అన్వేషించండి

Telangana News: తెలంగాణలో దారుణాలు - మానసిక స్థితి సరిగా లేని కూతురి హత్య, తాగునీటి కోసం మామను చంపేసిన కోడలు

Telangana Crime News: రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల దారుణాలు వెలుగుచూశాయి. సిరిసిల్లలో మానసిక స్థితి సరిగ్గా లేని కూతురిని తల్లిదండ్రులు హతమార్చగా.. హన్మకొండలో నీటి కోసం కోడలు మామను చంపేసింది.

Parents Killed Their Daughter In Siricilla: తమ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మానసిక స్థితి సరిగా లేని ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కూతురి ఆరోగ్యం కుదుటపడాలని ఆస్పత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగారు. అయినా, వారి ఆశ నెరవేరలేదు. చివరకు విసిగిపోయి తమ బిడ్డను వారే నూలు దారం గొంతుకు బిగించి హతమార్చారు. 13 నెలల మనవడికి కన్నతల్లిని దూరం చేశారు. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెల్ల గ్రామానికి చెందిన చెప్యాల నర్సయ్య - ఎల్లవ్వ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక (25) గత ఏడేళ్లుగా మానసిక వ్యాధితో బాధ పడుతోంది. ఆమెకు నయం కావడానికి ఆస్పత్రులు, దేవాలయాలకు తీసుకెళ్తూ చాలా డబ్బులు ఖర్చు చేశారు. కొంతవరకూ వ్యాధి నయం కాగా.. 2020లో సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని దర్గాపల్లికి చెందిన పృథ్వీతో పెళ్లి చేశారు. ఈ దంపతులు కరీంనగర్ లోని సప్తగిరి కాలనీలో  నివాసం ఉంటుండగా వీరికి 13 నెలల కుమారుడు ఉన్నాడు.

చేతబడి జరిగిందని..

అయితే, గత నెల రోజులుగా ప్రియాంక ముందులాగే మానసిక వ్యాధితో బాధ పడుతూ అందరినీ ఇబ్బంది పెడుతోంది. చుట్టుపక్కల వారిని దూషించడం, గొడవలు పెట్టుకోగా.. భర్త ఆమె తల్లిదండ్రులకు విషయం తెలిపాడు. వారు బుగ్గరాజేశ్వర స్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ 3 రోజులు ఉంచారు. ఇంకా నయం కాకపోవడంతో పాటు కూతురి ప్రవర్తన చూసి తల్లిదండ్రులు విసిగిపోయారు. తిరిగి నేరెల్లకు తీసుకొచ్చి ఈ నెల 14న రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నూలు దారం గొంతుకు బిగించి హతమార్చారు. తర్వాత రోజు అత్తవారి గ్రామమైన దర్గాపల్లికి తీసుకెళ్లి చేతబడి వల్ల మరణించిందని చెప్ప నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, దీనిపై గ్రామస్థులకు అనుమానం రావడంతో డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా తల్లిదండ్రులే హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు నుంచి ఫిర్యాదు తీసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

తాగునీటి కోసం మామ హత్య

అటు, తాగునీటి కోసం మామనే హత్య చేసింది ఓ కోడలు. ఈ ఘటన హన్మకొండ (Hanmakonda) జిల్లాలో జరిగింది. హనుమకొండ - హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన జల్లి సారయ్య (80) కుమారులు ఇద్దరు చనిపోవడంతో తన భార్యతో కలిసి పెద్దకోడలు రమాదేవి ఒకే ఇంట్లోని వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. అయితే, వీరి ఇంటికి ఒకటే నల్లా కనెక్షన్ ఉండడంతో నీళ్లు వచ్చినప్పుడల్లా గొడవలు జరిగేవి. ఆదివారం కూడా నల్లా విషయంలో ఘర్షణ జరగ్గా.. పెద్దకోడలు రమాదేవి తన ఇద్దరు కొడుకులతో కలిసి సారయ్యపై దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి స్పాట్ లోనే మృతి చెందాడు.

Also Read: MP Rammohan Naidu: భయపడొద్దు, అండగా ఉంటాం, అన్నీ చూసుకుంటాం: టీడీపీ ఎంపీ భరోసా

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bengaluru: ఫ్రెండ్స్‌తో సామూహిక శృంగారానికి ఒత్తిడి - భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త - కొందరి కష్టాలంతే!
ఫ్రెండ్స్‌తో సామూహిక శృంగారానికి ఒత్తిడి - భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త - కొందరి కష్టాలంతే!
Bengaluru Siddipet Couple: భర్త ఉరి వేసుకున్నాడని తెలిసి భార్య 17వ అంతస్తు నుంచి దూకేసింది - బెంగళూరులో సిద్ధిపేట దంపతుల విషాదం
భర్త ఉరి వేసుకున్నాడని తెలిసి భార్య 17వ అంతస్తు నుంచి దూకేసింది - బెంగళూరులో సిద్ధిపేట దంపతుల విషాదం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Rajya Sabha YSRCP: బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Perni Kittu: పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
Nara Lokesh in Delhi: అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
Bhumana Karunakar Reddy : భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
Ranabaali Leaks : రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
Embed widget