News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

రాజస్థాన్‌లో 14 ఏళ్ల బాలిక దారుణ హత్య, ఇటుక బట్టీలో శవం - అత్యాచారం చేసి చంపేశారా?

Rajasthan Crime: రాజస్థాన్‌లో ఓ 14 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది.

FOLLOW US: 
Share:

Rajasthan Crime: 


ఇటుక బట్టీలో మృతదేహం..

రాజస్థాన్‌లో 14 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన రాజకీయంగానూ కాక రేపింది. మరి కొద్ది నెలల్లోనే అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. బిల్వారాలోని ఓ ఇటుక బట్టీలో కాలిపోయిన మృతదేహం కనిపించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తల్లితో కలిసి మేకలు కాసేందుకు వెళ్లిన బాలిక ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. కూతురి జాడ కోసం తల్లి అంతా వెతికింది. గ్రామస్థులూ రాత్రంతా గాలించారు. చివరకు తన ఇంటి వద్దే ఓ ఇటుకల బట్టీలో శవమై కనిపించింది. ఆమె ఎముకలు, పట్టీలు, షూస్ ఘటనా స్థలంలో దొరికాయి. అప్పటికే ఆమె శరీరం అప్పటికే మంటల్లో కాలిపోయింది. హత్య చేసే ముందు సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలోనే దాక్కున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మృతదేహం కనిపించగానే వందలాది మంది గ్రామస్థులు వచ్చి ఆందోళన చేశారు. న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. కూతురు కనిపించడం లేదని ముందుగానే చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. 

బీజేపీ విమర్శలు..

కేవలం ఆమె ఐడీకార్డ్‌, బర్త్‌ సర్టిఫికేట్ అడిగి వదిలేశారని మండి పడుతున్నారు. కొందరు బీజేపీ మంత్రులు గ్రామస్థులతో పాటు ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజస్థాన్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, ఈ విషయంలో గహ్లోట్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అంతకు ముందు జులై 14న ఓ బాలికపై యాసిడ్ దాడి జరిగింది. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తరవాత జోధ్‌పూర్‌లోని ఓ యూనివర్సిటీ క్యాంపస్‌లోనే ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. జులై 19న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని చంపేసి కాల్చేశారు. వీటిని హైలైట్ చేస్తూ బీజేపీ పదేపదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. సీఎం గహ్లోట్ ఎదురు దాడికి దిగారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనే మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. అసోం, ఢిల్లీ, హరియాణా క్రైమ్‌రేట్‌లో టాప్‌లో ఉన్నాయని అన్నారు. ఈ కేసుని విచారించేందుకు రాజస్థాన్ బీజేపీ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది.  

Published at : 03 Aug 2023 02:56 PM (IST) Tags: physical abuse Rajasthan crime news Rajasthan Crime Rajasthan Girl Killed

ఇవి కూడా చూడండి

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు 

Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు 

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Cyber Crime: గణేష్‌ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్‌ 15-నమ్మితే అకౌంట్‌ ఖాళీ అయినట్టే

Hyderabad: హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

Hyderabad:  హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?