అన్వేషించండి

Artificial Intelligence: కృత్రిమ మేథకు మోదీ బూస్ట్‌! జీపీయూ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్న కేంద్రం

Artificial Intelligence: కేంద్ర ప్రభుత్వం 'ఇండియా ఏఐ ప్రోగ్రామ్‌'లో భాగంగా భారీ గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (GPU) క్లస్టర్‌ను నెలకొల్పనుందని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

Artificial Intelligence: 

దేశంలో ఆర్టిఫీయల్‌ ఇంటెలిజెన్స్‌ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'ఇండియా ఏఐ ప్రోగ్రామ్‌'లో భాగంగా భారీ గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (GPU) క్లస్టర్‌ను నెలకొల్పనుందని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

జీపీయూలతో కూడిన కంప్యూటర్ల సముదాయాన్ని జీపీయూ క్లస్టర్‌ అంటారు. ఇందులో ప్రతి నోడ్‌కు జీపీయూ అనుసంధానమై ఉంటుంది. వీటి ద్వారా ఇమేజ్‌, వీడియో ప్రాసెసింగ్‌లో న్యూరల్‌ నెటవర్క్‌లకు శిక్షణ ఇస్తారు. ఏఐ అప్లికేషన్ల కోసం చిప్ డిజైన్లో స్థానిక మేధో ఆస్తులను సృష్టించే స్టార్టప్‌లు, విదేశీ కంపెనీలను ప్రోత్సహిస్తామని మంత్రి చంద్రశేఖర్‌ తెలిపారు. ఇందుకోసం రూ.1100-1200 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహాక పథకం (PLI Scheme) అమలు చేస్తామని వెల్లడించారు.

'ప్రస్తుతం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంటే ఎక్కువగా ఛాట్‌ జీపీటీ వంటి అప్లికేషన్ల గురించే చర్చ జరుగుతోంది. అయితే నిజమైన ప్రపంచానికి కృత్రిమ మేధ ఉపయోగపడాలన్నదే మా లక్ష్యం. ఆరోగ్యం, విద్య, వైద్యం, పాలన, వీటికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌కు అనుసంధానం చేసిన ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లను రూపొందించాలని మేం కోరుకుంటున్నాం' అని చంద్రశేఖర్‌ తెలిపారు.

గుజరాత్‌లోని సంసద్‌లో మైక్రాన్‌కు చెందిన సెమీకండక్టర్‌ ప్యాకేజింగ్‌, అసెంబ్లింగ్‌ ప్లాంట్‌కు చంద్రశేఖర్‌ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్‌ గ్లోబల్‌ ఎలక్ట్రానిక్స్‌ వాల్యూ చైన్‌లో భారత్‌ను సీరియస్‌గా తీసుకోవాలన్న సంకేతాలను చిప్‌ కంపెనీలు, ఇన్వెస్టర్లకు పంపించిందన్నారు.

కంప్యూటర్‌ స్టోరేజీ చిప్‌ తయారీ కంపెనీ మైక్రాన్‌ రూ.22,540 కోట్ల (2.75 బిలియన్‌ డాలర్లు) విలువైన గుజరాత్‌లో సెమీ కండక్టర్‌ అసెంబ్లీ, టెస్ట్‌ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. ఇందులో రూ.6760 కోట్లు ప్లాంట్‌కు కేటాయిస్తారు. దీనిని మైక్రాన్‌ కంపెనీ భరిస్తోంది. మిగిలిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం రెండు దశల్లో పెట్టుబడి పెడుతుంది. ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చులో 50 శాతాన్ని మైక్రాన్‌కు కేంద్రం ఆర్థికసాయం చేస్తుంది. ఇక 20 శాతానికి సమానమైన ప్రోత్సాహకాలను గుజరాత్‌ ప్రభుత్వం ఇస్తుంది.

వివిధ దశల్లో సెమీ కండక్టర్‌ ప్లాంట్‌ నిర్మాణం జరుగుతుంది. తొలి దశలో ఐదు లక్షల చదరపు అడుగుల క్లీన్‌రూమ్‌ స్పేస్‌ ఉంటుంది. 2024 ఆఖర్లో నిర్వహణలోకి వస్తుంది. 18 నెలలుగా భారత్‌లో సెమీ కండక్టర్ల తయారీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని రాజీశ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దార్శనికతలో భాగంగా రూ.76,000 పెట్టుబడిని ప్రణాళికబద్ధంగా పెడుతున్నామని చెప్పారు. భారత్‌ సెమీ కండక్టర్‌ నేషన్‌గా ఎదగడంలో ఇదో కీలక మైలురాయిగా వర్ణించారు.

తయారీ రంగానికి సరైన మౌలిక సదుపాయాలు ఉండటం, వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం, సంసద్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో విలువైన ప్రతిభ ఉండటంతోనే గుజరాత్‌ను ప్లాట్‌ నిర్మాణానికి సరైన ప్రాంతంగా ఎంచుకున్నామని మైక్రాన్‌ తెలిపింది.

Stock Market at 12PM, 22 September 2023:

భారత స్టాక్‌ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. మెజారిటీ ఆసియా సూచీలు లాభాల్లో ఉండటం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. లాభాల స్వీకరణ తగ్గిపోవడంతో మార్కెట్లు రీబౌండ్‌ అయ్యాయి. నేటి మధ్యాహ్నం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 38 పాయింట్లు పెరిగి 19,781 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 159 పాయింట్లు ఎగిసి 66,389 వద్ద కొనసాగుతున్నాయి. ఫార్మా, ఐటీ, లోహ రంగాలపై సెల్లింగ్‌ ప్రెజర్‌ నెలకొంది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాలకు మద్దతు దొరికింది.

టాప్ హెడ్ లైన్స్

Axis Mutual Fund NFO: యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్
యాక్సిస్ నిఫ్టీ50 ఈక్వల్ వెయిట్స్ ఇండెక్స్ ఫండ్ NFO ప్రారంభం.. రూ.100తో జులై 17 వరకు ఛాన్స్
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
EPFO Update 2026: లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 
లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 
Post Office Scheme: ప్రధాని మోదీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టారు! వడ్డీ నుంచే లక్షలు సంపాదిస్తున్నారు!
ప్రధాని మోదీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టారు! వడ్డీ నుంచే లక్షలు సంపాదిస్తున్నారు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget