అన్వేషించండి

Crime News: ట్రయల్ కోసం కుక్కను చంపి ఉడకబెట్టాడు - భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Hyderabad News: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పీఎస్ పరిధిలో భార్యను చంపి ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు ట్రయల్ కోసం ఓ కుక్కను చంపినట్లు తెలుస్తోంది.

Husband Killed Wife And Cut Into Pieces In Meerpet: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట (Meerpet) పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను చంపి ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తన భార్యను చంపడానికి ముందు నిందితుడు ఓ కుక్కను చంపి ట్రయల్ వేసినట్లుగా తెలుస్తోంది. కుక్కను ముక్కలుగా నరికి ఉడకబెట్టినట్లు సమాచారం. మీర్‌పేట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు ఇంకా అధికారికంగా ఏ వివరాలు వెల్లడించడం లేదు. ఈ విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకట మాధవి (35)కి అదే గ్రామానికి చెందిన పుట్ట గురుమూర్తి (39)తో 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు. గురుమూర్తి ఆర్మీలో పని చేసి రిటైరై ప్రస్తుతం డీఆర్డీవోలో కాంట్రాక్ట్ భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నాడు.

భార్యను ముక్కలుగా నరికాడు

వీరు రంగారెడ్డి జిల్లా (Rangareddy District) బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర్‌నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. భార్యపై అనుమానంతో ఆమెను వేధించేవాడు. ఇటీవల ఇంట్లో పిల్లలు లేని సమయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్యను చంపేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో వేసి ఉడికించాడు. ఎముకలను వేరు చేసి రోట్లో వేసి పొడిగా మార్చాడు. ఎముకల పొడి, శరీరం అవశేషాలను సమీపంలోని జిల్లెలగూడ చెరువులో పడేశాడు. అనంతరం ఏమీ తెలియదన్నట్లుగా తన భార్య కనిపించడం లేదని అత్తకు ఫోన్ చేసి చెప్పాడు. ఎవరికీ అనుమానం రాకుండా అమాయక చక్రవర్తిలా నటించాడు. ఈ క్రమంలో ఈ నెల 18న తమ బిడ్డ మిస్ అయినట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీల ఆధారంగా..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకట మాధవి ఆచూకీ కోసం గాలించారు. ఈ క్రమంలోనే ఆమె ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఆమె ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకు వచ్చిన ఆధారాలు కనిపించలేదు. గురుమూర్తి రాకపోకలు సాగించిన దృశ్యాలు మాత్రం రికార్డయ్యాయి. దీంతో అతన్ని అనుమానంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. భార్యను తానే హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు తొలుత పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు అంగీకరించాని పేర్కొన్నారు. దీంతో మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకుతున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానంతోనే..

భార్యాభర్తల మధ్య అనుమానంతో చాలాసార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. అటు, ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గురుమూర్తి శాడిజం ఇటు కన్నబిడ్డలతో పాటు అటు బంధువులను సైతం నివ్వెరపోయేలా చేసింది. కేవలం అనుమానంతోనే భార్యను చంపాడా.? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా.? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మర్డర్ ఎపిసోడ్‌లో నిందితుడికి ఎవరైనా సహకరించారా.? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

Also Read: Viral News: అండర్‌వేర్‌లో సిగరెట్ లైటర్స్ - శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్ట్ - వాటితో ఏం చేయాలనుకుంది ?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
Telangana News : జనగామ ఎమ్మెల్యేలకు సైబర్ నేరగాళ్ల టోకరా! వికసిత్ భారత్ పథకం పేరుతో లక్షలు స్వాహా!
జనగామ ఎమ్మెల్యేలకు సైబర్ నేరగాళ్ల టోకరా! వికసిత్ భారత్ పథకం పేరుతో లక్షలు స్వాహా!
Vanasthalipuram accident: తాగి రోడ్డెక్కిన వాళ్ల తప్పు - రెండు నిండు జీవితాలు బలి - హస్తీనాపురం ప్రమాదంలో చీకటి కోణాలు
తాగి రోడ్డెక్కిన వాళ్ల తప్పు - రెండు నిండు జీవితాలు బలి - హస్తీనాపురం ప్రమాదంలో చీకటి కోణాలు
Ganja Seized: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
3 States Polling: అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
అసోం, కేరళ, పుదుచ్చేరిలో పోటెత్తిన ఓటర్లు - భారీగా పోలింగ్ నమోదు !
Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
Gold Price: మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
మార్చిలో పడిపోయిన బంగారం ధరలు ఏప్రిల్‌లో పెరుగుతాయా? పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి?
KKR vs LSG Match Update: కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
కేకేఆర్ ఎల్‌ఎస్జీ మ్యాచ్‌లో అలెన్ అవుటా? నాటౌటా? బౌండరీ లైన్ టచ్ అయిన దిగ్వేష్ రాఠీ!
Atchannaidu: వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం ఉందన్న అనుమానాలు - అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు
Jagan Vs Sharmila: జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
జగన్, షర్మిల మధ్య పాదయాత్ర వారసత్వ వార్ - సోషల్ మీడియా వాగ్వాదం వైరల్
Nobel Peace: నోబెల్ అంటే అంత కామెడీ అయిపోయిందా? పాకిస్తాన్ ప్రధానికీ కావాలట.. ట్రంప్‌కు తెలిస్తే!?
నోబెల్ అంటే అంత కామెడీ అయిపోయిందా? పాకిస్తాన్ ప్రధానికీ కావాలట.. ట్రంప్‌కు తెలిస్తే!?
Sharmila: 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
Embed widget