అన్వేషించండి

Ysrcp MPs: టీడీపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టింది... ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు... రాష్ట్రపతిని కలిసిన వైసీపీ ఎంపీల బృందం

టీడీపీ గుర్తింపు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీల బృందం రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసింది. రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు నిరోధించేలా చట్టం తీసుకురావాలని కోరారు.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అసభ్య పదజాలంతో టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లింది. మంగళవారం దిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రతిష్టకు భంగం కలిగించేలా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని రాష్ట్రపతికి వివరించామని తెలిపారు. సీఎంని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని తెలిపామన్నారు. టీడీపీ గుర్తింపు రద్దుచేయాలని కోరామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ బూతుల కల్చర్ పోత్సహిస్తుందని, అదొక తెలుగు బూతుల పార్టీ అని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితుల్లో టీడీపీ లేదన్నారు. 

Also Read: లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యాన్ని సాధించలేకపోయిన వైఎస్ఆర్‌సీపీ ! ఓటింగ్ తగ్గడమే కారణం !

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన పార్టీ టీడీపీ

చంద్రబాబు తన పార్టీ అధికార ప్రతినిధులు, ఇతర నేతలతో ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ ను అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ... రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదులు చేశారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను రాష్ట్రపతికి వివరించామన్నారు. చంద్రబాబు తన రాజకీయ స్వప్రయోజనాల కోసం దిల్లీ వచ్చారన్నారు. తన స్వార్థం కోసం రాష్ట్ర పరువు, ప్రతిష్టలను, ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. టీడీపీ అధికార ప్రతినిధితో చంద్రబాబు మాట్లాడించిన బో**కే అనే పదాన్ని రాష్ట్రపతి దగ్గర తెలపాలంటే తమకు ఇబ్బంది అనిపించిందన్నారు. ఆయన అర్థం చేసుకుని, సీఎంని ఇంత దారుణంగా  మాట్లాడారా.. అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు తిట్టించిన ఆ పదాన్ని రాష్ట్రపతి దృష్టికి, ఇతర నేతల దృష్టికి గానీ చంద్రబాబు తీసుకువెళ్లారా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించింది. 

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు

ప్రత్యేక చట్టం తీసుకురావాలి 

టీడీపీ సంస్కార హీన పార్టీగా మారిందని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. గత రెండేళ్లుగా ప్రతీ ఎన్నికలో టీడీపీ ఘోరంగా ఓడిపోతున్న కారణంగా ఆ పార్టీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందన్నారు. దీంతో తమ పార్టీ నేతల చేత బూతులు మాట్లాడించి, ప్రత్యర్థులను రెచ్చగొట్టి, కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. బద్వేల్ ఉపఎన్నిక వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిందని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలో పోటీ చేసే ధైర్యం కూడా టీడీపీ చేయలేకపోయిందన్నారు. టీడీపీ అంతర్థానం కాబోతుందని విమర్శించారు. ఎన్నడూలేనిది చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయాల్లో వికృత ధోరణల్ని ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తున్నారన్నారు. అందులో భాగంగానే గంజాయి, హెరాయిన్, అఫ్గానిస్థాన్ అని నోటికొచ్చింది మాట్లాడుతున్నారన్నారు.  న్యాయమూర్తులకు కంటెప్ట్ ఆఫ్ కోర్టు యాక్ట్ 1971లాగా రాజ్యాంగ హోదాలో ఉన్నవారి పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యాలు చేస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని రాష్ట్రపతిని కోరామని వైసీపీ ఎంపీల బృందం తెలిపింది. గత ఏడాదిన్నరగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న చంద్రబాబు ఒక టెర్రరిస్ట్ గా అసభ్యకరమైన మాటలు మాట్లాడిస్తున్నారన్నారు. ఇప్పుడు టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితే లేదని ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. 

Also Read: బద్వేలులో వైఎస్ఆర్‌సీపీ విజయం.. మెజార్టీ 90,089 !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget