అన్వేషించండి

Telangana News: తెలంగాణలో దారుణాలు - మానసిక స్థితి సరిగా లేని కూతురి హత్య, తాగునీటి కోసం మామను చంపేసిన కోడలు

Telangana Crime News: రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల దారుణాలు వెలుగుచూశాయి. సిరిసిల్లలో మానసిక స్థితి సరిగ్గా లేని కూతురిని తల్లిదండ్రులు హతమార్చగా.. హన్మకొండలో నీటి కోసం కోడలు మామను చంపేసింది.

Parents Killed Their Daughter In Siricilla: తమ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మానసిక స్థితి సరిగా లేని ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కూతురి ఆరోగ్యం కుదుటపడాలని ఆస్పత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగారు. అయినా, వారి ఆశ నెరవేరలేదు. చివరకు విసిగిపోయి తమ బిడ్డను వారే నూలు దారం గొంతుకు బిగించి హతమార్చారు. 13 నెలల మనవడికి కన్నతల్లిని దూరం చేశారు. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెల్ల గ్రామానికి చెందిన చెప్యాల నర్సయ్య - ఎల్లవ్వ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక (25) గత ఏడేళ్లుగా మానసిక వ్యాధితో బాధ పడుతోంది. ఆమెకు నయం కావడానికి ఆస్పత్రులు, దేవాలయాలకు తీసుకెళ్తూ చాలా డబ్బులు ఖర్చు చేశారు. కొంతవరకూ వ్యాధి నయం కాగా.. 2020లో సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని దర్గాపల్లికి చెందిన పృథ్వీతో పెళ్లి చేశారు. ఈ దంపతులు కరీంనగర్ లోని సప్తగిరి కాలనీలో  నివాసం ఉంటుండగా వీరికి 13 నెలల కుమారుడు ఉన్నాడు.

చేతబడి జరిగిందని..

అయితే, గత నెల రోజులుగా ప్రియాంక ముందులాగే మానసిక వ్యాధితో బాధ పడుతూ అందరినీ ఇబ్బంది పెడుతోంది. చుట్టుపక్కల వారిని దూషించడం, గొడవలు పెట్టుకోగా.. భర్త ఆమె తల్లిదండ్రులకు విషయం తెలిపాడు. వారు బుగ్గరాజేశ్వర స్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ 3 రోజులు ఉంచారు. ఇంకా నయం కాకపోవడంతో పాటు కూతురి ప్రవర్తన చూసి తల్లిదండ్రులు విసిగిపోయారు. తిరిగి నేరెల్లకు తీసుకొచ్చి ఈ నెల 14న రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నూలు దారం గొంతుకు బిగించి హతమార్చారు. తర్వాత రోజు అత్తవారి గ్రామమైన దర్గాపల్లికి తీసుకెళ్లి చేతబడి వల్ల మరణించిందని చెప్ప నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, దీనిపై గ్రామస్థులకు అనుమానం రావడంతో డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా తల్లిదండ్రులే హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు నుంచి ఫిర్యాదు తీసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

తాగునీటి కోసం మామ హత్య

అటు, తాగునీటి కోసం మామనే హత్య చేసింది ఓ కోడలు. ఈ ఘటన హన్మకొండ (Hanmakonda) జిల్లాలో జరిగింది. హనుమకొండ - హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన జల్లి సారయ్య (80) కుమారులు ఇద్దరు చనిపోవడంతో తన భార్యతో కలిసి పెద్దకోడలు రమాదేవి ఒకే ఇంట్లోని వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. అయితే, వీరి ఇంటికి ఒకటే నల్లా కనెక్షన్ ఉండడంతో నీళ్లు వచ్చినప్పుడల్లా గొడవలు జరిగేవి. ఆదివారం కూడా నల్లా విషయంలో ఘర్షణ జరగ్గా.. పెద్దకోడలు రమాదేవి తన ఇద్దరు కొడుకులతో కలిసి సారయ్యపై దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి స్పాట్ లోనే మృతి చెందాడు.

Also Read: MP Rammohan Naidu: భయపడొద్దు, అండగా ఉంటాం, అన్నీ చూసుకుంటాం: టీడీపీ ఎంపీ భరోసా

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Instagram Reel: రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget