అన్వేషించండి

Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!

వేతనాలు, సామాజిక భద్రత, పరిశ్రమ సంబంధాలు, ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నాలుగు కొత్త కార్మిక చట్టాలను అమల్లోకి తేనుందని సమాచారం.

వారానికి నాలుగు రోజులే పని! వినడానికి ఎంతో బాగుంది కదా! త్వరలోనే ఇది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వేతనాలు, సామాజిక భద్రత, పరిశ్రమ సంబంధాలు, ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నాలుగు కొత్త కార్మిక చట్టాలను అమల్లోకి తేనుందని సమాచారం. 2022 ఆర్థిక ఏడాది ఆరంభం నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సీనియర్‌ అధికారి ఒకరు చెబుతున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం దేశ వ్యాప్తంగా ఉద్యోగులకు వారానికి మూడు రోజులు సెలవులు ఇస్తారు. నాలుగు రోజులే విధులు ఉంటాయి. కేంద్రం ఇప్పటికే నిబంధనలపై తుది నిర్ణయం తీసుకొంది. ఇప్పుడు రాష్ట్రాలు ఇందుకు అనుగుణంగా నిబంధనలను సవరించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త నిబంధనలే అమలైతే దేశవ్యాప్తంగా పని సంస్కృతిలో మార్పు రావడం తథ్యం. పని రోజులు తగ్గడమే కాకుండా ఉద్యోగి చేతికందే వేతనం, పని గంటల్లో మార్పు ఉంటుంది.

'ఇప్పటికే చాలా రాష్ట్రాలు కొత్త కార్మిక స్మృతులపై నిర్ణయానికి వచ్చాయి. నిబంధనలను సవరిస్తున్నాయి. దాంతో 2022-23 నుంచి నాలుగు కొత్త కార్మిక స్మృతులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2021, ఫిబ్రవరిలోనే కేంద్రం ముసాయిదా నిబంధనలపై తుది నిర్ణయం తీసుకుంది. కార్మిక చట్టాలు కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి పరిధిలోకి వస్తాయి కాబట్టి రాష్ట్రాలు అమలు చేయాలని కేంద్రం కోరుకుంటోంది' అని ఆ ప్రభుత్వ అధికారి పీటీఐకి తెలిపారు.

కేంద్ర కార్మిక శాఖా మంత్రి భూపేందర్‌ యాదవ్‌ సైతం గత వారం రాజ్యసభలో నాలుగు కార్మిక స్మృతులపై మాట్లాడారు. 13 రాష్ట్రాలు నిబంధనలను ముసాయిదాలో చేర్చాయని వెల్లడించారు. ఉత్తరాఖండ్‌, ఉత్తర్ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ గఢ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, ఝార్ఖండ్‌, పంజాబ్‌, మణిపుర్‌, బిహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్ము, కశ్మీర్‌ ముసాయిదా నిబంధనలను ప్రచురించాయి.

కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి సాలరీ స్ట్రక్చర్‌ మారుతుందని అంటున్నారు. చేతికి అందే జీతం కాస్త తగ్గుతుందని సమాచారం. ఇందుకు ఓ కారణం ఉంది. పీఎఫ్‌ లెక్కించే విధానం మారుతుంది. కొత్త విధానం ప్రకారం అలవెన్సెలు వేతనంలో 50 శాతం కన్నా ఎక్కువ ఉండొద్దు. అంటే జీతంలో బేసిక్‌ పే కనీసం 50 శాతం ఉండాలన్నమాట. సాధారణంగా ఉద్యోగులు తక్కువ బేసిక్‌ పే, ఎక్కువ అలవెన్సెలు తీసుకోవడంతో చేతికి ఎక్కువ డబ్బు వస్తుంది. ఇప్పుడు 50 శాతం మూల వేతనం ఉంటుంది కాబట్టి పీఎఫ్‌కు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. గ్రాట్యుటీ పేమెంట్‌ కూడా పెరగనుంది. మరికొన్ని రోజులు ఆగితే పూర్తి వివరాలు తెలుస్తాయి.

Also Read: Tesla Smartphone: క్రేజీ ఎలన్‌ మస్క్‌! టెస్లా నుంచి మొబైల్‌ ఫోన్‌.. ఫీచర్లు ఇవే!!

Also Read: Multibagger Stock: 19 నెలల్లో రూ.లక్షకు రూ.20 లక్షల లాభం ఇచ్చే మల్టీబ్యాగర్‌

Also Read: Cryptocurrency Prices Today: రూ.3 లక్షల కోట్లు తగ్గిన బిట్‌కాయిన్‌, ఎథిరియమ్‌ విలువ.. మిగతావీ??

Also Read: Medplus IPO: మెడ్‌ప్లస్‌ లిస్టింగ్‌ సూపర్‌హిట్‌.. లాట్‌కు లాభం ఎంతొచ్చిందంటే?

Also Read: Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త కారు వచ్చేస్తుంది... వావ్ అనిపించే లుక్, డిజైన్లు

Also Read: PAN card Update: పెళ్లైన తర్వాత పాన్‌ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా..? ఇలా చేయండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MLC Elections ఏపి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెడుతున్న ఆధారాలు చూపిన శ్రీరాజ్Deputy CM Pawan Kalyan South India Temples Full Video | పవన్ తిరిగిన దక్షిణాది ఆలయాలు ఇవే | ABPDy CM Pawan Kalyan మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు | Tamil Nadu | ABP DesamKiran Royal Laxmi Comments On Pawan Kalyan | కిరణ్ రాయల్ వెనుక పవన్ ! | ABP DESAM

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.