అన్వేషించండి

FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ ధరలను సవరించింది. నాన్-కమర్షియల్ వాహనాల పాస్ ధర రూ. 3,000 నుండి రూ. 3,075 కి పెరిగింది.

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక  అప్డేట్ అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ ధరలను సవరిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మార్చి 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం, ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్ల వార్షిక పాస్ ధర స్వల్పంగా పెరగనుంది. ఇప్పటివరకు రూ. 3,000 గా ఉన్న ఈ పాస్ ధర ఇకపై రూ. 3,075 కి చేరుకుంటుంది.

ఏమిటీ వార్షిక పాస్?
తరచుగా హైవేలపై ప్రయాణించే వారి సౌకర్యార్థం 2025 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. పదేపదే టోల్ చెల్లింపులు చేసే అవసరం లేకుండా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం. కేవలం నాన్ కమ‌ర్షియ‌ల్ అవసరాలకు వాడే ప్రైవేట్ వాహనాలకు మాత్రమే ఈ పాస్ సౌకర్యం వర్తిస్తుంది. వాలిడ్ ఫాస్ట్‌ట్యాగ్ కలిగిన ఏ ప్రైవేట్ కారు యజమాని అయినా ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు.

వాలిడిటీ వివరాలు
ఈ పాస్ యాక్టివేట్ అయిన తర్వాత ఒక ఏడాది కాల పరిమితి ఉంటుంది. లేదా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల గుండా 200 సార్లు ప్రయాణించే వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. ఈ రెండింటిలో ఏది ముందు పూర్తయితే అది ముగిసినట్లుగా పరిగణిస్తారు. హైవే నెట్‌వర్క్‌లోని వివిధ ప్లాజాల వద్ద ఉండే టోల్ ధరలతో సంబంధం లేకుండా ఈ పాస్ ద్వారా ప్రయాణించే వీలుంటుంది.

పాస్.. బంప‌ర్ హిట్
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వివ‌రాల ప్రకారం, ఈ ఇయ‌ర్లీ పాస్ పథకం వాహనదారుల్లో విశేష ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది క‌స్ట‌మ‌ర్లు ఈ సౌకర్యాన్ని వాడుతున్నారు. జాతీయ రహదారులపై ప్రైవేట్ కార్లు జరిపే మొత్తం టోల్ లావాదేవీల్లో దాదాపు 28 శాతం ఈ వార్షిక పాస్ ద్వారానే జరుగుతుండటం గమనార్హం.

డిజిటల్ చెల్లింపులపై ఫోక‌స్
2016లో ప్రారంభమైన ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థ దేశంలో ప్రధాన టోల్ చెల్లింపు విధానంగా మారింది. ఇప్పటి వరకు సుమారు 11.86 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ కాగా, అందులో 5.9 కోట్ల ట్యాగ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి. జాతీయ రహదారుల టోల్ ఆదాయంలో 98 శాతానికి పైగా డిజిటల్ రూపంలోనే వస్తోంది. వినియోగదారులు రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ పాస్‌లను సులభంగా పునరుద్ధరించుకోవచ్చు. యూపీఐ, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు పూర్తి చేసిన 24 గంటల్లోనే పాస్ యాక్టివేట్ అవుతుంది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
బైక్ ప్రియులకు పండగే: Kawasaki Ninja ZX-6R పై రూ. 3.72 లక్షల భారీ బెనిఫిట్స్!
బైక్ ప్రియులకు పండగే: Kawasaki Ninja ZX-6R పై రూ. 3.72 లక్షల భారీ బెనిఫిట్స్!
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget