అన్వేషించండి

Budvelu YSRCP Win : బద్వేలులో వైఎస్ఆర్‌సీపీ విజయం.. మెజార్టీ 90,089 !

బద్వేలు నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ విజయం సాధించారు. ఈవీఎం ఓట్లలో 89, 660 మెజార్టీ సాధించారు. పోస్టల్ ఓట్లు కలుపుకుంటే మెజార్టీ 90,089 కి చేరింది.


బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగి ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఈవీఎంలలో 89, 660 ఓట్ల మెజార్టీ సాధించారు. పోస్టల్ ఓట్లతో కలుపుకుని 90,089 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  మొత్తం పన్నెండు రౌండ్ల కౌంటింగ్‌లో ఆమెకు 1, 11, 227 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌కు 21567 ఓట్లు పోలయ్యాయి. దీంతో 89, 660 ఓట్ల తేడాతో డాక్టర్ సుధ విజయం సాధించినట్లయింది. పోస్టల్ ఓట్ల ఆధిక్యం కలుపుకుంటే మెజార్టీ కాస్త పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 6191 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 3616 ఓట్లు వచ్చాయి. ఇది గత ఎన్నికల్లో కంటే ఎక్కువ. పోస్టర్ ఓట్లలో 362 వైఎస్ఆర్‌సీపీకి దక్కగా బీజేపీకి 40 ఓట్లు మాత్రమే వచ్చాయి.


Budvelu YSRCP Win : బద్వేలులో వైఎస్ఆర్‌సీపీ విజయం.. మెజార్టీ 90,089 !

Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?

బద్వేలు నియోజకవర్గంలో మొత్తం 2,15,240  ఓట్లు ఉండగా, 1,47,213 ఓట్లు పోలయ్యాయి. పోలయిన ఓట్లలో 76.23 శాతం వైసీపీ అభ్యర్థికే పోలయ్యాయి. బద్వేలులో వైసీపీ విజయంపై ఎవరికీ అనుమానాల్లేవు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా బరిలో నిలబడలేదు. లక్ష ఓట్ల మెజార్టీని లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి పంపించారు.  దానికి తగ్గట్లుగానే ఎన్నికల బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డి శ్రమించారు. 

Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... తెలంగాణలో 6, ఏపీలో 3 స్థానాల్లో ఎన్నికలు

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బద్వేలు బాధ్యతల్ని కూడా నిర్వర్తించారు. ఆయన ఎన్నిక గురించి ప్రతి విషయాన్ని పక్కాగా పరిశీలించి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ప్రచారంలో ఎక్కడా తగ్గలేదు.  సీరియస్‌గా ప్రచారం చేశారు. ఎలక్షనీరింగ్ కూడా లోపాలు లేకుండా చేసుకున్నారు. ఓటర్లందర్నీ బూత్‌ల వద్దకు తరలించుకోగలిగారు. ఆ ఫలితం కౌంటింగ్‌లో కనిపించింది. అయితే ఓటింగ్ శాతం గత ఎన్నికల కంటే ఎనిమిది శాతం వరకూ తగ్గడంతో లక్ష మెజార్టీని అందుకోలేకపోయారు. 

Also Read: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్య రాగం... ఆ విషయంలో కేసీఆర్ కు మద్దతిస్తానని కీలక వ్యాఖ్యలు

బద్వేలులో గత ఎన్నికల్లో బీజేపీ నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ సారి దాదాపుగా 21వేలకుపైగా ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నలభై వేల ఓట్ల మెజార్టీ వచ్చింది.  ఈ సారి అది రెండింతలు అయింది. ఇది తమ ప్రభుత్వ పాలనకు ప్రజామోదానికి సాక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: తెలంగాణలో రాజకీయ శూన్యత... అందుకే కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి... మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget