అన్వేషించండి

Delhi Crime: విడాకులివ్వడం లేదని భార్యపై కక్ష గట్టిన భర్త, కిరాయి హంతకులతో దారుణ హత్య

Delhi Crime: ఢిల్లీలో ఓ వ్యక్తి తన భార్యను కిరాయి హంతకులతో చంపించిన ఘటన సంచలనమైంది.

Delhi Crime News:


వెస్ట్ ఢిల్లీలో ఘటన..

భార్యపై కసి పెంచుకున్నాడు. ఎలాగైనా సరే చంపేయాలనుకున్నాడు. తన వల్ల కాదని తెలిసి కిరాయి హంతకులను మాట్లాడుకున్నాడు.  చివరకు పంతం నెగ్గించుకున్నాడు. ఢిల్లీలో జరిగిందీ దారుణం. 35 ఏళ్ల భార్యను 71 ఏళ్ల భర్త దారుణంగా చంపించాడు. వెస్ట్ ఢిల్లీ రాజౌరీ గార్డెన్‌లో ఈ హత్య జరిగింది. వెంటనే స్పాట్‌కి వెళ్లిన పోలీసులు..మహిళ మృతదేహాన్ని గుర్తించారు. శరీరంపై కత్తి పోట్లు ఉన్నట్టు వెల్లడించారు. అయితే..విచారణ చేపట్టిన తరవాత అసలు డొంకంతా కదిలింది. గతేడాది నవంబర్‌లో ఎస్‌కే గుప్తతో ఆమెకు వివాహం అయినట్టు తేలింది. తన కొడుకుని చూసుకుంటుందన్న ఆశతోనే ఆమెను వివాహం చేసుకున్నాడు ఎస్‌కే గుప్త. కొడుకు దివ్యాంగుడు. కద్దలేని పరిస్థితుల్లో సేవలు చేయాల్సి వచ్చింది. కానీ...భార్య మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో గుప్త అసహనానికి గురయ్యాడు. డైవర్స్ కావాలని అడిగాడు. విడాకులివ్వాలంటే కోటి రూపాయల భరణం ఇవ్వాలని భార్య డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌కి ఒప్పుకోని గుప్త..ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని చూశాడు. చంపేయాలని ప్లాన్ చేశాడు. అందుకోసం ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. తన కొడుకుని తరచూ ఆసుపత్రికి తీసుకెళ్లే వ్యక్తితోనే బేరం కుదుర్చుకున్నాడు. రూ.10 లక్షలు ఇస్తానని చెప్పాడు. అడ్వాన్స్‌గా రూ.2.40 లక్షలు ఇచ్చాడు. 

ఇదీ జరిగింది..

పక్కా ప్లాన్ ప్రకారం...నిందితుడు విపిన్‌తో పాటు మరో వ్యక్తి హిమాన్షు గుప్తా ఇంటికి వెళ్లి ఆయన భార్యపై కత్తితో దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచారు. ఈ క్రమంలో నిందితులు కూడా గాయపడ్డారు. పోలీసులను మిస్‌లీడ్ చేయడానికి చోరీ చేసినట్టుగా డ్రామా క్రియేట్ చేశారు. ఇంట్లోని రెండు ఫోన్‌లనూ దొంగిలించారు. చోరీ కేసులా దారి మళ్లించే ప్రయత్నించారు. హత్య జరిగిన సమయంలో గుప్తా కొడుకు అక్కడే ఉన్నాడు. అయితే...ఈ కేసులో ఇతనికీ సంబంధం ఉందని గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నేరాన్ని అంగీకరించారు తండ్రికొడుకులు. ఈ హత్య కోసం వినియోగించిన స్కూటర్‌తో పాటు మొబైల్స్‌ని స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. 

నడిరోడ్డుపై వీరంగం..

ఢిల్లీలో నలుగురు యువకులు కార్ డ్రైవర్‌పై దాడి చేశారు. నడిరోడ్డుపై కార్ ఆపేసి..డ్రైవర్‌పై దాడికి దిగిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ప్రవీణ్ జంగ్రా ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాక..ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కార్ డ్యాష్‌బోర్డ్‌లోని కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. నంగోలి మెట్రో స్టేషన్‌ వద్ద కార్‌ను నలుగురు యువకులు అడ్డగించారు. డిప్పర్ లైట్స్‌ విషయంలో వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ నలుగురు యువకులు కార్‌ ఆపి డ్రైవర్‌పై దాడి చేశారు. ఆ తరవాత బూతులు తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు బాధితుడు ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్యాగ్ చేశాడు. 

"కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై నా కార్ ఆపేశారు. నాపై దాడి చేశారు. నంగోలి మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఢిల్లీలో ఈ తరహా గూండాగిరి చాలా మామూలైపోయింది. ఢిల్లీ పోలీసులు దీనిపై దృష్టి సారించాలి. కచ్చితంగా చర్యలు తీసుకోవాలి"

- బాధితుడు 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aadhaar Forgery: ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!
ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget