అన్వేషించండి

Telangana News: తెలంగాణలో దారుణాలు - మానసిక స్థితి సరిగా లేని కూతురి హత్య, తాగునీటి కోసం మామను చంపేసిన కోడలు

Telangana Crime News: రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల దారుణాలు వెలుగుచూశాయి. సిరిసిల్లలో మానసిక స్థితి సరిగ్గా లేని కూతురిని తల్లిదండ్రులు హతమార్చగా.. హన్మకొండలో నీటి కోసం కోడలు మామను చంపేసింది.

Parents Killed Their Daughter In Siricilla: తమ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మానసిక స్థితి సరిగా లేని ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కూతురి ఆరోగ్యం కుదుటపడాలని ఆస్పత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగారు. అయినా, వారి ఆశ నెరవేరలేదు. చివరకు విసిగిపోయి తమ బిడ్డను వారే నూలు దారం గొంతుకు బిగించి హతమార్చారు. 13 నెలల మనవడికి కన్నతల్లిని దూరం చేశారు. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెల్ల గ్రామానికి చెందిన చెప్యాల నర్సయ్య - ఎల్లవ్వ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంక (25) గత ఏడేళ్లుగా మానసిక వ్యాధితో బాధ పడుతోంది. ఆమెకు నయం కావడానికి ఆస్పత్రులు, దేవాలయాలకు తీసుకెళ్తూ చాలా డబ్బులు ఖర్చు చేశారు. కొంతవరకూ వ్యాధి నయం కాగా.. 2020లో సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని దర్గాపల్లికి చెందిన పృథ్వీతో పెళ్లి చేశారు. ఈ దంపతులు కరీంనగర్ లోని సప్తగిరి కాలనీలో  నివాసం ఉంటుండగా వీరికి 13 నెలల కుమారుడు ఉన్నాడు.

చేతబడి జరిగిందని..

అయితే, గత నెల రోజులుగా ప్రియాంక ముందులాగే మానసిక వ్యాధితో బాధ పడుతూ అందరినీ ఇబ్బంది పెడుతోంది. చుట్టుపక్కల వారిని దూషించడం, గొడవలు పెట్టుకోగా.. భర్త ఆమె తల్లిదండ్రులకు విషయం తెలిపాడు. వారు బుగ్గరాజేశ్వర స్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ 3 రోజులు ఉంచారు. ఇంకా నయం కాకపోవడంతో పాటు కూతురి ప్రవర్తన చూసి తల్లిదండ్రులు విసిగిపోయారు. తిరిగి నేరెల్లకు తీసుకొచ్చి ఈ నెల 14న రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నూలు దారం గొంతుకు బిగించి హతమార్చారు. తర్వాత రోజు అత్తవారి గ్రామమైన దర్గాపల్లికి తీసుకెళ్లి చేతబడి వల్ల మరణించిందని చెప్ప నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, దీనిపై గ్రామస్థులకు అనుమానం రావడంతో డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా తల్లిదండ్రులే హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు నుంచి ఫిర్యాదు తీసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

తాగునీటి కోసం మామ హత్య

అటు, తాగునీటి కోసం మామనే హత్య చేసింది ఓ కోడలు. ఈ ఘటన హన్మకొండ (Hanmakonda) జిల్లాలో జరిగింది. హనుమకొండ - హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన జల్లి సారయ్య (80) కుమారులు ఇద్దరు చనిపోవడంతో తన భార్యతో కలిసి పెద్దకోడలు రమాదేవి ఒకే ఇంట్లోని వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. అయితే, వీరి ఇంటికి ఒకటే నల్లా కనెక్షన్ ఉండడంతో నీళ్లు వచ్చినప్పుడల్లా గొడవలు జరిగేవి. ఆదివారం కూడా నల్లా విషయంలో ఘర్షణ జరగ్గా.. పెద్దకోడలు రమాదేవి తన ఇద్దరు కొడుకులతో కలిసి సారయ్యపై దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి స్పాట్ లోనే మృతి చెందాడు.

Also Read: MP Rammohan Naidu: భయపడొద్దు, అండగా ఉంటాం, అన్నీ చూసుకుంటాం: టీడీపీ ఎంపీ భరోసా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification: ఏపీ డీఎస్సీ ప్రకటన రద్దు, రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
AP DSC Notification: ఏపీ డీఎస్సీ ప్రకటన రద్దు, రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
CM Chandrababu: 'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification: ఏపీ డీఎస్సీ ప్రకటన రద్దు, రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
AP DSC Notification: ఏపీ డీఎస్సీ ప్రకటన రద్దు, రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
CM Chandrababu: 'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
IAS Karthikeya Mishra: సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా - సీఎస్ ఉత్తర్వులు
సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా - సీఎస్ ఉత్తర్వులు
Axar Patel: శ్రీలంకకు ఆ జయసూర్య, భారత్‌కు ఈ జయసూర్య - అక్షర్ పటేల్‌‌పై ప్రశంసలు
శ్రీలంకకు ఆ జయసూర్య, భారత్‌కు ఈ జయసూర్య - అక్షర్ పటేల్‌‌పై ప్రశంసలు
Mann Ki Baat: అరకు కాఫీ అద్భుతం, రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది - మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రశంసలు
అరకు కాఫీ అద్భుతం, రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది - మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రశంసలు
Embed widget