అన్వేషించండి

E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!

E20 పెట్రోల్‌పై ARAI అధ్యయనం మరోసారి చర్చకు వచ్చింది. పాత వాహనాల్లో రబ్బర్ & ప్లాస్టిక్ ఫ్యూయల్ సిస్టమ్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

E20 petrol could damage rubber parts: దేశంలో E20 పెట్రోల్‌పై అనుమానాల పరంపరకు అడ్డుకట్ట పడడం లేదు. E20 ఇంధనం వల్ల ఇంజిన్‌లు దెబ్బతింటున్నాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ, 2021లో ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నిర్వహించిన అధ్యయనం మరోసారి చర్చనీయాంశంగా మారింది. E20 పెట్రోల్‌ వినియోగం వల్ల లోహ భాగాలపై పెద్దగా ప్రభావం లేకపోయినా, కొన్ని రబ్బర్ & ప్లాస్టిక్ భాగాలపై దీర్ఘకాలంలో ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

పరిశోధన ఇలా సాగింది...

ఈ పరిశోధనలో ఫ్యూయల్ సిస్టమ్‌లో ఉపయోగించే 8 రకాల లోహాలు, 6 రకాల ఎలాస్టోమర్లు, 4 రకాల ప్లాస్టిక్ పదార్థాలను పరీక్షించారు. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నిర్ణీత కాలం పాటు E20 ఇంధనంలో ముంచి వాటి పనితీరును పరిశీలించారు. పోలిక కోసం E10 పెట్రోల్‌ను ప్రామాణికంగా తీసుకుని రెండు ఇంధనాల ప్రభావాన్ని విశ్లేషించారు.

లోహాలపై తుప్పు పట్టే స్థాయిని బరువు మార్పుల ఆధారంగా అంచనా వేశారు. అదే సమయంలో రబ్బర్ & ప్లాస్టిక్ భాగాల్లో బరువు, పరిమాణం, బలం, సాగుదల, గట్టితనం వంటి లక్షణాల్లో వచ్చిన మార్పులను పరిశీలించారు.

ఇది కూడా చదవండి: రూ.6 లక్షలకే కొత్త SUV తీసుకొస్తున్న మారుతి! టాటా పంచ్‌కి షాక్ తప్పదా?

ARAI నివేదిక ప్రకారం, E20 ఇంధనం వల్ల లోహ భాగాలపై గణనీయమైన ప్రభావం కనిపించలేదు. అయితే NBR-PVC, ఎపిక్లోరోహైడ్రిన్ వంటి రబ్బర్ పదార్థాలు & PA66 అనే ప్లాస్టిక్ పదార్థంపై సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఎక్కువ ప్రభావం కనిపించినట్లు పేర్కొంది. ఈ పదార్థాలను సాధారణంగా గ్యాస్కెట్లు, సీల్స్, O-రింగ్స్, పైపులు, హోస్‌లు వంటి ఫ్యూయల్ సిస్టమ్ భాగాల తయారీలో ఉపయోగిస్తారు. దీర్ఘకాలం E20 వినియోగిస్తే ఈ భాగాలు వేగంగా అరిగిపోయే అవకాశం ఉందని అధ్యయనం సూచించింది.

అదే ఏడాది విడుదలైన నీతి ఆయోగ్ నివేదిక కూడా ఈ అంశాన్ని ప్రస్తావించింది. వాహనం రకాన్ని బట్టి సగటున 6 శాతం వరకు ఫ్యూయల్ ఎఫిషియెన్సీ తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అయినప్పటికీ ఇంజిన్ పనితీరు, స్టార్ట్ సామర్థ్యం, డ్రైవబిలిటీ వంటి అంశాల్లో ఎలాంటి తీవ్రమైన లోపాలు కనిపించలేదని స్పష్టం చేసింది. ఇంజిన్‌లో అసాధారణ అరుగుదల, కార్బన్ డిపాజిట్లు లేదా ఇంజిన్ ఆయిల్ నాణ్యత తగ్గిన ఆనవాళ్లు కూడా గుర్తించలేదని నివేదిక వెల్లడించింది.

ఇటీవల సోషల్ మీడియాలో E20 పెట్రోల్ వల్ల ఇంజిన్‌లు దెబ్బతింటున్నాయంటూ అనేక పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు వాటిని నిర్ధారించే స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇటీవల ఒక ఇన్నోవా హైక్రాస్ యజమాని చేసిన ఆరోపణలను టయోటా కూడా ఖండించింది. ఆ వాహనంలో తలెత్తిన సమస్య E20 వల్ల కాదని, కలుషితమైన ఇంధనం కారణమని కంపెనీ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: E20పై కేంద్రమంత్రి కీలక ప్రకటన! హర్దీప్ సింగ్ ఏం చెప్పారంటే?

2023 ఏప్రిల్ తర్వాత తయారైన కొత్త కార్లు & ద్విచక్ర వాహనాలు ఇప్పటికే E20 ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతున్నాయి. కాబట్టి అలాంటి వాహనాల యజమానులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ E20 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించని పాత వాహనాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఫ్యూయల్ సిస్టమ్‌లోని రబ్బర్ & ప్లాస్టిక్ భాగాలను ప్రత్యేక అప్‌గ్రేడ్ కిట్లతో మార్చుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఏ వాహన తయారీ సంస్థ కూడా అధికారికంగా అలాంటి కిట్లను అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రస్తుతం కొన్ని థర్డ్ పార్టీ సంస్థల వద్ద మాత్రమే ఇవి లభిస్తున్నాయి. వాటి ఖర్చును పూర్తిగా వాహన యజమానే భరించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే, E20కే పరిమితం కాకుండా  భవిష్యత్తులో E22, E25, E27 & E30 వంటి అధిక ఎథనాల్ మిశ్రమ ఇంధనాలను కూడా ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న E10 & E20 వాహనాలపై E25 ప్రభావాన్ని అధ్యయనం చేయాలని ARAIకి బాధ్యతలు అప్పగించారు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget