అన్వేషించండి

Ysrcp MPs: టీడీపీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టింది... ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు... రాష్ట్రపతిని కలిసిన వైసీపీ ఎంపీల బృందం

టీడీపీ గుర్తింపు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీల బృందం రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసింది. రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు నిరోధించేలా చట్టం తీసుకురావాలని కోరారు.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అసభ్య పదజాలంతో టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లింది. మంగళవారం దిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రతిష్టకు భంగం కలిగించేలా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని రాష్ట్రపతికి వివరించామని తెలిపారు. సీఎంని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని తెలిపామన్నారు. టీడీపీ గుర్తింపు రద్దుచేయాలని కోరామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ బూతుల కల్చర్ పోత్సహిస్తుందని, అదొక తెలుగు బూతుల పార్టీ అని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితుల్లో టీడీపీ లేదన్నారు. 

Also Read: లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యాన్ని సాధించలేకపోయిన వైఎస్ఆర్‌సీపీ ! ఓటింగ్ తగ్గడమే కారణం !

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన పార్టీ టీడీపీ

చంద్రబాబు తన పార్టీ అధికార ప్రతినిధులు, ఇతర నేతలతో ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ ను అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ... రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదులు చేశారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను రాష్ట్రపతికి వివరించామన్నారు. చంద్రబాబు తన రాజకీయ స్వప్రయోజనాల కోసం దిల్లీ వచ్చారన్నారు. తన స్వార్థం కోసం రాష్ట్ర పరువు, ప్రతిష్టలను, ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. టీడీపీ అధికార ప్రతినిధితో చంద్రబాబు మాట్లాడించిన బో**కే అనే పదాన్ని రాష్ట్రపతి దగ్గర తెలపాలంటే తమకు ఇబ్బంది అనిపించిందన్నారు. ఆయన అర్థం చేసుకుని, సీఎంని ఇంత దారుణంగా  మాట్లాడారా.. అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు తిట్టించిన ఆ పదాన్ని రాష్ట్రపతి దృష్టికి, ఇతర నేతల దృష్టికి గానీ చంద్రబాబు తీసుకువెళ్లారా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించింది. 

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు

ప్రత్యేక చట్టం తీసుకురావాలి 

టీడీపీ సంస్కార హీన పార్టీగా మారిందని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. గత రెండేళ్లుగా ప్రతీ ఎన్నికలో టీడీపీ ఘోరంగా ఓడిపోతున్న కారణంగా ఆ పార్టీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందన్నారు. దీంతో తమ పార్టీ నేతల చేత బూతులు మాట్లాడించి, ప్రత్యర్థులను రెచ్చగొట్టి, కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. బద్వేల్ ఉపఎన్నిక వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించిందని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలో పోటీ చేసే ధైర్యం కూడా టీడీపీ చేయలేకపోయిందన్నారు. టీడీపీ అంతర్థానం కాబోతుందని విమర్శించారు. ఎన్నడూలేనిది చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయాల్లో వికృత ధోరణల్ని ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తున్నారన్నారు. అందులో భాగంగానే గంజాయి, హెరాయిన్, అఫ్గానిస్థాన్ అని నోటికొచ్చింది మాట్లాడుతున్నారన్నారు.  న్యాయమూర్తులకు కంటెప్ట్ ఆఫ్ కోర్టు యాక్ట్ 1971లాగా రాజ్యాంగ హోదాలో ఉన్నవారి పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యాలు చేస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని రాష్ట్రపతిని కోరామని వైసీపీ ఎంపీల బృందం తెలిపింది. గత ఏడాదిన్నరగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న చంద్రబాబు ఒక టెర్రరిస్ట్ గా అసభ్యకరమైన మాటలు మాట్లాడిస్తున్నారన్నారు. ఇప్పుడు టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితే లేదని ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. 

Also Read: బద్వేలులో వైఎస్ఆర్‌సీపీ విజయం.. మెజార్టీ 90,089 !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Mudragada Padmanabham Passes Away: ముద్రగడ పద్మనాభం ఇక లేరు - తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూత
ముద్రగడ పద్మనాభం ఇక లేరు - తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూత
Breaking News: ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
ముద్రగడ పద్మనాభ రెడ్డి కన్నుమూత!
Singarayakonda Train Suicide: ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
ఆస్తి కోసం బావను చంపాడు - భయంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు - సింగరాయకొండలో విషాదం
TTD Darshan Fraud Arrest: దర్శన టిక్కెట్ల పేరుతో లక్షల్లో మోసం - టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్ - భక్తులకు కీలక సూచనలు
దర్శన టిక్కెట్ల పేరుతో లక్షల్లో మోసం - టీటీడీ మాజీ ఉద్యోగి అరెస్ట్ - భక్తులకు కీలక సూచనలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget