అన్వేషించండి

Nandyal District News: పట్టపగలే అందరూ చూస్తుండగా వేటకొడవళ్లతో దాడి చేసి పరార్!

Nandyal District Crime News: నంద్యాల జిల్లా డోన్‌ మండలంలో ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగించే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం కత్తులు, వేట కొడవళ్లు, మారణాయుధాలతో దాడి చేశారు.

Nandyal District Crime News: నంద్యాల జిల్లా డోన్‌ నియోజకర్గంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే కొందరు కత్తులు, మారణాయుధాలతో రోడ్లపై తిరుగుతున్నారు. ప్రత్యర్థులను హతమార్చేందుకు బహిరంగంగా రోడ్లపైనే తిరుగుతున్నారు. గత ఫిబ్రవరిలో డోన్ నియోజవర్గంలో పట్టపగలే దారుణ హత్య కలకలం రేపింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దుండగులు మారణాయుధాలతో ఓ వ్యక్తిని హతమార్చారు. ఆ ఘటన మరువముందే అదే నియోజకవర్గంలో మంగళవారం మరో హత్య జరిగింది. 

ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగించే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం కత్తులు, వేట కొడవళ్లు, మారణాయుధాలతో దాడి చేశారు. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని విచక్షణారహితంగా నరికారు. అడ్డుకోబోయిన వారిపై సైతం బెదిరింపులకు దిగడంతో ప్రజలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. నిమిషాల వ్యవధిలో వ్యక్తిని దారుణంగా నరికి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన డోన్ మండలంలో కలకలం రేపింది.

నంద్యాల జిల్లా డోన్ మండలం చండ్రపల్లి చెందిన సుంకన్న ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. డోన్ ఎద్దుల సంత దగ్గర వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లు, కత్తులు, మారణాయుధాలతో అతనిపై దాడి చేశారు. చుట్టుపక్కల వారు వారిని అడ్డుకోవాలని యత్నించగా వారిని చంపేస్తామంటూ దుండగులు బెదింపులకు దిగారు. సుంకన్నను అతి దారుణంగా నరికి పారిపోయారు. నిమిషాల వ్యవధిలో జరిగిన ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా భయాందోళన, షాక్‌కు గురైంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కొనఊపిరితో ఉన్న సుంకన్నను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

గత ఫిబ్రవరిలో డోన్ నియోజవర్గంలో దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దుండగులు మారణాయుధాలతో ఓ వ్యక్తిని హతమార్చారు. మైనింగ్ మాఫియా చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గత ఏడాది డిసెంబర్‌లో డోన్ పట్టణంలో ఏకంగా మహిళా జడ్జి వెళ్తున్న ఆటోను దుండగులు అడ్డుకుని వీరంగం సృష్టించారు. రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న జడ్జితో దుర్భాషలాడారు. తాను జడ్జిని అని చెప్పినా వినకుండా ఆమెకు రక్షణగా ఉన్న హోంగార్డ్ పై దాడి చేశారు. దీనిపై జడ్జి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జడ్జికే ఇలాంటి పరిస్థితి తలెత్తితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మందుబాబులు రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో తిరుగుతుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget