పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అభివృద్ధి పనుల బిల్లుల క్లియరెన్స్ కోసం ఆయన లంచం డిమాండ్ చేశారు.
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీష్ అభివృద్ధి పనుల బిల్లుల కోసం కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.

- పెద్దపల్లిలో మున్సిపల్ ఏఈ సతీష్ 2 లక్షల లంచం తీసుకుంటూ దొరికారు.
- హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఆస్తులపై ఏసీబీ విస్తృత సోదాలు.
- ఆదాయానికి మించిన ఆస్తులు ఆరోపణలతో బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన మెరుపు దాడిలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. పెద్దపల్లి పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ఎంబీ (Measurement Book) రికార్డు నమోదు చేసి, బిల్లులు క్లియర్ చేయడానికి ఏఈ సతీష్ ఆ కాంట్రాక్టర్ను భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అధికారి లంచం అడగడంతో బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం పక్కా ప్రణాళికతో వల పన్నింది. కాంట్రాక్టర్ నుంచి ఏఈ సతీష్ లంచం నగదు తీసుకుంటుండగా అధికారులు అప్రమత్తమై రెడ్ హ్యాండెడ్గా అతనిని పట్టుకున్నారు. ప్రస్తుతం మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతుండగా, ఏఈని అదుపులోకి తీసుకుని నిధుల దుర్వినియోగం, అవినీతి అక్రమాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.

HMDA చీఫ్ ఇంజనీర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ నివాసాల్లో ఆకస్మిక సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగాయి. నగరంలోని మైత్రివనంలో గల హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంతో పాటు, గచ్చిబౌలిలోని సుమధుర టవర్స్లో ఉన్న రవీందర్ నివాసంలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
రవీందర్ అక్రమాస్తులపై 15 టీమ్స్ తనిఖీలు
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు మొత్తం 15 ప్రత్యేక బృందాలుగా విడిపోయి, రవీందర్ ఇల్లే కాకుండా ఆయన ముఖ్య స్నేహితులు, సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో భారీగా విలువైన స్థిరాస్తులు, చరాస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని, సోదాలు పూర్తిగా ముగిసిన తర్వాతే ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తుల పూర్తి విలువ వెల్లడవుతుందని ఏసీబీ వర్గాలు తెలిపాయి.
Frequently Asked Questions
పెద్దపల్లిలో ఏ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు?
పెద్దపల్లి అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ దేని కోసం లంచం డిమాండ్ చేశారు?
పెద్దపల్లి పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఎంబీ రికార్డు నమోదు చేసి, బిల్లులు క్లియర్ చేయడానికి సతీష్ లంచం డిమాండ్ చేశారు. ఒక కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ పట్టుకుంది.
హెచ్ఎండీఏలో ఏ అధికారి నివాసాలపై ఏసీబీ సోదాలు నిర్వహించింది?
మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ నివాసాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు వచ్చాయి.
హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్పై ఏ ఆరోపణలు ఉన్నాయి?
రవీందర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన కార్యాలయంతో పాటు, నివాసం, బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు జరిపారు.
ట్రెండింగ్ వార్తలు























