అన్వేషించండి

Budvelu BJP : 2019లో 735 - 2021లో 21621 .. బద్వేలులో బీజేపీ పికప్ !

బద్వేలులో రెండేళ్ల కింద 735 ఓట్లు తెచ్చుకుని ఘోర పరాభవం పొందిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 21621 ఓట్లు సాధించింది.


బద్వేలు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మెరుగు పడింది. ఆ నియోజకవర్గంలో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సాధించిన ఓట్లతో పోలిస్తే ఎన్నో రెట్లు మెరుగైన ఓట్లను సాధించింది. 2019లో డిపాజిట్ కాదు కదా కనీసం నోటాతో పాటుగా ఓట్లు సాధించలేదు. పట్టు మని వెయ్యి ఓట్లను కూడా బీజేపీ సాధించలేకపోయింది. ఆ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్లు 735 మాత్రమే. కానీ ప్రస్తుతం జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఓట్లు 21621. అంటే బాగా పుంజుకున్నట్లుగానే భావించాలి. 

Also Read : బద్వేలులో వైఎస్ఆర్‌సీపీ విజయం.. మెజార్టీ 89, 660 !

బద్వేలు నియోజకవర్గంలో బీజేపీకి పట్టు లేదు. 2019లో ఆ పార్టీ తరపున పోటీ చేసింది సాక్షాత్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన జయరాములు ఆ తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీలో టిక్కెట్ రాదని తెలిసిన తర్వాత బీజేపీలో చేరారు. టిక్కెట్ తెచ్చుకుని పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనకు కనీసం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ సారి స్థానికేతరుడు, రైల్వే కోడూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి అచ్చంగా నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి పనతల సురేష్ ఈ సారి బద్వేలు నుంచి బరిలోకి దిగారు. అయినప్పటికీ మంచి ఓట్లను సాధించింది. 

Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?

బద్వేలులో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. చనిపోయిన ఎమ్మెల్యే భార్యకే వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ ఇచ్చింది కాబట్టి బరిలోకి దిగలేదు. ఈ కారణంగా వైఎస్ఆర్‌సీపీకి ఓటు వేయడానికి ఇష్టపడని వారు.. తదుపరి ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని చూశారు. నిజానికి పోలింగ్‌ బూత్‌లలో బీజేపీ తరపున కూర్చున్న వారు టీడీపీ నేతలేనని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేతలే బీజేపీకి ఓట్లు వేయించారని వారు విమర్శలు చేశారు. 

Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు

పైగా ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ముఖ్య నేతలు కడప జిల్లా వారే. ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ వంటి వారు కడప జిల్లాకు చెందిన వారే కావడం... బద్వేలులో టీడీపీ బరిలో లేకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఓట్లను వీలైనంత వరకూ బీజేపీకి వేయించగలిగారని తెలుస్తోంది.  ఎలా చూసినా లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ఆర్‌సీపీకి బీజేపీ కాస్త అడ్డుకట్ట వేయగలిగింది. 

Also Read: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్య రాగం... ఆ విషయంలో కేసీఆర్ కు మద్దతిస్తానని కీలక వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EPFO Wage Ceiling Hike: ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
Death Sentence For Maoists: జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
జీరమ్ లోయ ఊచకోత కేసు.. 10 మంది మావోయిస్టులకు మరణశిక్ష విధించిన NIA కోర్టు
KCR Family Assets: కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు, ఎవరి పేరిట ఎన్ని ఎకరాలు- సభలో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Embed widget