అన్వేషించండి

Chittoor Crime : పొలాల వద్ద ఇళ్లే టార్గెట్, చోరీలు చేసి మారుమూల గ్రామాల్లో మకాం!

Chittoor Crime : అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ దొంగను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై ఆంధ్ర, తెలంగాణ,తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో 40కి పైగా కేసులు ఉన్నాయి.

Chittoor Crime : మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.  ఒంటరి ప్రదేశాల్లో‌, పొలాల వద్ద ఇళ్లే  టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడమే అతని హాబీ. దొంగతనాలకు పాల్పడి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎవరికి అనుమానం రాకుండా మారుమూల గ్రామాల్లో తలదాచుకుంటాడు. దోచుకున్న నగదు ఖాళీ కాగానే తిరిగి దొంగతనాలకు పాల్పడి మరో మారుమూల గ్రామానికి వెళ్లేవాడు. ఇలా ఏళ్ల తరబడి నాలుగు రాష్ట్రాల పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని‌ తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు.  అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడమే కాకుండా, భారీ మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు.  

పోలీసుల వివరాలు ఇలా 

చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు.. జిల్లాలో ఇటీవల పంజాణి పోలీసు స్టేషన్ పరిధిలో పొలాల దగ్గర ఉన్న ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును ప్రతిష్టత్మకంగా తీసుకొన్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రెండు నెలల నుంచి ఈ కేసును దక్షిణ భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో తిరిగి నేరస్తులకు సంబంధించి ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగా పలమనేరు పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో పంజాణి మండలం పలమనేరు– మదనపల్లి రోడ్డులోని కళ్లుపల్లి క్రాస్ వద్ద  నిందితుడుని అరెస్టు చేశారు. 

Chittoor Crime : పొలాల వద్ద ఇళ్లే టార్గెట్, చోరీలు చేసి మారుమూల గ్రామాల్లో మకాం!

ఒంటరి ఇల్లే టార్గెట్ 

ఈ కేసులో నిందితుడు తమిళనాడు కళ్ళకురుచి జిల్లా తిమ్మలై గ్రామానికి చెందిన K.మురుగన్ అలియాస్‌ కరుపు మురుగన్ గా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసి నిందితుడి నుంచి సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 ½ kg ల వెండి, మొత్తం రూ.11,50,000 విలువ చేసే క్రైం ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గత రెండు సంవత్సరాల నుంచి దక్షిణ భారతదేశంలోని ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోని పొలాల వద్ద ఒంటరి ఇండ్లు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడేవాడు. భారీ మొత్తాలను దోచుకొని జల్సా చేస్తూ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకొని తిరుగుతున్నట్లు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు.  నిందితుడు నేరం చేసిన ప్రతీసారి ఎక్కడో మారుమూల ప్రదేశాల్లో దాక్కునేవాడు. తన వద్ద డబ్బులు అయిపోయాక మళ్లీ నేరాలకు పాల్పడేవాడని తెలిపారు. ఇతనిపై సుమారు నాలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 40 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అయితే నిందితుడు చిత్తూరు జిల్లాలో రాళ్ళబుదుగురు, బంగారుపాళ్యం, జీడి నెల్లూరు, పలమనేరు, కుప్పం పోలీసు స్టేషన్ పరిధిలో దొంగతనాల కేసులో‌ నిందితుడిగా ఉన్నాడని చెప్పారు.  ముద్దాయిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని  చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు.  నిందితుడుని అరెస్టు చేసిన పోలీసులకు ఎస్పీ అభినందనలు తెలిపారు. చిత్తూరులో దొంగతనాలపై నిఘా పెట్టామన్నారు. బోర్డర్ రాష్ట్రాల నుంచి వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టి పట్టుకునే డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. 

Chittoor Crime : పొలాల వద్ద ఇళ్లే టార్గెట్, చోరీలు చేసి మారుమూల గ్రామాల్లో మకాం!

(నిందితుడు మురుగన్)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
Embed widget