అన్వేషించండి

Job Fraud in Adilabad: ఉద్యోగాల పేరుతో మోసం.. ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు అరెస్ట్.. ఐదుగురిపై కేసు నమోదు

Adilabad News Job Fraud | ఉద్యోగాల కోసం చూస్తున్న యువతను మోసం చేసిన గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

నిరుద్యోగ యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేసిన కేసును ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు ఛేదించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జెట్టబోయిన మధు కిరణ్ (45)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

నిందితుడు 2013లో "అనంత ఈ సొల్యూషన్” పేరిట కంపెనీ స్థాపించి, ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేవాడు. 2023లో సుజాత ఠాకూర్, నామిని సతీష్, లావణ్యలతో కలిసి “విద్యాధాన్ ఆర్గనైజర్స్" అనే సొసైటీ రిజిస్టర్ చేసి, కేంద్ర ప్రభుత్వ విద్యాంజలి 2.0 స్కీమ్ డబ్బులు కాజేసేందుకు పథకం వేశాడు. తమకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అబద్ధాలు చెప్పి నిరుద్యోగులను నమ్మబలికించాడు. వారికి వివిధ ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో నకిలీ ఉద్యోగాలు వచ్చేలా చేశారు.


Job Fraud in Adilabad: ఉద్యోగాల పేరుతో మోసం.. ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు అరెస్ట్.. ఐదుగురిపై కేసు నమోదు

A1 జట్టబోయిన మధు కిరణ్, మదాసు సుధాకర్, నిమ్మని సతీష్

ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉమ్మడి వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఏజెంట్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల వరకు వసూలు చేసి, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేవాడు. ఇలా వందల సంఖ్యలో నిరుద్యోగులను మోసం చేశాడు. ఈ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా 240 దాదాపు మంది అభ్యర్థులను మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

వివిధ పాఠశాలలు, కళాశాలలో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లతో ఉద్యోగాలు కల్పించి వారికి మూడు నెలలు వేతనం వీరే ఇచ్చేవారు. ఆ తర్వాత వేతనం అందకపోయేసరికి బాధితులు వివిధ పోలీస్ స్టేషన్ పిర్యాదు చేశారు. దీంతో వీరికి సహకరించి ఏజెంట్లుగా ఉన్న రాహుల్, కోవా విఠల్ (బోథ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్) వరలక్ష్మిపై ఇదివరకే పలు స్టేషన్లలో కేసులు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. శనివారం జట్టబోయిన మధు కిరణ్ (45), మాదాసి సుధాకర్ (48), నమ్మని సతీష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను తరువాత పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరి పాత్ర ఉన్నదనే అంశంపై విచారణ చేస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ప్రజలు ఉద్యోగాల పేరుతో మోసం చేసే ముఠా సభ్యులను, డబ్బులు అడిగే ముఠాలను నమ్మవద్దని, అప్రమత్తతో వ్యవహరించాలని, డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలు రావని కష్టపడి పరీక్షల ద్వారా ఉద్యోగాలను సాధించాలని తెలిపారు. 


Job Fraud in Adilabad: ఉద్యోగాల పేరుతో మోసం.. ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు అరెస్ట్.. ఐదుగురిపై కేసు నమోదు

నిరుద్యోగులను మోసం చేసే వారిపై, నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన 1టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ బి.గోపికృష్ణ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మీడియా సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, 1టౌన్ ఇన్స్పెక్టర్ బి.సునీల్ కుమార్, ఎస్సెలు గోపికృష్ణ, నాగనాథ్, అశోక్ సిబ్బంది త్రిశూల్ తదితరులు పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
Ayesha Meera Last Rites: అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
Advertisement

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Embed widget