అన్వేషించండి

Artificial Intelligence: కృత్రిమ మేథకు మోదీ బూస్ట్‌! జీపీయూ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్న కేంద్రం

Artificial Intelligence: కేంద్ర ప్రభుత్వం 'ఇండియా ఏఐ ప్రోగ్రామ్‌'లో భాగంగా భారీ గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (GPU) క్లస్టర్‌ను నెలకొల్పనుందని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

Artificial Intelligence: 

దేశంలో ఆర్టిఫీయల్‌ ఇంటెలిజెన్స్‌ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'ఇండియా ఏఐ ప్రోగ్రామ్‌'లో భాగంగా భారీ గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (GPU) క్లస్టర్‌ను నెలకొల్పనుందని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

జీపీయూలతో కూడిన కంప్యూటర్ల సముదాయాన్ని జీపీయూ క్లస్టర్‌ అంటారు. ఇందులో ప్రతి నోడ్‌కు జీపీయూ అనుసంధానమై ఉంటుంది. వీటి ద్వారా ఇమేజ్‌, వీడియో ప్రాసెసింగ్‌లో న్యూరల్‌ నెటవర్క్‌లకు శిక్షణ ఇస్తారు. ఏఐ అప్లికేషన్ల కోసం చిప్ డిజైన్లో స్థానిక మేధో ఆస్తులను సృష్టించే స్టార్టప్‌లు, విదేశీ కంపెనీలను ప్రోత్సహిస్తామని మంత్రి చంద్రశేఖర్‌ తెలిపారు. ఇందుకోసం రూ.1100-1200 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహాక పథకం (PLI Scheme) అమలు చేస్తామని వెల్లడించారు.

'ప్రస్తుతం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంటే ఎక్కువగా ఛాట్‌ జీపీటీ వంటి అప్లికేషన్ల గురించే చర్చ జరుగుతోంది. అయితే నిజమైన ప్రపంచానికి కృత్రిమ మేధ ఉపయోగపడాలన్నదే మా లక్ష్యం. ఆరోగ్యం, విద్య, వైద్యం, పాలన, వీటికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌కు అనుసంధానం చేసిన ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లను రూపొందించాలని మేం కోరుకుంటున్నాం' అని చంద్రశేఖర్‌ తెలిపారు.

గుజరాత్‌లోని సంసద్‌లో మైక్రాన్‌కు చెందిన సెమీకండక్టర్‌ ప్యాకేజింగ్‌, అసెంబ్లింగ్‌ ప్లాంట్‌కు చంద్రశేఖర్‌ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్‌ గ్లోబల్‌ ఎలక్ట్రానిక్స్‌ వాల్యూ చైన్‌లో భారత్‌ను సీరియస్‌గా తీసుకోవాలన్న సంకేతాలను చిప్‌ కంపెనీలు, ఇన్వెస్టర్లకు పంపించిందన్నారు.

కంప్యూటర్‌ స్టోరేజీ చిప్‌ తయారీ కంపెనీ మైక్రాన్‌ రూ.22,540 కోట్ల (2.75 బిలియన్‌ డాలర్లు) విలువైన గుజరాత్‌లో సెమీ కండక్టర్‌ అసెంబ్లీ, టెస్ట్‌ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. ఇందులో రూ.6760 కోట్లు ప్లాంట్‌కు కేటాయిస్తారు. దీనిని మైక్రాన్‌ కంపెనీ భరిస్తోంది. మిగిలిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం రెండు దశల్లో పెట్టుబడి పెడుతుంది. ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చులో 50 శాతాన్ని మైక్రాన్‌కు కేంద్రం ఆర్థికసాయం చేస్తుంది. ఇక 20 శాతానికి సమానమైన ప్రోత్సాహకాలను గుజరాత్‌ ప్రభుత్వం ఇస్తుంది.

వివిధ దశల్లో సెమీ కండక్టర్‌ ప్లాంట్‌ నిర్మాణం జరుగుతుంది. తొలి దశలో ఐదు లక్షల చదరపు అడుగుల క్లీన్‌రూమ్‌ స్పేస్‌ ఉంటుంది. 2024 ఆఖర్లో నిర్వహణలోకి వస్తుంది. 18 నెలలుగా భారత్‌లో సెమీ కండక్టర్ల తయారీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని రాజీశ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దార్శనికతలో భాగంగా రూ.76,000 పెట్టుబడిని ప్రణాళికబద్ధంగా పెడుతున్నామని చెప్పారు. భారత్‌ సెమీ కండక్టర్‌ నేషన్‌గా ఎదగడంలో ఇదో కీలక మైలురాయిగా వర్ణించారు.

తయారీ రంగానికి సరైన మౌలిక సదుపాయాలు ఉండటం, వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం, సంసద్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో విలువైన ప్రతిభ ఉండటంతోనే గుజరాత్‌ను ప్లాట్‌ నిర్మాణానికి సరైన ప్రాంతంగా ఎంచుకున్నామని మైక్రాన్‌ తెలిపింది.

Stock Market at 12PM, 22 September 2023:

భారత స్టాక్‌ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. మెజారిటీ ఆసియా సూచీలు లాభాల్లో ఉండటం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. లాభాల స్వీకరణ తగ్గిపోవడంతో మార్కెట్లు రీబౌండ్‌ అయ్యాయి. నేటి మధ్యాహ్నం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 38 పాయింట్లు పెరిగి 19,781 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 159 పాయింట్లు ఎగిసి 66,389 వద్ద కొనసాగుతున్నాయి. ఫార్మా, ఐటీ, లోహ రంగాలపై సెల్లింగ్‌ ప్రెజర్‌ నెలకొంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలకు మద్దతు దొరికింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Why Gold Rates Down: యుద్ధం ఉన్నా బంగారం రేటు ఎందుకు తగ్గుతోంది? - లక్షకు చేరుతుందా?
యుద్ధం ఉన్నా బంగారం రేటు ఎందుకు తగ్గుతోంది? - లక్షకు చేరుతుందా?
LPG cylinder Price: భారత్‌లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా? ప్రభుత్వం ఎలా ఎదుర్కోనుంది?
భారత్‌లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా? ప్రభుత్వం ఎలా ఎదుర్కోనుంది?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
Gold Rates: లక్ష్మీ స్వరూపంగా భావించే బంగారం ధరలు భారత్ తో పాటూ ఈ 10 దేశాల్లో మండిపోతున్నాయ్! కారణాలివే!
లక్ష్మీ స్వరూపంగా భావించే బంగారం ధరలు భారత్ తో పాటూ ఈ 10 దేశాల్లో మండిపోతున్నాయ్! కారణాలివే!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Maoists surrender in Hyderabad: జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి పూర్తి భద్రత, ప్యాకేజీ - సీఎం రేవంత్ హామీ - 130 మంది సరెండర్
Raisina Dialogue Chandrababu: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా భారత్ మారుతుంది - రైసినా డైలాగ్ సమ్మిట్‌లో చంద్రబాబు ధీమా
Vijay Divorce Case : విజయ్ విడాకుల కేసు - కోర్టులో భార్య సంగీత మరో పిటిషన్
విజయ్ విడాకుల కేసు - కోర్టులో భార్య సంగీత మరో పిటిషన్
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ డబ్బింగ్ షురూ - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఎప్పుడంటే?
పవర్ స్టార్ డబ్బింగ్ షురూ - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఎప్పుడంటే?
Former CMs in Union Cabinet: కేంద్ర కేబినెట్‌లో మాజీ సీఎంలే ఎక్కువ - నితీష్‌తో కలిపి ఎనిమిది మంది - తర్వాత చంద్రబాబూ కలుస్తారా?
కేంద్ర కేబినెట్‌లో మాజీ సీఎంలే ఎక్కువ - నితీష్‌తో కలిపి ఎనిమిది మంది - తర్వాత చంద్రబాబూ కలుస్తారా?
LPG cylinder Price: భారత్‌లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా? ప్రభుత్వం ఎలా ఎదుర్కోనుంది?
భారత్‌లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా? ప్రభుత్వం ఎలా ఎదుర్కోనుంది?
Jana Nayagan Release Date : విజయ్ జన నాయగన్ సెన్సార్ అప్డేట్ - మూవీ రిలీజ్‌ ఎప్పుడంటే?
విజయ్ జన నాయగన్ సెన్సార్ అప్డేట్ - మూవీ రిలీజ్‌ ఎప్పుడంటే?
Embed widget