అన్వేషించండి

Nizamabad News : కోతులు వెంటబడడంతో చెరువులో దూకిన నలుగురు చిన్నారులు, ఇద్దరు మృతి!

Nizamabad News : నిజామాబాద్ మాక్లూర్ మండలం మామిడి పల్లిలో విషాదం నెలకొంది. కోతులు వెంటబడటంతో నలుగురు చిన్నారులు పరుగులు పెట్టి భయంతో చెరువులో దూకారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

Nizamabad News : పండగ పూట ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. దసరా సెలవుల్లో సరదా ఆడుకుంటుంటే కోతులకు భయపడి చిన్నారులు ప్రాణం మీదికి తెచ్చుకున్నారు. సరదాగా నలుగురు స్నేహితులు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కోతుల గుంపు రావటంతో భయపడిన చిన్నారులు పరుగులు తీశారు. వారిని కోతులు వెంబడించాయి.  

కోతులు వెంటబడడంతో 

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడి పల్లిలో నలుగురు చిన్నారుల విషాదం తీవ్రoగా కలిచివేసింది. గ్రామంలో పండగ పూట విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా ఆడుకుంటుండగా కోతులు రావటంతో చిన్నారులు భయపడ్డారు.  కోతుల భయంతో నలుగురు పరుగులు తీశారు. ఊరు చివరన ఉన్న చెరువులో నలుగురు చిన్నారులు దుకేశారు. నలుగురిలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. గమనించిన గ్రామస్తులు ఇద్దరిని కాపాడారు. మరో ఇద్దరిని కాపాడే సమయానికి అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

చిలకలూరిపేటలో విషాదం 

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని ఓగేరు వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.  చిలకలూరిపేట పట్టణంలోని బొబ్బాల సత్యనారాయణ వీధికి చెందిన రమేష్ , స్రవంతిల కుమారుడు నూతలపాటి కార్తీక్ (14),  దాసరి బజారుకు చెందిన బాజిబాబు కుమారుడు పి. మోహనసాయి అనీష్(13)లు స్నేహితులు. నూతలపాటి కార్తీక్ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మోహన సాయి అనీష్(13)  మరో ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి  చదువుతున్నారు. వీరు సోమవారం క్రికెట్ ఆడుకోడానికి బయటకువెళ్లారు. అనంతరం అక్కడకు సమీపంలోని ఓగేరువాగులో ఈతకు దిగారు. పట్టుతప్పి వాగులో కొట్టుకుపోతుండగా విద్యార్థుల కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకొని వాగులో నుంచి వారిని బయటకు తీసుకువచ్చారు. వారిద్దరనీ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

మూడు నెలలైనా దొరకని బ్యాంకు దొంగల జాడ, 8 కేజీల బంగారం తిరిగివ్వాలని బాధితులు ధర్నా  

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి 

వరంగల్‌ జిల్లాలోని ఉర్సుగుట్ట దగ్గర విషాదం జరిగింది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.  

Also Read : Crime News : రియల్ ఆవేశం స్టార్ - పోలీసులు ఆపారని బైక్ కాల్చేసుకున్నాడు.. కేసుల పాలయ్యాడు !

Also Read : 70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ? విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget