Nalgonda: మైసమ్మ గుడి ముందు మనిషి తల కలకలం.. హడలిపోయిన స్థానికులు, మొండెం కోసం గాలింపు
స్థానిక మైసమ్మ గుడి వద్ద కనిపించిన ఈ సన్నివేశాన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు. అక్కడ గుర్తుతెలియని వ్యక్తి తల మొండెం నుంచి వేరు చేసి ఉంది.
నల్గొండ జిల్లాలో దారుణమైన, కిరాతకమైన హత్య జరిగింది. జిల్లాలోని చింతపల్లి మండలం విరాట్ నగర్ కాలనీలో వ్యక్తిని దుండగులు హత్య చేశారు. అయితే, ఆ వ్యక్తి తల భాగం వేరు చేసి మరీ హత్య చేయడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. స్థానిక మైసమ్మ గుడి వద్ద కనిపించిన ఈ సన్నివేశాన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా హడలిపోయారు. అక్కడ గుర్తుతెలియని వ్యక్తి తల మొండెం నుంచి వేరు చేసి ఉంది. ఆ తల భాగాన్ని దుండగులు గుడి ఎదుట వదిలి వెళ్లారు. వెంటనే స్థానికులు ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొండెం, ఇతర శరీర భాగాల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
మైసమ్మ గుడి ముందు మెడలో బొమ్మ తలల దండతో ఉన్న పోతురాజు విగ్రహం కాళ్ల వద్ద మనిషి శరీరం నుంచి వేరు చేసిన తలను వదిలి వెళ్లారు. అయితే, ఇది నర బలా? లేక హత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Nellore Crime: పెళ్లైందని తెలిసీ ప్రేమించాడు.. జిల్లాలు దాటి వెళ్లిన యువకుడి కథ విషాదాంతం
Also Read: Fake News: నకిలీ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయనం
Also Read: Gold-Silver Price: నేడు అతి స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి మాత్రం నిలకడగా.. ఇవాల్టి ధరలు ఇలా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets