అన్వేషించండి

Mobile Phone Death: గొడవలో ఫోన్ విసిరేసిన భార్య - తలకు దెబ్బతరిగి భర్త మృతి - ఇలాంటివి కూడా జరుగుతాయి!

Mobile Phone Head Injury Death: ఒడిశాలోని బోలాంగిర్ జిల్లాలో ఘోర విషాదం. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో, భార్య మొబైల్ ఫోన్‌తో తలపై కొట్టడంతో స్వప్నేశ్వర్ మిశ్రా అనే యువకుడు మృతి చెందాడు.

Domestic Violence Odisha Husband Dies: ఓ చిన్నపాటి కుటుంబ కలహం ఎంతటి ఘోర విషాదానికి దారితీస్తుందో చెప్పడానికి ఒడిశాలో జరిగిన ఈ ఘటనే సజీవ సాక్ష్యం. నిత్యం మనం చేతిలో పట్టుకునే మొబైల్ ఫోన్.. ఒకరి ప్రాణాలను బలితీసుకుంటుందని ఎవరూ ఊహించలేరు. ఒడిశాలోని బోలాంగిర్ జిల్లాలో భార్యాభర్తల మధ్య జరిగిన ఓ చిన్న గొడవ చినికి చినికి గాలివానగా మారింది. తీవ్ర కోపోద్రిక్తురాలైన భార్య, భర్త తలపై మొబైల్ ఫోన్‌తో బలంగా కొట్టడంతో అతను మరణించిన ఈ విచిత్ర, విషాద ఉదంతం వైరల్‌గా మారింది. 

బోలాంగిర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిమ్నిభటి పాడ ప్రాంతానికి చెందిన స్వప్నేశ్వర్ మిశ్రా అనే యువకుడికి, అతని భార్యకు మధ్య వీకెండ్‌లో ఒక్కసారిగా పెద్ద గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వివాదం కాస్తా భౌతిక దాడికి దారితీసింది. ఆ సమయంలో తీవ్రమైన ఆగ్రహానికి లోనైన భార్య.. చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను తీసుకుని భర్త తలపై అత్యంత బలంగా బాదింది. మొబైల్ ఫోన్ గట్టిగా తగలడంతో స్వప్నేశ్వర్ తలకు తీవ్ర గాయమై, రక్తం కారడం ప్రారంభమైంది. 

గాయం తీవ్రతను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని బోలాంగిర్‌లోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి  తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చేరిన స్వప్నేశ్వర్‌కు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. కొంత సమయం పాటు వైద్యుల పరిశీలనలో ఉంచిన తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, ప్రాణాపాయం తప్పిందని భావించిన ఆసుపత్రి సిబ్బంది, అదే రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. దాంతో కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.                        

కానీ, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే స్వప్నేశ్వర్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. తీవ్ర శ్వాసకోస ఇబ్బంది, నొప్పితో అతను స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. కంగారుపడిన బంధువులు సమయం వృథా చేయకుండా మళ్లీ అదే జిల్లా ఆసుపత్రికి పరుగు తీశారు. అయితే ఈసారి వైద్యులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అంతర్గత గాయాల కారణంగా పరిస్థితి విషమించి స్వప్నేశ్వర్ శనివారం ఆసుపత్రిలోనే కన్నుమూశాడు.                    

భర్త మరణవార్త తెలుసుకున్న బోలాంగిర్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. నిందితురాలైన భార్యపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు వీలుగా కుటుంబ సభ్యులను, పొరుగువారిని విచారిస్తున్నారు. స్వప్నేశ్వర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మొబైల్ ఫోన్ దెబ్బ కారణంగానే తలలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందా లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల మరణించాడా అనేది పోస్ట్‌మార్టం నివేదికలో తేలనుందని, ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు  చెబుతున్నారు.                       

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
క్యాష్ విత్‌డ్రా చేసిన నిమిషాల్లో కొట్టేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠా ప్రధాన నిందితుడు అరెస్ట్
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Jogi Ramesh Latest News:వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
వైసీపీ లీడర్‌, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కోడలు పెట్టిన కేసు ఏంటీ? ఏ సెక్షన్ ఏం చెబుతుంది?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget