By: ABP Desam | Updated at : 28 Sep 2021 08:40 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
నెల్లూరు జిల్లాలో బహిరంగంగా జరుగుతున్న వ్యభిచార దందా గుట్టు రట్టయింది. రాత్రి వేళ ఆరుబయట జరుగుతున్న అసాంఘిక లైంగిక కార్యకలాపాలను స్థానికులు గుర్తించారు. అటుగా వెళ్తున్న వాహనదారులు అప్రమత్తమై చొరవ చూపడంతో ఈ వ్యభిచార ముఠా బయటపడింది. నెల్లూరు మండలంలోని పుంజులూరుపాడు రైల్వే గేటు సమీపంలో ఈ అసాంఘిక కార్యకలాపాలు చాలా కాలంగా సాగుతున్నట్లుగా స్థానికులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. తాజాగా స్థానికులు చొరవ చూపడంతో గుట్టంతా బయటపడింది.
Also Read: బలహీనపడ్డ గులాబ్.. తెలంగాణ, ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక్కడ అతిభారీగా..
స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నెల్లూరు మండలంలోని పుంజులూరుపాడు రైల్వే గేటు సమీపంలో కృష్ణపట్నం పోర్టు రోడ్డుకు ఆనుకున్న ప్రాంతంలో ఆదివారం రాత్రి 10.30 సమయంలో ఈ సంఘటన జరిగింది. పుంజులూరుపాడు వైపు వెళ్తున్న వాహన దారులకు రోడ్డు పక్క నుంచి మహిళలు కేకలు పెద్దగా వినిపించాయని సాక్షులు వెల్లడించారు. దాంతో వారు వాహనాలను పక్కనే ఆపి.. రోడ్డు నుంచి కాస్త దూరం వెళ్లి గమనించగా.. అక్కడ పదుల సంఖ్యలో లారీలను నిలిపి ఉన్నారు.
Also Read: e-Shram Card: మీ జీతం 15 వేల కంటే తక్కువా? మీకో శుభవార్త.. ఈ ఒక్క పని ఫ్రీగా చేస్తే ఎన్నో లాభాలు
వాటిని కూడా దాటుకొని కాస్త ముందుకు వెళ్లగా.. అక్కడ వారికి ముగ్గురు మహిళలు, సుమారు 20 మంది వరకూ పురుషులు కనిపించారు. ఆ మహిళలతో పురుషులు బలవంతంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం చూశారు. దీంతో వెంటనే స్థానికులు వెంకటాచలం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తక్షణం స్పందించి అక్కడకు చేరుకొని, అసాంఘిక కార్యకలాపాల నిర్వహకులను పట్టుకొనేందుకు ప్రయత్నించగా.. అప్పటికే నిర్వహకులు విటులు అక్కడి నుంచి పరారయ్యారు.
Also Read: చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మరింత పెరుగుదల
ఇద్దరు మహిళలను పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. నిర్వహకుడిది వెంకటాచలం పంచాయతీ పరిధిలోని వడ్డిపాళెం అని తేలింది. అతను కొన్ని నెలలుగా బయట ప్రాంతాల నుంచి మహిళలను తీసుకుని వచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై నెల్లూరు రూరల్ సీఐ జగన్మోహన్ రావును వివరణ కోరగా పోర్టు రోడ్డులో కొద్ది రోజులుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ పనులకు సూత్రదారి అయిన వ్యక్తి నిర్వహకుడు పరారీలో ఉన్నాడని, అతణ్ని పట్టుకొని విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
Jammu Tunnel Collapse: సొరంగం కూలిన ప్రమాదంలో 10కి చేరిన మృతుల సంఖ్య, పూర్తయిన రెస్క్యూ ఆపరేషన్
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్బాడీ అప్పగింత
Bhadrachalam ఎక్సైజ్ పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన కారు - పోలీసుల ఛేజింగ్తో చివరకు ఊహించని ట్విస్ట్
Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్పై కేసీఆర్ ప్రశంసల జల్లు !