అన్వేషించండి

Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!

Fake Government School Jobs Scam: ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నకిలీ నియామక పత్రాలతో రూ. 5.30 లక్షల మోసం. గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ మహ్మద్ బాబర్ ను అరెస్టు చేశారు.

Global Foundation Chairman Arrested:   ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి, నకిలీ నియామక పత్రాలతో లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ భారీ జాబ్ ఫ్రాడ్ ముఠా గుట్టు రట్టయింది. ఈ మోసపూరిత నెట్‌వర్క్‌లో అత్యంత కీలకమైన ప్రధాన నిందితుడిని  ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నిరుద్యోగుల నుంచి రూ. 5.30 లక్షలు వసూలు చేసి మోసగించిన ఈ కేసు వివరాలను ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి శుక్రవారం  అధికారికంగా వెల్లడించారు.

కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లికి చెందిన మహ్మద్ బాబర్,  గ్లోబల్ ఫౌండేషన్  అనే సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లేని ఈ సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అతడు నిరుద్యోగులకు ఎర వేశాడు. ఈ క్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన నుగురు రవి, నర్సమ్మ, పృథ్వి అనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని నమ్మించి, వారి నుంచి నగదు ,  ఫోన్‌పే ద్వారా మొత్తం రూ. 5.30 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత వారికి గ్లోబల్ ఫౌండేషన్ పేరుతో నకిలీ నియామక ఉత్తర్వులు అందజేసి మోసానికి పాల్పడ్డాడు. బాధితుడు నుగురు రవి ఇచ్చిన ఫిర్యాదుతో 2025 అక్టోబర్ 14న పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 

ఈ భారీ మోసంలో మహ్మద్ బాబర్ ఒంటరిగా కాకుండా పక్కా ప్లాన్‌తో మధ్యవర్తులను రంగంలోకి దించినట్లు విచారణలో తేలింది. నిర్మల్‌కు చెందిన పల్లికొండ కార్తీక్  , సూర్యాపేటకు చెందిన రాహులపెంట సతీష్ , భైంసాకు చెందిన వడేకర్ నవీన్ కుమార్  లను మధ్యవర్తులుగా వాడుకుని, అమాయక నిరుద్యోగులను గుర్తించి డబ్బులు గుంజాడు. వసూలు చేసిన డబ్బులో వీరికి కమీషన్లు ఇచ్చి, మిగిలిన భారీ మొత్తాన్ని ప్రధాన నిందితుడే నొక్కేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు మధ్యవర్తులను పోలీసులు గతంలోనే అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

గత కొంతకాలంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మహ్మద్ బాబర్ కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు, జూలై 16న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తన నేరాన్ని అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి బాధితులకు ఇచ్చిన నకిలీ నియామక ఉత్తర్వుల ప్రతులను, ఒక రియల్‌మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాబర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి నిరుద్యోగులకు, ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేసే దళారులను, నకిలీ సంస్థలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే వెనుకాడకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.                            

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Hyderabad Jewellery Shop Fined 10 Lakh: లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget