By: ABP Desam | Updated at : 02 Nov 2021 01:52 PM (IST)
లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యాన్ని సాధించలేకపోయిన వైఎస్ఆర్సీపీ !
బద్వేలు నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీని లక్ష్యంగా పెట్టుకుని పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసి పంపించారు. ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోవడంతో ఈ లక్ష్యాన్ని సులువుగా సాధించేయగలమని అధికార పార్టీ నేతలు కూడా అనుకున్నారు. కానీ వారి ఆశలు.. అంచనాలు 90వేల దగ్గరే ఆగిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష ఓట్ల మెజార్టీని లక్ష్యంగా పెట్టుకోవడానికి ఓ కారణం ఉంది. అది గతంలో ఇలా జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ లక్షకుపైగా ఓట్ల మెజారిటీని సాధించడమే.
Also Read : బద్వేలులో వైఎస్ఆర్సీపీ విజయం.. మెజార్టీ 90,089 !
2015లో తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ చనిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆయన భార్య సుగుణమ్మకే టిక్కెట్ ఇచ్చింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి బరిలో నిలిచారు. ఈ కారణంగా ఏకగ్రీవం జరగలేదు. పోటీ జరిగింది. అయినప్పటికీ పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్కు వచ్చి ఓట్లు వేశారు. ఈ కారణంగా టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ లక్షా పదివేలకుపైగా మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. ఆ మార్క్ దాటాలని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
Also Read : 2019లో 735 - 2021లో 21621 .. బద్వేలులో బీజేపీ పికప్ !
కానీ బద్వేలులో ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయారు. దీనికి కారణం ఓటింగ్ను పెంచుకోలేకపోవడమే. అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణంగా 80 శాతం వరకూ పోలింగ్ నమోదవుతుంది. కానీ ఉపఎన్నికల్లో 68.12 శాతం ఓటింగ్ మాత్రమే నమోదయింది. గత ఎన్నికల్లో 76.37 శాతం నమోదయింది. అంటే గత ఎన్నికల్లో కన్నా 8.25 శాతం తక్కువగా నమోదైంది.
Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?
పోటీ తీవ్రంగా లేకపోవడం, టీడీపీ, జనసేన పోటీలో లేకపోవడంతో ఆ పార్టీలకు చెందిన సానుభూతి పరులు ఓటు వేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపించలేదు. వలస ఓటర్లను రప్పించడంలో పార్టీలు పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము లక్ష్యంగా పెట్టుకున్న లక్ష ఓట్ల మెజార్టీని సాధించలేకపోయారు.
Petrol Price Today 1st July 2022: తెలంగాణలో నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు - ఏపీలో అక్కడ మండుతున్న ధరలు
Weather Updates: పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD
Gold Rate Today 1st July 2022: పసిడి ప్రియులకు గుడ్న్యూస్, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ
AP Govt GPF Issue : ఉద్యోగుల ఖాతాల్లో నగదు మాయంపై న్యాయపోరాటం చేస్తాం - సూర్యనారాయణ
Chittoor News : మేయర్ దంపతుల హత్య కేసులో మరో ట్విస్ట్, విచారణ నుంచి తప్పుకున్న ఏపీపీ
TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల
Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!
Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !
IND Vs ENG Squads: ఇంగ్లండ్తో వన్డేలు, టీ20లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ - మొత్తం మూడు జట్లు!