అన్వేషించండి

Mla Jaggareddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్య రాగం... ఆ విషయంలో కేసీఆర్ కు మద్దతిస్తానని కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ సమైక్యరాగం ఎత్తుకున్నారు. సీఎం కేసీఆర్ సమైక్య వాదంతో ముందుకొస్తే మద్దతిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్యవాదం వినిపించారు. సీఎం కేసీఆర్‌ సమైక్య వాదంతో ముందుకొస్తే మద్దతిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ జగ్గారెడ్డి సమైక్య వాదాన్ని వినిపించారు. అందరూ తనను తెలంగాణ ద్రోహి అన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. సమైక్యం తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన తెలిపారు. పార్టీకి సంబంధం లేదన్నారు. మళ్లీ ఆంధ్రా, తెలంగాణ నాయకులు సమైక్యాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఈ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభిప్రాయం వేరు, తన వ్యక్తిగత అభిప్రాయం వేరని వివరించారు. తాను ఏ ప్రాంతానికీ వ్యతిరేకంకాదని జగ్గారెడ్డి అన్నారు. సమైక్య వాదం ప్రజల డిమాండ్‌ కాదని, నాయకుల అభిప్రాయం మాత్రమే అన్నారు. తెలంగాణ వస్తే మెరుగైన జీవితం ఉంటుందని భావించినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినా ఇంకా ఏ ఒక్కటీ నెరవేరలేదన్నారు. రాష్ట్ర విభజన జరిగినా ఆంధ్రా, రాయలసీమ ప్రజలు కోటిమందికి పైగా తెలంగాణలో ఉంటున్నారన్నారు. ఆంధ్రాలో పార్టీ పెట్టమని కోరుతున్నారని సీఎం కేసీఆర్ ప్లీనరీలో చెప్పారని జగ్గారెడ్డి గుర్తుచేశారు. పార్టీ పెట్టడం ఎందుకు రాష్ట్రాన్ని కలిపేద్దామని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రతిపాదించారన్నారు. 

Also Read: ఇప్పుడు ఏపీలో చీకట్లు.. తెలంగాణలో వెలుగులు ! తెలంగాణ దేశంకన్నా ముందు ఉందన్న కేసీఆర్ !

టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు

తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను తమకు అమలు చేయకపోతే.. తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని మహారాష్ట్రలోని నాందేడ్ వాసులు, కర్ణాటకలోని రాయచూర్ వాసులు కోరుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద ఎత్తున తమ పార్టీని అక్కడ కూడా పోటీ చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను తమకూ కావాలని ఏపీ ప్రజలు కోరుతున్నారన్నారు.  

Also Read: అలా అయితే రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందిగా ? కేసీఆర్‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ !

పేర్ని నాని కౌంటర్... రేవంత్ రెడ్డి హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ పెట్టాలని.. గెలిపించుకుంటామని కొన్ని వేల మంది తనకు ఫోన్లు చేస్తున్నారని టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుందని వ్యంగ్యంగా మాట్లాడారు. ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్‌లో తీర్మానం పెడితే బాగుంటుందని ఆయన సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలనే తీర్మానాన్ని కేసీఆర్ పెడితే.. ఆ తర్వాత  ప్రత్యేకంగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఉండదన్నారు. ఏ ఇబ్బంది లేకుండా పోటీ చేయవచ్చని గుర్తు చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ జోలికొస్తే ఖబడ్డార్ అంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర చేస్తున్నారన్నారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్ని నాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన... కేసీఆర్, జగన్‌ల ఉమ్మడి కుట్ర అని ఆరోపించారు. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ విషయంపై మంత్రి పేర్ని నాని మళ్లీ స్పందించి తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని అందుకే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయన్నారు. 

Also Read: తెలంగాణలో రాజకీయ శూన్యత... అందుకే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి... మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Embed widget