్చిన పెట్రోల్ నిందితుడిపై పడ్డాయి. అతనికి కూడా మంటలు అంటుకున్నాయి.
Man lights fire at petrol pump in Raipur. Staff rush to stop disaster...
— contentkikamii (@contentkikamii) February 20, 2026
🚨 CCTV footage shows a man setting fire near a petrol pump nozzle at Sangeeta Fuels, Raipur, Chhattisgarh. Staff acted fast to prevent disaster. Both accused arrested. pic.twitter.com/3r6ey6uFtU
పంపు సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు
ఇంతలో, పంపులోని ఒక ఉద్యోగి వెంటనే పరిస్థితిని గమనించి అప్రమత్తమయ్యాడు. పంప్లో ఉండే పెట్రోల్ సప్లై ఆపేశాడు. మంటలను ఆపే సామగ్రి కోసం పరుగెత్తాడు. ఎక్స్టింగ్విషర్ను ఉపయోగించి మంటలను ఆర్పాడు. ఉద్యోగుల సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగారు. మంటలు చెలరేగడంతో పెట్రోల్ కొట్టించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ బంకు సిబ్బంది వారిని పట్టుకున్నారు. ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది.
ఉర్ల పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, పంప్ ఉద్యోగుల సమాచారం ఆధారంగా ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. నిందితుడు వెలిగి ఉన్న లైటర్తో బైక్ ఇంధన ట్యాంక్కు నిప్పంటించాడు. బైక్ రిజిస్ట్రేషన్ వివరాలు, డిజిటల్ ఆధారాలను ఉపయోగించి, పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు
నిందితులిద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో పెట్రోల్ పంప్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం,చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ముప్పు తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఉర్ల పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.























